Skip to main content

మనుషులు -రకాలు

మనుషులు మూడు రకాలుగా ఉంటారు .
       మొదటి రకం ఏ పనినైనా గొప్పగా ప్రారంభిస్తారు పది మందికి చెప్పుకుంటారు.ఏ ఉత్సాహంతో మొదలు పెట్టారో అదే ఉత్సాహాన్ని చివరిదాకా కొనసాగించరు.మొదలు పెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తారు.
       రెండవరకం పని మొదలు పెట్టడానికి ముందే వంద ఆలోచిస్తారు అవుతాదా?లేదా? అవకపోతే ఎలా ఎం చేయాలి అని రకరకాలుగా ఆలోచించి సమయం వృధా చేస్తారు.మొత్తానికి పని మొదలు పెట్టరు.
     మూడవ రకం  పని చిన్నదా ?పెద్దదా? అని ఆలోచించరు ఏ పని అయిన వీళ్ళ చేతిలో పడిందంటే పూర్తి కావాల్సిందే.పూర్తి చేసేదాక వదిలి పెట్టరు. కానీ అదే పనిని సంవత్సరాల తరబడి అయినా చాలా ఓపికగా చేస్తారు చివరకు విజయాన్ని సాధిస్తారు.
  ఒక పని ఆరంభించినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనకడుగు వేయరాదు .లక్ష్యాన్ని చేరుకునే దాకా అహర్నిశలు కష్టపడాలి. ఈ సాధనలో కఠోర దీక్ష , అంతులేని  శ్రమ,దుఃఖము, త్యాగము అన్ని ఇమిడి ఉంటాయి.
అలాంటి కొన్ని పురాణ కథలను మనం తెలుసుకుందాం.
వాయి పుత్రుడు హనుమాన్ ,అతను అత్యంత బలశాలి అతనికి గురువు ఎవరో తెలుసా  సూర్యుడు. చిన్నతనంలోనే హనుమంతుడు ఆకాశంలో ఎర్రగా ఉన్న సూర్యుని చూసి పండు అనుకోని పట్టుకోబోయాడు.అతని చేతి కాలింది ఇంద్ర దేవుడికి కోపం వచ్చి హనుమంతుడిని వజ్రాయుదంతో కొట్టాడు, అప్పుడు హనుమాన్ చేతి విరిగింది.అది చూసిన వాయు దేవుడికి కోపం వచ్చి గాలిని మొత్తం ఆపేశాడు.అందరికి గాలి లేకుండా పోయింది .
దేవతలు అంతా బ్రతిమిలాడితే అప్పుడు వాయుదేవుడు గాలివీచాడు.అప్పటి నుండి హనుమంతుడు సూర్యుడి పట్ల ఆకర్షితుడయ్యాడు.కొంచెం పెద్దయ్యాక విద్యాభ్యాసానికి  హనుమాను సూరీడిని ఎంచుకున్నాడు.సూర్యుడు నాకు కుదరదు అని చెప్పాడు,నేను ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాను ఒక దగ్గర ఉండని నేను నీకు ఎలా విద్య నేర్పగలను అన్నాడు .అయినా కూడా పర్వాలేదు నేను మీతో పాటే తిరుగుతూ విద్య నేర్చుకుంటా అన్నాడు.అతని జిజ్ఞాసకు సరే అన్నాడు.అప్పటినుండి అతన్ని శిష్యుడిగా స్వీకరించాడు అతని ద్వారా నాలుగు వేదాలను ఇతర విద్యలను నేర్చుకున్నాడు.
హనుమంతుడిని చూసి నేటి తరం విద్యార్థులు గురువును ఎలా గౌరవించాలి,ఎంత దీక్షతో విద్యాభ్యాసం చేయాలి అని నేర్చుకోవాలి. నేర్పను అని చెప్పినా కూడా వినకుండా ఒప్పించి తాను విద్య నేర్చుకున్నాడు.ఎంత దూరం అయినా మధ్యలో వదిలి పెట్టకుండా తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు.
  అలాంటి మరో కథ, ఉత్తనపాదుడికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యతో పుట్టిన వాడు ధ్రువుడు ఐదేళ్ల వయసులో అతడు తన తండ్రి తొడపై కూర్చోవాలి అని అనుకుంటే అతడిని సవతి తల్లి కూర్చోనివ్వలేదు.తనను తన తల్లిని ఘోరంగా అవమానించింది.ఆ అవమాన భారంతో మనసు వేదనకు గురి అయింది.అప్పుడు అతను జీవితంలో ఎలా అయినా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గట్టి సంకల్పం చేసుకున్నాడు.అప్పటి నుండి నారద మహర్షి ఉపదేశంతో తపస్సు చేసాడు. శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై సూర్య చంద్రులు,సప్తఋషులు ప్రదక్షిణ చేసే శాశ్వత స్థానాన్ని వరంగా ప్రసాదించాడు.అదే ఆకాశంలో ధ్రువ నక్షత్రం.తనకు జరిగిన అవమానాన్ని తలచుకొని బాధ పడకుండా ,కృంగిపోకుండా జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలని పట్టుదలతో శ్రమించాడు.
  మహాభారతంలో పాండవులు కూడా కౌరవులు తమను చిన్నప్పటి నుండి ఎంత బాధ పెట్టినా కూడా అడుగడుగునా అవమానాలు,అగచాట్లు పడ్డారు.జూదంలో తమను అధర్మాంగా ఓడించినా కూడా వారు ధర్మాన్ని వీడలేదు.పన్నెండేళ్ల అజ్ఞాతంలో ధర్మరాజు ఒక మంత్రిగా,భీముడు ఒక వంటవాడిగా, నకుల సహదేవులు ఆవుల రక్షకులుగా ,అర్జునుడు అయితే బృహన్నలగా ,పాంచాలి సైరన్ద్రిగా  ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఆ హస్తీనాపురానికి వచ్చి రాజు  అయ్యాడు ధర్మరాజు. పాశుపతాస్త్రం కొరకు అర్జునుడు చేసిన కఠోర దీక్ష గూర్చి గుర్తు చేసుకోవాలి. అశ్విని దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నకుల సహదేవులు నీళ్లలో కొన్ని రోజులు దీక్ష చేశారు.మన పురాణాలు ఇతిహాసాలు మనకు నేర్పించేది ఒకటే ఎల్లవేళలా పనిని భక్తితో పూర్తి చేయాలి.భక్తి అంటే దైవ భక్తి కాదు పని పట్ల భక్తి, శ్రద్ధ అని అర్థం.
సంకల్ప సిద్ధితో చేసే ప్రతి పనీ విజయాన్నిస్తుంది అందుకే ఆరంభ శురత్వం పనికి రాదు చివరి దాకా ఆ పని చేయాలి. మనం కేవలం పనిని మాత్రమే చేయాలి ఫలితం వదిలేయాలి ఏదో ఒక రోజు మనం చేసిన ఆ పనికి ప్రతిఫలం ఖచ్చితంగా చూస్తాం.ధర్మం కొరకు నిలబడాలి అధర్మాన్ని విడాలి.





Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .