Posts

Showing posts with the label moral stories

శ్రీకృష్ణ రాయబారం .

Image
మహాభారతంలో అన్ని కథలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నట్లే ఈ శ్రీకృష్ణ రాయబారం కూడా అలాంటిదే. రాయబారం అంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం కాదు ఇరువురి మధ్య ఉన్న సమస్య గురించి లోతైన అవగాహన ఉండాలి.సమస్య తెలిస్తేనే కదా ! దారి తెలుస్తుంది.మహాభారతం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితాలకు ఒక అర్థవంతమైన పుస్తకం. పాండవులను కౌరవులు అడుగడుగునా హింసిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలో వారు కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్తాన్ని చూడడానికి ఒకరోజు దుర్యోధనుడు వెళ్తాడు అతను ఆ భవనాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందాడు,దానితో అసూయ చెందాడు.ఎలాగైనా ఇంద్రప్రస్తాన్ని కూడా చేజిక్కించుకోవాలి అని పన్నాగాలు పన్నాడు.శకుని మామ సహాయంతో మాయ పాచికలు తయారు చేసాడు.ధర్మరాజు జూదానికి బానిస కాదు కాని అతనికి జూదం అంటే ప్రాణం.   ధర్మరాజును కౌరవులు జూదానికి ఆహ్వానించారు ,వారి మనస్తత్వం తెలిసి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు.వారు ఆహ్వానించనందువల్ల మనం వెళ్ళాలి అని అందరిని కూడా గట్టుకొని హస్తీనాపురానికి వచ్చాడు.శకుని తన చాకచక్యంతో పండిత పామర జనాలను మభ్య పెడుతూ ధర...

మనుషులు -రకాలు

Image
మనుషులు మూడు రకాలుగా ఉంటారు .        మొదటి రకం ఏ పనినైనా గొప్పగా ప్రారంభిస్తారు పది మందికి చెప్పుకుంటారు.ఏ ఉత్సాహంతో మొదలు పెట్టారో అదే ఉత్సాహాన్ని చివరిదాకా కొనసాగించరు.మొదలు పెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తారు.        రెండవరకం పని మొదలు పెట్టడానికి ముందే వంద ఆలోచిస్తారు అవుతాదా?లేదా? అవకపోతే ఎలా ఎం చేయాలి అని రకరకాలుగా ఆలోచించి సమయం వృధా చేస్తారు.మొత్తానికి పని మొదలు పెట్టరు.      మూడవ రకం  పని చిన్నదా ?పెద్దదా? అని ఆలోచించరు ఏ పని అయిన వీళ్ళ చేతిలో పడిందంటే పూర్తి కావాల్సిందే.పూర్తి చేసేదాక వదిలి పెట్టరు. కానీ అదే పనిని సంవత్సరాల తరబడి అయినా చాలా ఓపికగా చేస్తారు చివరకు విజయాన్ని సాధిస్తారు.   ఒక పని ఆరంభించినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనకడుగు వేయరాదు .లక్ష్యాన్ని చేరుకునే దాకా అహర్నిశలు కష్టపడాలి. ఈ సాధనలో కఠోర దీక్ష , అంతులేని  శ్రమ,దుఃఖము, త్యాగము అన్ని ఇమిడి ఉంటాయి. అలాంటి కొన్ని పురాణ కథలను మనం తెలుసుకుందాం. వాయి పుత్రుడు హనుమాన్ ,అతను అత్యంత బలశాలి అతనికి గురువు ఎవరో తెలుసా  సూర్యుడు. చిన్నతనంలోనే ...

కచుడు -దేవయాని కథ..

Image
మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో  ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం.             హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా  మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా  బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు. దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు.      దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి  దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు. శుక్రాచార్యుడుకి దేవయాని...

లాభమా? -నష్టమా?

Image
అనగనగా ఒక పెద్ద అడవి దాని పేరు సుందరవనము.అది అతి సుందరంగా వుండడం చేతదానిని సుందరవనము అంటారు.ప్రతి అడవికి రాజు సింహమే కదా ఇక్కడ కూడా సింహమే రాజు ,కుందేలు మాత్రం మంత్రి . అడవిలో అన్నీ జంతువులు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది అక్క కొన్ని వృద్ధ జంతువులు కూర్చొని తమ తమ సమస్యల గురుంచి మాట్లాడుకుంటున్నాయి.        దూరం నుంచి ఆ మాటలు వింటుంది సింహం వారికి కనపడకుండా .ఆ జంతువులు మనము ఇప్పుడు ముసలి వాళ్ళము మనకు వేటాడే శక్తి లేదు కాబట్టి మన పిల్లలను బాధ పెట్టకుండా మనలో మనం ఆహారం ఐపోయి చనిపోదాం అని అంటున్నాయి.ఆ మాట విన్న సింహం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సింహం తన స్థావరనికి వచ్చి కుందేలును పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .జంతువులు అన్ని భయం భయంగా వచ్చాయి.అప్పుడు అక్కడ ఉన్న జంతువులను ఉద్దేశించి మన అడవిలో ఎవరికైనా అత్యవసరంగా సాయం చేయవలసి ఉందా అని అడిగింది, అన్ని ఆలోచించసాగాయి.కుందేలు టక్కున లేచి సాయం కోసం ఎదురు చూసేది కేవలం వృద్ధ ప్రాణులే అంది కుందేలు.ఐతే మీరందరు వృద్ధ జంతువుల సంరక్షణ కోసం సలహాలు,సూచనలు చేయవలసిందిగా ఆదేశించింది. రాజా మన...

సజ్జన సాంగత్యం

Image
అది వర్షాకాలం గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కురు దేశంలో వున్నాడు .వర్షాల కారణంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లడం కష్టం కాబట్టి ఆ నాలుగు నెలలు అక్కడే వున్నారు.ఒకరోజు ఆనందుడు బిక్షాటనకు బయలుదేరాడు .అతను అనుకోకుండా అవంతిక అనే వేశ్య ఇంటికి బిక్షకు వెళ్ళాడు.ఆమె అతనికి భిక్ష వేసి వర్షాల కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారని విన్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా ఇంట్లో ఉండొచ్చు అంది . దానికి ఆనందుడు బిక్షువులు ఎక్కడ ఉండాలో తధగతుడు నిర్ణయిస్తాడు అని వారిని అడిగి చెబుతానన్నాడు.అది విన్న బుద్దుడు ఆమెనే ఆహ్వానించినపుడు నువ్వు ఆ ఇంట్లో విడది  చేయడంలో తప్పులేదు నువ్వు అక్కడికి మకాం మార్చుకో అన్నాడు.   అలా ఆనందుడు వేశ్య ఇంటికి వెళ్ళాడు.అవంతిక చక్కటి అతిధి మర్యాదలతో స్వాగతం పలికి ఆహ్వానించింది.అతనికి చినిగిపోయిన బట్టలు చూసి కొత్తవి కుట్టించింది.ఆనందుడికి చలి నుండి రక్షణ కలిగింది.అవంతిక వేళకు అతనికి వేడి వేడి భోజనం అందిస్తూ ఆనందుడు చెప్పే హితోక్తులు శ్రద్ధగా వినేది. ఆ మాటల ప్రభావం చేత అవంతిక కొద్దిరోజుల్లోనే అతడి శిష్యురాలు అయింది .అయితే ఒక బిక్షువు వేశ్య ఇంట్లో ఉండడం తోటివార...

పులి-బాటసారి కథ

Image
పంచతంత్ర కథలు చాలా గొప్ప నీతిని కలిగి ఉంటాయి, వీటిని విష్ణుశర్మ గారు రచించారు.అందులో ఒకటి పులి -బాటసారి కథ . అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి అవతల చెరువు ఒడ్డుకు ఒక పులి నివాసం ఉంది అది చాలా ముసలి పులి.అయితే దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంది .ఒకరోజు అటుగా వెళుతున్న బాటసారిని చూసి దగ్గరగా వెళ్లి ఓ బ్రహ్మణోత్తమా!నువు చూడడానికి చాలా పుణ్యాత్ముడి లాగా కనిపిస్తున్నావు.నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది దీనిని నేను ఎవరైనా పుణ్యాత్ముడికి దానం చేయాలని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నా.నువ్వు కనిపించావు ఇదిగో  ఒకసారి ఆ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ  కంకణం తీసుకో అన్నది పులి .      సరే కానీ నువ్వు క్రూర జంతువువు నేను నిన్ను ఎలా నమ్మాలి అని భయంతో కూడిన ధైర్యంతో ప్రశ్నించాడు. దానికి ఆ ముసలి పులి చూడు నాయనా నన్ను చూస్తే కనబడుత లేదా నేను ఎంత ముసలి దానినో, నా గోర్లు అన్ని మొద్దుబారినవి ,పళ్ళు మొత్తం ఉడిపోయినవి చేతులు కాళ్లు లేవడం లేదు ఎన్నో రోజుల నుండి చాలా మంది ప్రాణాలు తీసిన తప్పుకు పరిహారంగా ఈ దానం చేద్దాం అనుకుంటున్నా అన్నది పులి.పులి చాలా నమ్మకంగా చెప్పే సరికి అతను స్నానం చేయడానికి చెరువులోకి ద...

చెడపకురా చెడేవు.....

Image
రామకృష్ణాపురంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పని చేసేవాడు .అతనికి  నలుగురు కొడుకులు రంగయ్య,రాజయ్య,రుద్రయ్య మరియు రాఘవయ్య.రాజయ్య, రంగయ్య, రుద్రయ్య బాగా తెలివినవాళ్ళు,రాఘవయ్య పాపం వట్టి అమాయకుడు.ఎవరు ఏమి చెప్పిన నమ్ముతాడు.రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలకు పెళ్లిళ్లు చేసాడు సాంబయ్య. అతని దిగులు అంత చిన్న కొడుకు గురించే, అతని అమాయకత్వానికి ఎవరూ పిల్లను ఎవరు ఇవ్వలేదు.అలాగే ఉండిపోయాడు.కొన్ని రోజులకు సాంబయ్యకు జబ్బు చేసింది రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు వారి పిల్లలను భార్యలను చూసుకుంటూ సాంబయ్యను పట్టించుకునేవారు కాదు.రాఘవయ్య తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు .పూర్తిగా అతని ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు.అతను చనిపోయాక అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత లాయరు వీలునామా తెచ్చి ఇచ్చాడు ఆస్థులన్ని సమంగా పంచుకోవడానికి.సాంబయ్య వీలునామాలో రాఘవయ్యకు కొంచెం ఎక్కువగా ఆస్తి రాసాడు అది చూసి మిగిలిన అన్నలు ఓర్వలేక ఇది మేము చూసుకుంటాం అని లాయరును పంపించి వేశారు. రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు మంచి తరి పొలాన్ని తీసుకొని ఊరు అవతల పనికిరాని మెట్టభూమి ఇచ్చారు.ఇంకా అతని దగ్గర ఒక కుంటి పిల్ల...

మూడు చేపల కథ..🐟🐋🐳

Image
ఈ కథ భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన కథ మహాభారతానికి సంబంధించిన మూడుచేపల కథ. అనగనగా ఒక చెరువు ఉండేది అందులో దీర్గదర్శి ,దీర్ఘసుత్రుడు,ప్రాప్తకాలజ్ఞుడు అనే మూడు చేపలు ఉండేవి.ఆ చెరువు ఎల్లప్పుడూ నీటిని కలిగి ఉండేది కావున ఆ చేపలు సంతోషంగా ఉండేవి.ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు కదా! ఆ చెరువులోకి నీళ్లు రావడం తగ్గిపోయాయి,దాంతో కంగారు పడిన దీర్ఘదర్శి మిగిలిన రెండు చేపలతో చూడండి మిత్రులారా ఈ చెరువు కొన్ని రోజులలో ఎండిపోతుంది.మనం ఇక్కడ నుండి బయటపడి వేరే దారి చూసుకోవాలి అన్నది.అది విన్న దీర్ఘసుత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు ఎప్పుడో ఎండిపోయే చెరువు గురించి ఇప్పటి నుండి ఎందుకు కంగారు పడడం ఎండిపోయినపుడు మనం ఎటైనా వెళ్లిపోదాం అన్నాయి.దీర్గదర్శి వీళ్లకు చెప్పడం వృధా అని మెల్లిగా పిల్లకాలువలోకి వెళ్ళింది ఆ తర్వాత పెద్ద చెరువులోకి దూకింది.సంతోషంగా జీవించసాగింది.      కొంతకాలానికి దీర్గదర్శి చెప్పినట్టే చెరువు ఎండిపోయింది అది చిన్న మడుగు లాగా కనిపించింది ఎండిపోయిన చెరువులో చేపలు ఎక్కువగా ఉంటాయి అని జాలరులు వల వేశారు. ప్రాప్తకాలజ్ఞుడు మొత్తం బురద అంటించుకుంది చనిపోయినట్టు నటించింది...

