Posts

Showing posts with the label reading

చెడపకురా చెడేవు.....

Image
రామకృష్ణాపురంలో సాంబయ్య అనే రైతు ఉండేవాడు అతను చాలా కష్టపడి పని చేసేవాడు .అతనికి  నలుగురు కొడుకులు రంగయ్య,రాజయ్య,రుద్రయ్య మరియు రాఘవయ్య.రాజయ్య, రంగయ్య, రుద్రయ్య బాగా తెలివినవాళ్ళు,రాఘవయ్య పాపం వట్టి అమాయకుడు.ఎవరు ఏమి చెప్పిన నమ్ముతాడు.రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలకు పెళ్లిళ్లు చేసాడు సాంబయ్య. అతని దిగులు అంత చిన్న కొడుకు గురించే, అతని అమాయకత్వానికి ఎవరూ పిల్లను ఎవరు ఇవ్వలేదు.అలాగే ఉండిపోయాడు.కొన్ని రోజులకు సాంబయ్యకు జబ్బు చేసింది రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు వారి పిల్లలను భార్యలను చూసుకుంటూ సాంబయ్యను పట్టించుకునేవారు కాదు.రాఘవయ్య తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు .పూర్తిగా అతని ఆరోగ్యం క్షీణించి అతను చనిపోయాడు.అతను చనిపోయాక అన్ని కార్యక్రమాలు ముగిసిన తరువాత లాయరు వీలునామా తెచ్చి ఇచ్చాడు ఆస్థులన్ని సమంగా పంచుకోవడానికి.సాంబయ్య వీలునామాలో రాఘవయ్యకు కొంచెం ఎక్కువగా ఆస్తి రాసాడు అది చూసి మిగిలిన అన్నలు ఓర్వలేక ఇది మేము చూసుకుంటాం అని లాయరును పంపించి వేశారు. రాజయ్య, రంగయ్య, రుద్రయ్యలు మంచి తరి పొలాన్ని తీసుకొని ఊరు అవతల పనికిరాని మెట్టభూమి ఇచ్చారు.ఇంకా అతని దగ్గర ఒక కుంటి పిల్ల...

సోమరి కొడుకు కథ

Image
అనగనగా ఒక ఊరిలో చెంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు , అతనికి రాజు అనే కొడుకు ఉండేవాడు.అతను చాలా సోమరిపోతు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు.రాజుని తండ్రి ఎప్పుడు మందలించే వాడు.అయిన వాడు మాత్రం ఏమి చేయకుండా  అలాగే తిరిగేవాడు. ఒకరోజు ఎంత చెప్పినా వినడం లేదు అని ఇంటి నుండి బయటకు పంపించేశారు.ఏదయినా పని చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వస్తేనే నీకు భోజనం లభిస్తుంది అన్నాడు చెంగయ్య.రాజు పని కోసం వెళ్లాడు కానీ పని దొరకలేదు.అయితే అతను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానిని తెచ్చి తండ్రికి ఇచ్చాడు.దానికి తండ్రి సంతోషించి తీసుకొని భోజనం పెట్టాడు ఆ డబ్బును ఇంట్లొ ఉన్న బావిలో వేసాడు చెంగయ్య. రాజు చూసుకుంటూ వెళ్ళాడు తప్ప ఏమీ అనలేదు.అలా వెళ్లి భోజనం తిని పడుకున్నాడు. తెల్లారి కూడా అలాగే బయటకు వెళ్లి డబ్బులు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాడు.అలా మూడు నెలలు గడిచిపోయాయి.ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది.కొంతకాలానికి ఒకరోజు ఎంత వెతికినా ఎవరు దొరకలేదు ఖాళీగా ఇంటికి వచ్చాడు,ఇంట్లో భోజనం పెట్టలేదు.అలాగే  పడుకున్నాడు.మళ్ళీ వెళ్ళాడు సగం రోజు వరకు ఎవరూ దొరకలేదు.రిక్షా తొక్కే వ్యక్తి...

రామచిలుక కథ

Image
అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక వేటగాడు వున్నాడు.అతను వేటకు వెళ్లి రెండు రామచిలుకలను పట్టి తెచ్చాడు.ఆ చిలుకలను రాజభవననికి తెచ్చి రాజుకు బహుకరించాడు. ఆ రాజు ఈ చిలుకలను మంత్రికి మరియు సేనాధిపతికి ఇచ్చాడు.మంత్రికి,సేనాధిపతికి ఒక్క నిముషం కూడా పడదు . రాజు  రామచిలుకకు ఎవరైతే మాటలు నేర్పిస్తారో వారికి బహుమతులు ఇస్తాను అని చెప్పాడు .మంత్రి ఇంటికి వెళ్లి భార్యతో దీనికి మాటలు నేర్పించు మనకు అన్ని బహుమతులు రావాలి అంటాడు అది విన్న మంత్రి భార్య ఎలా అండి అని అడిగింది. రాజు గారు దీనికి మాటలు నేర్పిస్తే బహుమతి ఇస్తా అన్నారు అంటాడు. మంత్రి గారి భార్య సరే అంటుంది. సేనాధిపతి కూడా భార్యకు విషయం చెప్పి చిలుకను ఇస్తాడు. మంత్రి భార్య ఒక సంగీతం నేర్పించే గురువు అవడడం చేత అది అన్ని పాటలు ,పద్యాలు మంచి మాటలు నేర్చుకుంది. సేనాధిపతి భార్య పదవి ఉందని అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో గొడ్డు చాకిరి చేపిస్తూ అందరిని తిడుతూ ఉంటుంది అది విన్న చిలుక ఆ మాటలు తిట్లు నేర్చికుంది.మంత్రి ఎప్పుడు రాజు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు కనుక చిలుక కూడా రాజు గారి మీద గౌరవం పెంచుకుంటుంది సేనాధిపతి రాజుకి వ్యతిరేకంగా ఇత...

చిన్న చేప కథ

Image
అనగనగా కథలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఇది ఒక చేప పిల్ల కథ. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది,అందులో ఒక చేపల కుటుంబం నివసిస్తూ ఉండేది.అందులో అందరికన్నా చిన్నది అయిన చేప ఒకరోజు బయటకు వచ్చి ఈదడం నేర్చుకుంటుంది.అక్కడే ఒక  కోమ్మ పైన ఉన్న పక్షిని చూసి అది అంతలా ఎలా ఎగురుతుంది అని ఆలోచించింది దానితో   దగ్గరగా వెళ్లి నేను ఈదుతున్న మొత్తం నీటిలోనే ఉంటాను కానీ నువ్వు మాత్రం రెక్కలతొ ఎంత దూరం అయిన ప్రయాణం చేయగలవు అని బాధ  పడుతుంది .ఆ పక్షి అలా కాదు అమ్మ నువ్వు జల జీవివి నీకు రెక్కలు ఉండవు .నువ్వు ఈదుతున్నావు నేను ఈదలేను అని బాధ పడుతున్నాన అని అంటుంది . ఆ చిన్న చేప తన తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మనకు రెక్కలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తుంది, అప్పుడు ఆ తల్లి చేప భగవంతుడు ఒక్కో ప్రాణిని ఒక్కో లాగా సృష్టించాడు అని చెపుతుంది అయిన వినకుండా మారం చేస్తుంది. తెల్లవారుజామున ఆ తల్లి చేప  అడవిలో ఉన్న జంతువులు అన్నింటినీ సమావేశం కావాలిసిందిగా కోరింది, కోరిన విధంగా అన్ని జంతువులు చెరువు చుట్టూ మూగారు .తల్లి చేప పిల్ల చేపను తీసుకొని వచ్చి చూడు ఇవన్ని అడవిలోని రకరకాల జంతువులు కోతి ,నక్...

ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు...

సెప్టెంబర్ 5 న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు ,ఏ రోజు ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కనుక. గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి నడిపే మార్గాన్ని చూపే వ్యక్తి. అది ఎవరైనా కావచ్చు మనను మంచి వైపు నడిపించేవాడు ఎల్లప్పుడూ గురువే అయి ఉంటాడు. సూర్యుడు లేకుండా వెలుగు లేదు, ఔషదం సేవించకుండా రోగం నశించదు అలాగే గురువు లేకుండా  జ్ఞానం లభించదు అని పెద్దల మాట. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు కు అత్యంత విలువైన ప్రాముఖ్యత వుంటుది.మన తల్లిదండ్రులు మనకు జన్మ ఇస్తే గురువు పునర్జన్మ ఇస్తాడు. ఈ సందర్భంగా ఒకచిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో స్వేచ్ఛ అని ఒక అల్లరి పిల్ల ఉండేది తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అవడం వల్ల అల్లారు ముద్దుగా పెంచారు .ఆమెను పాఠశాలలో చేరిస్తే అల్లరి తగ్గుతుంది అని భావించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు, కానీ తీరు మారలేదు,ఆమె ఒకరోజు అటుగా వెళుతున్న గురువు పంచె ను లాగింది దాని వల్ల అతడు కింద పడిపోయారు  తలకు గాయం అయింది అది చూసి పరుగెత్తింది స్వేచ్ఛ, భయంతో వణికిపోతోంది ఆమెను చూసి గురువు చూసావా నువు చేసిన అల్లరి పని వల్ల నాకు రక్తం వస్తుంది ...