Posts

Showing posts with the label neethi kathalu

మనుషులు -రకాలు

Image
మనుషులు మూడు రకాలుగా ఉంటారు .        మొదటి రకం ఏ పనినైనా గొప్పగా ప్రారంభిస్తారు పది మందికి చెప్పుకుంటారు.ఏ ఉత్సాహంతో మొదలు పెట్టారో అదే ఉత్సాహాన్ని చివరిదాకా కొనసాగించరు.మొదలు పెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తారు.        రెండవరకం పని మొదలు పెట్టడానికి ముందే వంద ఆలోచిస్తారు అవుతాదా?లేదా? అవకపోతే ఎలా ఎం చేయాలి అని రకరకాలుగా ఆలోచించి సమయం వృధా చేస్తారు.మొత్తానికి పని మొదలు పెట్టరు.      మూడవ రకం  పని చిన్నదా ?పెద్దదా? అని ఆలోచించరు ఏ పని అయిన వీళ్ళ చేతిలో పడిందంటే పూర్తి కావాల్సిందే.పూర్తి చేసేదాక వదిలి పెట్టరు. కానీ అదే పనిని సంవత్సరాల తరబడి అయినా చాలా ఓపికగా చేస్తారు చివరకు విజయాన్ని సాధిస్తారు.   ఒక పని ఆరంభించినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనకడుగు వేయరాదు .లక్ష్యాన్ని చేరుకునే దాకా అహర్నిశలు కష్టపడాలి. ఈ సాధనలో కఠోర దీక్ష , అంతులేని  శ్రమ,దుఃఖము, త్యాగము అన్ని ఇమిడి ఉంటాయి. అలాంటి కొన్ని పురాణ కథలను మనం తెలుసుకుందాం. వాయి పుత్రుడు హనుమాన్ ,అతను అత్యంత బలశాలి అతనికి గురువు ఎవరో తెలుసా  సూర్యుడు. చిన్నతనంలోనే ...

పీత-కొంగ కథ .🦀🦢.

Image
ఈ రోజు పంచతంత్రం కథలలో పీత-కొంగ   కథ తెలుసుకుందాం. అనగనగా ఒక కొలను ఆ కొలనులో ఒక పీత నివాసం ఉంటుంది. ఒకసారి ఆ కొలను దగ్గరకు ఒక కొంగ వచ్చింది.అది ఆ కొలనులో దిగి ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టు నటించుతుంది రోజు ! అది రోజూ పీత, కొలనులో చేపలు చూస్తున్నాయి.అయితే ఆ చేపలు కానీ పీత కానీ కొంగది దొంగ జపం అని గుర్తించ లేకపోయినాయి.ఒకరోజు పీత కొంగ దగ్గరకు వచ్చి మహాత్మా! ఇక్కడ ఇన్ని చేపలు మీ కళ్ళ ముందు తిరుగుతున్న కూడా మీరు వాటిని పట్టి తినకుండా ఇలా జపం చేసుకుంటున్నారు దీనికి కారణం ఏమిటి అన్నది. అప్పుడు ఆ కొంగ మరింత ధ్యానంలో ఉన్నట్టు నటించింది.కొంగగారు మిమ్మల్ని నేను అడుగుతున్న అయిన సమాధానం చెప్పడం లేదు కారణం ఏమైనా ఉందా అని అడిగింది మళ్లి పీత. కొంగ మెల్లిగా కళ్ళు తెరిచి మీరు భక్తి శ్రద్ధలతో అడిగారు కాబట్టి చెబుతున్న విను,నువ్వు చెప్పినట్టు ఆ మధ్యదాక  నేను కూడా చేపలనే కాదు భగవంతుడు మాకు ఇచ్చిన నేను తినదగిన అన్ని జంతువులను తినేవాడిని.ఆ మధ్య కాలంలో నేను నివసించే చెట్టు కిందకు ఒక యోగి వచ్చాడు.ఆయనతో చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు.ఆ శిష్యులకు ఉపదేశం చేసేటపుడు నేను ఆ చెట్టు పైన...

లాభమా? -నష్టమా?

Image
అనగనగా ఒక పెద్ద అడవి దాని పేరు సుందరవనము.అది అతి సుందరంగా వుండడం చేతదానిని సుందరవనము అంటారు.ప్రతి అడవికి రాజు సింహమే కదా ఇక్కడ కూడా సింహమే రాజు ,కుందేలు మాత్రం మంత్రి . అడవిలో అన్నీ జంతువులు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది అక్క కొన్ని వృద్ధ జంతువులు కూర్చొని తమ తమ సమస్యల గురుంచి మాట్లాడుకుంటున్నాయి.        దూరం నుంచి ఆ మాటలు వింటుంది సింహం వారికి కనపడకుండా .ఆ జంతువులు మనము ఇప్పుడు ముసలి వాళ్ళము మనకు వేటాడే శక్తి లేదు కాబట్టి మన పిల్లలను బాధ పెట్టకుండా మనలో మనం ఆహారం ఐపోయి చనిపోదాం అని అంటున్నాయి.ఆ మాట విన్న సింహం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సింహం తన స్థావరనికి వచ్చి కుందేలును పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .జంతువులు అన్ని భయం భయంగా వచ్చాయి.అప్పుడు అక్కడ ఉన్న జంతువులను ఉద్దేశించి మన అడవిలో ఎవరికైనా అత్యవసరంగా సాయం చేయవలసి ఉందా అని అడిగింది, అన్ని ఆలోచించసాగాయి.కుందేలు టక్కున లేచి సాయం కోసం ఎదురు చూసేది కేవలం వృద్ధ ప్రాణులే అంది కుందేలు.ఐతే మీరందరు వృద్ధ జంతువుల సంరక్షణ కోసం సలహాలు,సూచనలు చేయవలసిందిగా ఆదేశించింది. రాజా మన...

ఆదిశక్తి....

Image
" యత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంత దేవతా " అన్నారు పెద్దలు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని ప్రతీతి.గౌరీశంకరులు అది దంపతులు వారు మానవాళికి ఆదర్శ దంపతులు. స్త్రీ ,పురుషులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ,గౌరవం, ప్రేమ ఉండాలి.నారాయణుడు లక్ష్మీదేవిని, శివుడు పార్వతిని, బ్రహ్మ సరస్వతిని గౌరవించారు అదే గౌరవం సమాజంలో స్త్రీల పట్ల ఉండాలి అని పురాణాలు చాటి చెప్పాయి.ఎక్కడో ఉన్న గుడిలోని దేవతమూర్తికి వంగి వంగి దండాలు పెడతాం ,అమ్మా కాపాడు అని ప్రార్దిస్తాం కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీ ,సరస్వతి, పార్వతిని మాత్రం చులకనగా చూస్తాం.స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నారు.స్త్రీల యొక్క ప్రయాణం ఎన్నో అవరోధాలను కలిగి ఉంటుంది.అయినా వారు అన్ని ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు.ప్రయాణం ముఖ్యం కాదు గమ్యస్థాననికి చేరుకోవడం ప్రధానం అంటారు పెద్దలు.స్త్రీల పట్ల దయ ,జాలి ,కరుణ ఉండాల్సిన అవసరం లేదు కానీ వారి హక్కులను నియంత్రించకుండా ఉంటే సరిపోతుంది.కాలం మారింది కానీ సనాతన సంప్రదాయాలు,కట్టుబాట్లు కొన్ని మారడం లేదు.అరవింద సమేత సినిమా లో ఆడవాళ్లకు రాజకీయలా...

చెడపకురా చెడేవు.....

Image
రామకృష్ణాపురంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పని చేసేవాడు .అతనికి  నలుగురు కొడుకులు రంగయ్య,రాజయ్య,రుద్రయ్య మరియు రాఘవయ్య.రాజయ్య, రంగయ్య, రుద్రయ్య బాగా తెలివినవాళ్ళు,రాఘవయ్య పాపం వట్టి అమాయకుడు.ఎవరు ఏమి చెప్పిన నమ్ముతాడు.రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలకు పెళ్లిళ్లు చేసాడు సాంబయ్య. అతని దిగులు అంత చిన్న కొడుకు గురించే, అతని అమాయకత్వానికి ఎవరూ పిల్లను ఎవరు ఇవ్వలేదు.అలాగే ఉండిపోయాడు.కొన్ని రోజులకు సాంబయ్యకు జబ్బు చేసింది రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు వారి పిల్లలను భార్యలను చూసుకుంటూ సాంబయ్యను పట్టించుకునేవారు కాదు.రాఘవయ్య తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు .పూర్తిగా అతని ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు.అతను చనిపోయాక అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత లాయరు వీలునామా తెచ్చి ఇచ్చాడు ఆస్థులన్ని సమంగా పంచుకోవడానికి.సాంబయ్య వీలునామాలో రాఘవయ్యకు కొంచెం ఎక్కువగా ఆస్తి రాసాడు అది చూసి మిగిలిన అన్నలు ఓర్వలేక ఇది మేము చూసుకుంటాం అని లాయరును పంపించి వేశారు. రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు మంచి తరి పొలాన్ని తీసుకొని ఊరు అవతల పనికిరాని మెట్టభూమి ఇచ్చారు.ఇంకా అతని దగ్గర ఒక కుంటి పిల్ల...

నక్క తెలివి

Image
అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి.ఆ అడవికి రాజు మృగరాజు సింహం .సింహం మంచిదే కానీ దాని దగ్గర ఉన్న సైన్యంలో తోడేలు, నక్క,రాబందు ఉండేవి.సింహం సైన్యంలో నక్క అసలు మంచిది కాదు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఇతరులను బలి చేసేది.ఒకరోజు సింహం పర్యటనకు వెళ్ళింది అన్ని జంతువులు ఈ అడవిలో ఎలా ఉన్నాయి నేను అంటే  అసలు బయపడుతున్నాయా లేదా!అని అంతటా తిరిగింది. ఏనుగు దగ్గరకు వచ్చింది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది అది చెప్పే లోపే నక్క కల్పించుకొని వాళ్లకు ఏమి సమస్యలు లేవు రాజు గారు అవి ఇంకా ఇష్టారాజ్యంగా తిరిగి అడవులను పాడు చేస్తున్నాయి వెంటనే ఏనుగులు ఎం చెప్పాలో అర్థం కాక తల దించుకున్నాయి.మృగరాజు ఏనుగులను మంద లించాడు. ఆ తర్వాత పక్షులను అడిగాడు ,వారు అన్ని కలిపి ఒకటే గొంతుతో నక్కను మాట్లాడనియక మాకు చాలా సమస్యలు ఉన్నాయి.అడవిలో మేము గూడు కట్టిన చోట ఇంకొకరిని రానివ్వకండి .మాకు చాలా కష్టం అవుతుంది లేకపోతే మాకు అందరికి ఒక దగ్గర మంచి గూళ్లు కట్టించండి అన్నాయి.వెంటనే నక్క మీకు గుళ్ళు కట్టడానికి డబ్బులు ప్రస్తుతం ఖాజానలో లేవు అవి సర్దిబాటు ఐతే కడతాం అన్నది సింహం పేరుకు రాజు అయిన నక్క మా...

కలసి ఉంటే కలదు సుఖం

Image
అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి నలుగురు సంతానం.నలుగురు కొడుకులు,కొడళ్లతో ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది.ఆ ఊరిలో అందరూ మీరు ఎప్పుడు ఇలా ఎలా కలిసి వుంటారు అని అనుకుంటారు.ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక అతిధి వచ్చాడు అతను వాళ్లలో వాళ్లకు ఎలాగైనా గొడవ పెట్టాలి అనుకుని వచ్చాడు.అత్త సీతమ్మ వంట పూర్తి చేసింది ,పెద్దకొడలికి ఆ కూర ఒక అయిదు నిముషాల తర్వాత కొంచెం ఉప్పు వేసి దించు అని చెప్పి ఆమె బయటకు వెళ్ళింది.పెద్దకొడలు సరే అన్నది ఇంతలో బట్టలు అరబెట్టేది వుందని రెండవ కోడలికి చెప్పి వెళ్ళింది,ఆమె కూడా సరే అన్నది అప్పుడే వాళ్ళ ఆయన పిలిచేసరికి వెళ్ళింది.మూడవ కోడలికి ఉప్పు వేసి దించమని చెప్పింది.ఆమెకు నీళ్లు పట్టేది ఉందని వెళ్తూ వెళ్తూ చిన్న కోడలికి చెప్పి వెళ్ళింది.చిన్న కోడలు సరే అని ఉప్పు వేసి దించింది.నీళ్లు పట్టి తిరిగి వచ్చిన మూడవ కోడలు ఉప్పు వేసి కలిపింది.భర్త దగ్గర నుండి వచ్చిన రెండవకోడలు చెల్లి ఉప్పు వేసిందో లేదో అని ఉప్పు వేసి కలిపింది.ఆ తర్వాత కొద్ది సేపటికి వచ్చిన పెద్ద కోడలు నా చెల్లి  ఉప్పు వేసిందో లేదో అని ఆమె కూడా ఉప్పు వేసింది.మధ్యాహ్నం భోజనానికి ...

ఐకమత్యమే మహాబలం.

Image
ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .

గాడిద తెలివి

Image
అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతను ఒక కుక్కను,గాడిదను పెంచుకున్నాడు.కుక్కను కాపలాగా ఉంచి గాడిదను పట్నానికి తీసుకోని వెళ్ళాడు అక్కడ నుండి సరుకులు అన్ని తెచుకునేవాడు.ఇలా రోజులు గడిచిపోతున్నాయి.,గాడిదకు కుక్క మీద ఎక్కువ అసూయ పెంచుకుంటుంది.ఒకరోజు ఇంట్లో వాళ్ళు అందరూ నిద్రిస్తుండగా దొంగలు వచ్చారు వారిని చూసి కుక్క మొరిగింది, అందరూ లేచి దొంగలను తరిమికొట్టారు. గాడిదకు కోపం వచ్చింది దానిని మెచ్చుకొని ఇంకా గారబం చేశారు.గాడిద అరిచింది ఈ సారి దానిని కొట్టాడు రైతు రామయ్య. కోపం తెచ్చుకొని ఎలాగైనా వీరికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది.పట్నానికి సరుకులు తేవడానికి వెళ్ళేటప్పుడు నదిని దాటాలి,అప్పుడు నేను పడిపోయినట్టు నటిస్తాను అన్ని సరుకులు పడిపోతాయి అనుకుంది.సరుకులు తీసుకొని వస్తుండగా నదిలో పడిపోయింది దానిలో సరుకులు పాడైపోయాయి.ఉప్పు బస్తా మొత్తం కరిగిపోయింది గాడిదకు ఇది ఎదో మాయనదివలె ఉంది అని భావించి ఏ రోజు కి ఏ పని లేదు అని సంతోషంగా ఇంటికి వెళ్ళింది .రైతు మాత్రం గాడిదకు ఏమైనా దెబ్బలు తగిలాయి అని అనుకోని డాక్టర్ ని తెచ్చాడు మందులు ఇచ్చాడు .రెండు రోజులు ఏ పని చెప్పలేదు  అది...

కష్టేఫలి

Image
  అనగనగా ఒక ఊరిలో ఒక కోడి,ఎలుక ,చిలుక, బాతులు స్నేహితులు .ఐతే ఎలుక ,చిలుక, బాతు ఏ పని చేయకుండా ఎప్పుడూ కోడి తోనే అన్ని పనులు చూపిస్తూ ఉండేవి.ఎలాగైనా వాటికి బుద్ది చెప్పాలి అని ఆ కోడి నిర్ణయించుకుంది. పొద్దున్న లేవగానే ఈ ఇల్లు ఎవరు ఉడుస్తారు? అని అన్నది.నేనుకాదు నేను కాదు అని చిలుక ,ఎలుక ,బాతు అన్నాయ్. సరే నేనె ఉడుస్తా అని ఉడిచింది.గిన్నెలు ఎవరు తోముతారు అని అడిగింది నేను తోమను నేను తోమను అని అన్ని పారిపోయారు.గిన్నెలు కడిగింది కోడి.ధాన్యం ఎవరు సేకరిస్తారు అని అంటే చిలుక, ఎలుక ,బాతు మా వల్ల కాదు అని వెళ్ళిపోయాయ్. కోడి పాపం బెంగగా వెళ్లి ధాన్యం సేకరించింది,వంట చేసింది.ఈ భోజనం ఎవరు చేస్తారు అని కోడి అడిగింది ,మేము తింటాం మేము తింటాం అని అన్ని ముందుకు వచ్చాయి. దానితో కోపం వచ్చిన కోడి నేను ఎవరికి పెట్టను అని అంటుంది.ఎందుకు అని అడుగుతాయి చిలుక,ఎలుక ,బాతు పొద్దున్నుంచి ఒక్కదాన్నే అన్ని చేస్తుంటే ఎవరు సహాయం చేయడానికి రాలేదు తినడానికి మాత్రం వచ్చారు. అందరూ కలిసి పని చేయాలి కలిసి తినాలి తప్ప ఒక్కరే చేయాలి నేను ఏమి చేయను అని ఉండకూడదు..కష్టపడితేనే ఫలితం వస్తుంది అని కోడి చెప్తుంది.