తెనాలి వారి బంగారు మామిడి పండ్లు.

Image
తెలుగు కథలలో తెనాలి రామలింగని కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.రాయల వారి ఆస్థానంలో తెనాలి రామలింగడు మాత్రమే చాలావరకు సమస్యలను పరిష్కరించారు.తన యుక్తులతో ఇతరుల కుటీలత్వాన్ని రాజుగారి దగ్గర బయటపెట్టాడు. రాయల వారి తల్లి జబ్బుతో బాధపడుతుంది. వైద్యుడు పరీక్షించి తన కోరికలు ఏవైనా ఉంటే తీర్చాలిసిందిగా ఆదేశించాడు.ఆమె తన ఆఖరి కోరికగా మామిడి పండ్లు తినాలని ఉంది అని అన్నది,కానీ అది మామిడి పండ్లు వచ్చే కాలం కాదు కాబట్టి అతనికి లభించలేదు ఆమె ఆ కోరికతో కాలం చేసింది.రాయలవారు బాధపడ్డాడు ఒక పండితుడిని కలిసి విషయం చెప్పాడు.ఆ పండితుడు దోషం జరిగింది పరిహారం చేయాలి అని చెప్పి బంగారు మామిడిపండ్లు పంచాలని చెప్పాడు.రాజుగారు తెచ్చి బంగారు మామిడిపండ్లను పంచాడు.చాలా వరకు ఆ పండ్లను పండితుడి సన్నిహితులు తీసుకున్నారు.విషయం తెలుసుకున్న తెనాలి రామలింగడు వాళ్ళ మోసాన్ని బయటపెట్టాలి అనుకున్నాడు.మా తల్లి గారు చనిపోతుండగా చివరి కోరికగా వాతలు పెట్టమని కోరింది.రాజుగారి దగ్గర మామిడిపండ్లు తీసుకున్న వారు అంతా ఒక వరసలో నిలుచుంటే వాతలు పెడతాను అని అన్నాడు రామలింగడు.దీనితో భయపడిన పండితులు చేసిన తప్పు ఒప్పుకున్నారు.ఇం...

దీపావళి కథ...

Image
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం .ఈ పండగను భారతదేశం అంతటా పిల్లలు పెద్దలు టపాసులు,మిఠాయిలు, పిండివంటలతో  చాలా సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి జరుపుకోవడానికి రకరకాల కధలు ప్రచారంలో ఉన్నాయి.పూర్వ కాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతను భూదేవి వరహస్వామికి అసుర సమయంలో జన్మించాడు.ఇతను రాక్షస ప్రవృత్తి చేత మరణించబడతాడు అని బాధ పడిన భూదేవి విష్ణుమూర్తిని ఒక వరం అడిగింది.అతనికి చావు లేకుండా చేయమని అన్నది,  అలా జరగదు కాబట్టి తల్లి చేత మాత్రమే చంపబడతాడు అనే వరాన్ని పొంది ఉన్నాడు. తన తల్లి నేను నా కొడుకును చంపలేను కాబట్టి సరే అంది భూదేవి.ఆమె తన కొడుకు మంచి లక్షణాలు పొందడానికి జనక మహారాజుకి అప్పగించి వెళ్ళింది.జనక మహారాజు దగ్గర విద్య నేర్చుకొని అతను మంచి బుద్ధులు అలవాటు చేసుకున్నాడు.అతను కామాఖ్య అమ్మవారిని చాలా నిష్ఠగా పూజ చేసేవాడు. కొన్ని రోజులకు అతను పక్క రాజ్యం రాజైన బాణాసురుడుతో స్నేహం చేసాడు. అతను స్త్రీలను కేవలం భోగ వస్తువుగా మాత్రమే చూసేవాడు. అతని ప్రభావం చేత నరకాసురుడు కూడా మారిపోయాడు.స్త్రీలను ఆటబొమ్మలుగా చూడడం మొదలు పెట్టాడు,క్రమంగా పూజ చేయడం మానేశాడు.నరకాసురుడు...

రుక్మయ్య-వడ్డీ..

Image
అనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు సులోచనడు.సులోచనడు అంటే మంచి ఆలోచనలు కలిగిన వాడు అని అర్థం .ఆ రాజ్యంలో రుక్మయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను నగలు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవాడు,కానీ ఎక్కువ వడ్డీ లాగేవాడు.కలలో కూడా వడ్డీ వడ్డీ అని ఆలోచించేవాడు. సులోచనడు అతనిని చాలా సార్లు మందలించాడు. అయిన అతని పద్దతి మార్చుకోలేదు. రుక్మయ్య దగ్గరికి చెన్నయ్య దంపతులు వచ్చారు వారి కూతురి వివాహం కోసం సొమ్ము అవసరం అయ్యింది. చెన్నయ్య దంపతులు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి ధనాన్ని తీసుకెళ్లారు అందరికంటే నీకు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాను అనేసరికి నోటు రాసుకోలేదు.చెన్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు , కూతురి వివాహం జరిగిపోయింది.      కొన్ని రోజుల తరువాత చెన్నయ్య దంపతులు పంట అమ్ముడుపోగా మిగిలిన ధనాన్ని ,దాచి ఉంచారు .అలా కూడబెట్టిన ధనాన్ని తీసుకొని పోయి రుక్మయ్య దగ్గరకు వెళ్లారు ,ఆయన నువ్వు నా దగ్గర ఎప్పుడు తాకట్టు పెట్టవు ? నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాను అని అన్నాడు.చెన్నయ్య దంపతులు కంగారుపడి తర్వాత తేరుకొని అలా మాట్లాడతారు ఏంటి రుక్మయ్య గారు మేము మా క...

నక్క తెలివి

Image
అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి.ఆ అడవికి రాజు మృగరాజు సింహం .సింహం మంచిదే కానీ దాని దగ్గర ఉన్న సైన్యంలో తోడేలు, నక్క,రాబందు ఉండేవి.సింహం సైన్యంలో నక్క అసలు మంచిది కాదు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఇతరులను బలి చేసేది.ఒకరోజు సింహం పర్యటనకు వెళ్ళింది అన్ని జంతువులు ఈ అడవిలో ఎలా ఉన్నాయి నేను అంటే  అసలు బయపడుతున్నాయా లేదా!అని అంతటా తిరిగింది. ఏనుగు దగ్గరకు వచ్చింది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది అది చెప్పే లోపే నక్క కల్పించుకొని వాళ్లకు ఏమి సమస్యలు లేవు రాజు గారు అవి ఇంకా ఇష్టారాజ్యంగా తిరిగి అడవులను పాడు చేస్తున్నాయి వెంటనే ఏనుగులు ఎం చెప్పాలో అర్థం కాక తల దించుకున్నాయి.మృగరాజు ఏనుగులను మంద లించాడు. ఆ తర్వాత పక్షులను అడిగాడు ,వారు అన్ని కలిపి ఒకటే గొంతుతో నక్కను మాట్లాడనియక మాకు చాలా సమస్యలు ఉన్నాయి.అడవిలో మేము గూడు కట్టిన చోట ఇంకొకరిని రానివ్వకండి .మాకు చాలా కష్టం అవుతుంది లేకపోతే మాకు అందరికి ఒక దగ్గర మంచి గూళ్లు కట్టించండి అన్నాయి.వెంటనే నక్క మీకు గుళ్ళు కట్టడానికి డబ్బులు ప్రస్తుతం ఖాజానలో లేవు అవి సర్దిబాటు ఐతే కడతాం అన్నది సింహం పేరుకు రాజు అయిన నక్క మా...

సహవాస దోషం

Image
అనగనగా ఒక ఊరిలో ఒక గ్రామాధికారి,పూజారి,జూదరి అనుకోకుండా ఒక విహారయాత్రకు బయలుదేరారు.వారు పడవ ప్రయాణం చేస్తున్నారు,ఇంతలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది .దాని వల్ల వారు ఒక ద్వీపంలో చిక్కుకుపోయారు.అటునుంది వారు బయటపడే మార్గం కొరకు చాలా వెతికారు,కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇది ఐతే అది జరుగుతుందని భావించి అలా ఉండిపోయారు. అలా రెండు నెలలు గడిచిపోయాయి ,ఒకరోజు జూదరి రండి ఎంతకాలం ఇలాగే ఉంటారు సరదాగా పేకాట ఆడుకుందాం అంటాడు. గ్రామాధికారి ఈ విషయం మా ఊరిలో తెలిస్తే గ్రామస్తులు నాకు మర్యాద ఇవ్వరు నేను ఆడను అంటాడు.పూజారి జూదం అనేది ఒక వ్యసనం అది మహాపాపం ,నేను ఆడను అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత గ్రామాధికారి జూదరి దగ్గరగా వచ్చి పోనీలే నేను ఇక్కడ ఆడితే అక్కడ మా గ్రామంలో ప్రజలకు ఎలా తెలుస్తుంది రా నాకు ఆట నేర్పించు అన్నాడు.ఆ తర్వాత పూజారి వచ్చి ఏవైనా దోష పరిహారాలు ఉంటే చేసుకుంటా,ఖాళీగా ఉండి ఏమి లాభం అన్నాడు.అలా ముగ్గురు కలిసి ఆడటం మొదలుపెట్టారు.పని ఏమి లేకపోవడంతో వారు ఒక వారంలొనే ఆట నేర్చుకున్నారు.అలా ఆడుకుంటూ కొన్ని నెలలు గడిచాయి.ఒకరోజు ఆ ద్వీపంలో ఒక సీసా కనిపించింది దానికి మూత పెట్టి వుంది వారు ...