రామచిలుక కథ

Image
అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక వేటగాడు వున్నాడు.అతను వేటకు వెళ్లి రెండు రామచిలుకలను పట్టి తెచ్చాడు.ఆ చిలుకలను రాజభవననికి తెచ్చి రాజుకు బహుకరించాడు. ఆ రాజు ఈ చిలుకలను మంత్రికి మరియు సేనాధిపతికి ఇచ్చాడు.మంత్రికి,సేనాధిపతికి ఒక్క నిముషం కూడా పడదు . రాజు  రామచిలుకకు ఎవరైతే మాటలు నేర్పిస్తారో వారికి బహుమతులు ఇస్తాను అని చెప్పాడు .మంత్రి ఇంటికి వెళ్లి భార్యతో దీనికి మాటలు నేర్పించు మనకు అన్ని బహుమతులు రావాలి అంటాడు అది విన్న మంత్రి భార్య ఎలా అండి అని అడిగింది. రాజు గారు దీనికి మాటలు నేర్పిస్తే బహుమతి ఇస్తా అన్నారు అంటాడు. మంత్రి గారి భార్య సరే అంటుంది. సేనాధిపతి కూడా భార్యకు విషయం చెప్పి చిలుకను ఇస్తాడు. మంత్రి భార్య ఒక సంగీతం నేర్పించే గురువు అవడడం చేత అది అన్ని పాటలు ,పద్యాలు మంచి మాటలు నేర్చుకుంది. సేనాధిపతి భార్య పదవి ఉందని అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో గొడ్డు చాకిరి చేపిస్తూ అందరిని తిడుతూ ఉంటుంది అది విన్న చిలుక ఆ మాటలు తిట్లు నేర్చికుంది.మంత్రి ఎప్పుడు రాజు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు కనుక చిలుక కూడా రాజు గారి మీద గౌరవం పెంచుకుంటుంది సేనాధిపతి రాజుకి వ్యతిరేకంగా ఇత...

మౌన వ్రతం

Image
రాఘవ పురం అనే గ్రామం ఉండేది.ఆ గ్రామంలో ప్రజలు అంతా సుఖ శాంతులతో జీవించసాగారు.అలాంటి గ్రామం లోకి ఒక వదరుబోతు వచ్చాడు అతను గ్రామంలోని ప్రజలు ఇంత సుఖంగా ఉండడం చూడలేక పోయాడు. అతను అక్కడి వారందరితో స్నేహం చేసాడు, అలా కొంత కాలం మంచిపేరు ,నమ్మకం సంపాదించాడు.  తర్వాత ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు మొదట్లో ఎవరూ నమ్మకపోయేవారు తర్వాత తర్వాత నమ్మడం మొదలు పెట్టారు దీని వలన ఆ గ్రామం లోని ప్రజలు నిత్యం ఏదో ఒక సంఘర్షణ పడుతుండేవారు, దానితో విసుగు చెందిన గ్రామ పెద్దలు ఒక సాధువు దగ్గరకు వెళ్ళి వాళ్ళ గోడు చెప్పారు .ఉన్నట్టుండి మా గ్రామంలో అంతః కలహాల వల్ల గ్రామాభివృద్ధి జరగడం లేదు అని చెప్పారు. ఆ సాధువు మీరు ఒక నెలంతా మౌనవ్రతం పాటించండి అని చెప్పాడు .గ్రామపెద్దలకు ఏమి బోధ పడలేదు అయిన సాధువు చెప్పడం వల్ల ప్రజలంతా మౌనవ్రతం పాటించాలని చాటింపు వేసారు.గ్రామంలో ప్రజలు మౌనంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవించారు.ఊరు ఊరు అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది గ్రామ పెద్దలు సంతోషించి సాధువు దగ్గరకు వెళ్లారు అయ్యా మీరు చెప్పిన్నట్టే నెల నుండి మేము వ్రతం చేస్తున్నాం అందరూ సంతోషంగా వున్నారు అని ...