సోమరి కొడుకు కథ

Image
అనగనగా ఒక ఊరిలో చెంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు , అతనికి రాజు అనే కొడుకు ఉండేవాడు.అతను చాలా సోమరిపోతు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు.రాజుని తండ్రి ఎప్పుడు మందలించే వాడు.అయిన వాడు మాత్రం ఏమి చేయకుండా  అలాగే తిరిగేవాడు. ఒకరోజు ఎంత చెప్పినా వినడం లేదు అని ఇంటి నుండి బయటకు పంపించేశారు.ఏదయినా పని చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వస్తేనే నీకు భోజనం లభిస్తుంది అన్నాడు చెంగయ్య.రాజు పని కోసం వెళ్లాడు కానీ పని దొరకలేదు.అయితే అతను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానిని తెచ్చి తండ్రికి ఇచ్చాడు.దానికి తండ్రి సంతోషించి తీసుకొని భోజనం పెట్టాడు ఆ డబ్బును ఇంట్లొ ఉన్న బావిలో వేసాడు చెంగయ్య. రాజు చూసుకుంటూ వెళ్ళాడు తప్ప ఏమీ అనలేదు.అలా వెళ్లి భోజనం తిని పడుకున్నాడు. తెల్లారి కూడా అలాగే బయటకు వెళ్లి డబ్బులు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాడు.అలా మూడు నెలలు గడిచిపోయాయి.ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది.కొంతకాలానికి ఒకరోజు ఎంత వెతికినా ఎవరు దొరకలేదు ఖాళీగా ఇంటికి వచ్చాడు,ఇంట్లో భోజనం పెట్టలేదు.అలాగే  పడుకున్నాడు.మళ్ళీ వెళ్ళాడు సగం రోజు వరకు ఎవరూ దొరకలేదు.రిక్షా తొక్కే వ్యక్తి...

కలసి ఉంటే కలదు సుఖం

Image
అనగనగా ఒక ఊరిలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి నలుగురు సంతానం.నలుగురు కొడుకులు,కొడళ్లతో ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది.ఆ ఊరిలో అందరూ మీరు ఎప్పుడు ఇలా ఎలా కలిసి వుంటారు అని అనుకుంటారు.ఒకరోజు వాళ్ల ఇంటికి ఒక అతిధి వచ్చాడు అతను వాళ్లలో వాళ్లకు ఎలాగైనా గొడవ పెట్టాలి అనుకుని వచ్చాడు.అత్త సీతమ్మ వంట పూర్తి చేసింది ,పెద్దకొడలికి ఆ కూర ఒక అయిదు నిముషాల తర్వాత కొంచెం ఉప్పు వేసి దించు అని చెప్పి ఆమె బయటకు వెళ్ళింది.పెద్దకొడలు సరే అన్నది ఇంతలో బట్టలు అరబెట్టేది వుందని రెండవ కోడలికి చెప్పి వెళ్ళింది,ఆమె కూడా సరే అన్నది అప్పుడే వాళ్ళ ఆయన పిలిచేసరికి వెళ్ళింది.మూడవ కోడలికి ఉప్పు వేసి దించమని చెప్పింది.ఆమెకు నీళ్లు పట్టేది ఉందని వెళ్తూ వెళ్తూ చిన్న కోడలికి చెప్పి వెళ్ళింది.చిన్న కోడలు సరే అని ఉప్పు వేసి దించింది.నీళ్లు పట్టి తిరిగి వచ్చిన మూడవ కోడలు ఉప్పు వేసి కలిపింది.భర్త దగ్గర నుండి వచ్చిన రెండవకోడలు చెల్లి ఉప్పు వేసిందో లేదో అని ఉప్పు వేసి కలిపింది.ఆ తర్వాత కొద్ది సేపటికి వచ్చిన పెద్ద కోడలు నా చెల్లి  ఉప్పు వేసిందో లేదో అని ఆమె కూడా ఉప్పు వేసింది.మధ్యాహ్నం భోజనానికి ...

దురాశ దుఃఖానికి చేటు.

Image
అనగనగా ఒక ఊరిలో రంగయ్య అతని భార్య నివాసం ఉండేవారు, రంగయ్య కష్టపడిపని చేసి కుటుంబాన్ని పోషించేవాడు.అతని భార్య తెచ్చిన ధనం అంత ఖర్చు చేస్తూ ఉండేది .రంగయ్య ఎంతపని చేసిన డబ్బులు మిగలడం లేదు అని బాధపడేవాడు.ఒకరోజు అలా వెళుతున్న రంగయ్య కి నా స్నేహితురాలు ఆపదలో ఉంది కాపాడు అని చిలుక చెప్పింది,సరే నీ స్నేహితురాలు ఎక్కడుందో చూపించు అన్నాడు రంగయ్య. అక్కడ బాతు ఉంది దానికి గాయం అయింది,దానికి సపర్యలు చేసి కట్టు కట్టాడు.బాతు చాలా సంతోషపడి అతనికి ఒక బంగారు గుడ్డు ఇచ్చింది.చాలా ఆనందంగా ఇంటికి వెళ్లి భార్యకు బంగారు గుడ్డు ఇచ్చాడు.భార్య దానిని బజారులో అమ్మి ధనాన్ని తెచ్చుకుంది.రంగయ్య రోజు అలా చేరువుదగ్గరకు వెళ్లడం ఒక బంగారు గుడ్డు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది.చూసిన జనాలంతా ఆశ్చర్యపోయేలా వారు ధనాన్ని పోగు చేస్తున్నారు.ఒకరోజు వారికి మెదడులో దురాశ కలిగింది.బాతు దగ్గర రోజు ఒక గుడ్డు తెచ్చుకునే బదులు బాతును తెచ్చి ఇంట్లో దానిని కొస్తే చాలా గుడ్లు వస్తాయి కదా !అని ఆలోచించారు.వెంటనే అమలు చేయడం కోసం చెరువు దగ్గరకు వెళ్లారు ,బాతు వీరిని చూసి భయపడి దూరంగా పారిపోయింది.మొత్తానికి బాతు బంగారుగుడ్డు పోయి...

సమయస్ఫూర్తి

Image
అనగనగా ఒక ఊరిలో సాంబయ్య అనే వ్యాపారి ఉండేవాడు.అతను వ్యాపారరీత్యా ఒక ఉరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తూ ఉండేవాడు.ఒక పని మీద తన ప్రాణస్నేహితుడిని కలవడానికి దొంగలపురం అనే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో దొంగతనాలు ఎక్కువగా జరగడం వల్ల ఆ ఊరికి దొంగలపురం అనే పేరు వచ్చింది.తన స్నేహితుడిని కలిసి మాట్లాడేసరికి చాలా సమయం అయింది సాయంకాలం ఆ ఉరి నుండి బయలుదేరాడు ,తన స్నేహితుడు ఈ ఊర్లో దొంగలు ఎక్కువగా ఉంటారు నువ్వు నీ సొమ్ము జాగ్రత్తగా తీసుకెళ్లు అన్నాడు.చీకటి మరియు అడవిగుండా ప్రయాణం అవడం చేత సాంబయ్య మెల్లిగా నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఎవరో తనను వెంబడిస్తున్నారు అని చూసాడు .ఒక వ్యక్తి తనను దూరం నుంచి ఫాలో అవుతున్నాడు అతనికి భయం వేసింది.అలా నడుస్తూ ఉన్నాడు, కొంతసేపటికి ఒక చెరువు కనిపించింది అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది.చెరువు దగ్గరకు వెళ్లి అయ్యయ్యో నా పెట్టె చెరువులో పడిపోయింది అని లబోదిబోమన్నాడు.అతనిని వెంబడిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమైంది ?అంటాడు నా పెట్టె పడిపోయింది అన్నాడు సాంబయ్య .దొంగ వెంటనే నేను తీసి ఇస్తా అని చెరువులోకి దూకాడు ,సాంబయ్య వెంటనే పొదల్లో ఉన్న పెట్టె తీ...