చిన్న చేప కథ

Image
అనగనగా కథలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఇది ఒక చేప పిల్ల కథ. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది,అందులో ఒక చేపల కుటుంబం నివసిస్తూ ఉండేది.అందులో అందరికన్నా చిన్నది అయిన చేప ఒకరోజు బయటకు వచ్చి ఈదడం నేర్చుకుంటుంది.అక్కడే ఒక  కోమ్మ పైన ఉన్న పక్షిని చూసి అది అంతలా ఎలా ఎగురుతుంది అని ఆలోచించింది దానితో   దగ్గరగా వెళ్లి నేను ఈదుతున్న మొత్తం నీటిలోనే ఉంటాను కానీ నువ్వు మాత్రం రెక్కలతొ ఎంత దూరం అయిన ప్రయాణం చేయగలవు అని బాధ  పడుతుంది .ఆ పక్షి అలా కాదు అమ్మ నువ్వు జల జీవివి నీకు రెక్కలు ఉండవు .నువ్వు ఈదుతున్నావు నేను ఈదలేను అని బాధ పడుతున్నాన అని అంటుంది . ఆ చిన్న చేప తన తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మనకు రెక్కలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తుంది, అప్పుడు ఆ తల్లి చేప భగవంతుడు ఒక్కో ప్రాణిని ఒక్కో లాగా సృష్టించాడు అని చెపుతుంది అయిన వినకుండా మారం చేస్తుంది. తెల్లవారుజామున ఆ తల్లి చేప  అడవిలో ఉన్న జంతువులు అన్నింటినీ సమావేశం కావాలిసిందిగా కోరింది, కోరిన విధంగా అన్ని జంతువులు చెరువు చుట్టూ మూగారు .తల్లి చేప పిల్ల చేపను తీసుకొని వచ్చి చూడు ఇవన్ని అడవిలోని రకరకాల జంతువులు కోతి ,నక్...

ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు...

సెప్టెంబర్ 5 న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు ,ఏ రోజు ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కనుక. గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి నడిపే మార్గాన్ని చూపే వ్యక్తి. అది ఎవరైనా కావచ్చు మనను మంచి వైపు నడిపించేవాడు ఎల్లప్పుడూ గురువే అయి ఉంటాడు. సూర్యుడు లేకుండా వెలుగు లేదు, ఔషదం సేవించకుండా రోగం నశించదు అలాగే గురువు లేకుండా  జ్ఞానం లభించదు అని పెద్దల మాట. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు కు అత్యంత విలువైన ప్రాముఖ్యత వుంటుది.మన తల్లిదండ్రులు మనకు జన్మ ఇస్తే గురువు పునర్జన్మ ఇస్తాడు. ఈ సందర్భంగా ఒకచిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో స్వేచ్ఛ అని ఒక అల్లరి పిల్ల ఉండేది తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అవడం వల్ల అల్లారు ముద్దుగా పెంచారు .ఆమెను పాఠశాలలో చేరిస్తే అల్లరి తగ్గుతుంది అని భావించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు, కానీ తీరు మారలేదు,ఆమె ఒకరోజు అటుగా వెళుతున్న గురువు పంచె ను లాగింది దాని వల్ల అతడు కింద పడిపోయారు  తలకు గాయం అయింది అది చూసి పరుగెత్తింది స్వేచ్ఛ, భయంతో వణికిపోతోంది ఆమెను చూసి గురువు చూసావా నువు చేసిన అల్లరి పని వల్ల నాకు రక్తం వస్తుంది ...