ఐకమత్యమే మహాబలం.

Image
ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .

తెనాలి రామలింగని తెలివి

Image
అది శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం ,అతని మంత్రి తెనాలి రామకృష్ణుడు. అతను చాలా తెలివినవాడు.పక్క రాజ్యం లోని రాజు ఈ విషయం తెలుసుకుని అతని తెలివికి పరీక్ష పెట్టాలనుకున్నాడు.మా రాజ్యానికి ఒక ఇరవై కిలోల క్యాబేజీ,యాభై ఆకుకూర కట్టలు కావాలని  వర్తమానం పంపాడు.అందరూ ఈ వర్తమానాన్ని చూసి తలలు పట్టుకొని కూర్చున్నారు.ఆ రాజ్యం నుండి ఈ రాజ్యానికి వెళ్ళడానికి అరవై రోజుల ప్రయాణం పడుతుంది,అని భయపడుతున్నారు.శ్రీకృష్ణదేవరాయలు రామలింగడిని పిలిచి ఈ సమస్యకు పరిష్కారం చూపమని అడిగాడు. రామలింగడు బాగా ఆలోచించి ఒక  పది ఎద్దులబండ్లు తెప్పించామన్నాడు.అందరూ చాలా ఉత్కంఠగా చూస్తున్నారు ఈయన ఏమి చేస్తున్నాడు అని.రాయలు మాత్రం రామలింగడి మీద నమ్మకంతో ఏమి అడగలేదు,తెనాలి రామలింగడు అన్ని ఎద్దులబండ్లలో సగం వరకు మట్టిని నింపాడు.కొన్నింటిలో ఆకుకూరలు విత్తనాలు కొన్నింటిలో క్యాబేజీ విత్తనాలు వేశాడు. ఒక్కొక్క బండికి రెండు కుండలు కట్టాడు,ఒక్కో బండికి ఇద్దరు మనుషులను పెట్టాడు వారు దారి పొడవునా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆ మట్టికి నీరు పెట్టమన్నాడు అలా అరవై రోజుల ప్రయాణ సమయానికి ఆ గింజలు మొలకెత్తి తాజా కూరగాయలు,ఆకుకూరలు రాజు గ...

అంతా మన మంచికే...

Image
అనగనగా ఒక రాజ్యం ఉండేది, దానికి రాజు సులోచనడు.అంటే మంచి ఆలోచనలు కలిగినవాడు అని అర్థం .రాజు చాలా మంచివాడు కానీ ముక్కోపి వెంటనే కోపం వస్తుంది.ఆయనతో ఎవరు మాట్లాడిన చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతారు. అతని దగ్గర రాజశేఖరుడు అనే మంత్రి ఉండేవాడు.అతను మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి.ఒకసారి రాజదర్బారులో పండితుల సేవ చేస్తుంటే పండ్లను కోసి ఇస్తుండగా వేలు తెగింది అక్కడ ఉన్నవారు అంత బాధపడ్డారు ఒక్క మంత్రి మాత్రం అంత మన మంచికే అన్నాడు.అసలే ముక్కోపి అయిన సులోచనడు ఎం ఆలోచించకుండా అతనిని బంధించాడు.ఒక వారం రోజుల తర్వాత వేటకు వెళ్ళాడు మంది మార్బలంతో చీకటి పడింది.తన వెంట వచ్చినవారు తప్పిపోయారు అలా వెళుతూ ఒక గూడెంకి చేరాడు.అక్కడ ఉన్నవాళ్లు ఇతనిని దొంగగా భావించి కట్టిపడేశారు.గూడెం పెద్ద వచ్చాడు అక్కడివారు అయ్యా ఇతను వేరే ప్రదేశం నుండి చొరబడ్డాడు అందుకే కట్టి పడేసాము అన్నారు.పెద్ద చూసి ఐతే ఇతనిని అమ్మవారికి బలి ఇవ్వండి  అన్నాడు.ఇంకొక తలారీ వచ్చి రాజు సులోచనుడిని కింద నుండి మీద వరకు తేరిపారా చూసాడు .అతని వేలు తెగి ఉంది,ఇతను బలి ఇవ్వడానికి సరిపోదు అన్నాడు.హమ్మయ్య ప్రాణాలు నిలబడ్డాయి అని సంతోషించి ...