Posts

Showing posts with the label chinna neethi kathalu tenali rama kathalu

శ్రీనివాస కళ్యాణం

Image
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర  స్వామిని దర్శించడానికి భక్తులు దూర ప్రాంతాలనుండి ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకొని వస్తారు. ఆనందనిలయంలో ఉన్న ఆ శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినంతనే ఎంతో ఆనందం కలుగుతుందని  అంటారు.ఇది నిజంగా  అనుభూతి చెందిన వారికే అనిపిస్తుంది. ఈ రోజు మన కథ శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ,ఎన్నో కథలు గాథలు ఉన్నాయి కానీ అందులో ఒకటి మీకోసం . ఒకనాడు మహర్షులు అందరూ కలసి లోకకళ్యాణం కొరకు యజ్ఞం చేయాలని భావించారు ఆ యజ్ఞానికి ముఖ్య అతిథిగా త్రిమూర్తులలో ఒకరిని పిలవాలని అనుకున్నారు . ఎవరు గొప్ప అయితే వారిని పిలవాలని అనుకున్నారు.ఈ ఎవరు గొప్ప అని నిర్ణయం చేయవలసిందిగా బృగు మహర్షిని పంపారు.మొదట బృగు మహర్షి సత్య లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతి మాత వీణ వాయిస్తుండగా అతను లీనమై పోయాడు. ఆశ్చర్యం అసలు బ్రహ్మ బృగు మహర్షి రాకను గమనించలేదు దానికి ఆ మహర్షి కోపంతో నీకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించాడు. బ్రహ్మ దేవుడు బాధ పడ్డాడు అందుకే బ్రహ్మ దేవుడికి గుడులు చాలా తక్కువ ఉంటాయి.   కైలాసానికి బయలుదేరాడు ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం .కైలాసంలో శివపార్వతులు ఇద్దరూ నాట...

valentine's day❤️❤️❤️

Image
Valentine's day అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చే విషయం ఏంటి. ?   అదే ఏంటి అని ఆలోచిస్తున్నారా! చెప్తా ఉండండి అసలు విషయం భజరంగ్ దళ వాళ్ళు . అవును కొన్ని రోజుల క్రితం వరకు వాళ్ళు వాలెంటైన్ డే రోజు రోడ్డు మీద ఎవరైనా ప్రేమికులు లేదా జంటగా కనబడినా కూడా వాళ్ళ చేతికి బలవంతంగా తాళి ఇచ్చి కట్టమనేవారు .అందులో కొందరు ఇష్టం ఉండి ,ఇష్టం లేక ,కొందరైతే స్నేహితులుగా ఉండేవాళ్ళు కూడా ఉండేది .కానీ ఇప్పుడు పరిస్థితి మారింది లెండి.ఇది మాకు ఎందుకు అనుకోకండి రీడర్స్  valentine's day special blog.   Valentine's day ఎలా మొదలైంది అంటే , మూడవ శతాబ్దంలో  రోమ్ ను పరిపాలిస్తున్న చక్రవర్తి క్లాడియాస్ 2 తన నగరంలో ప్రేమ వివాహాలను నిషేధించాడు ,పెద్దల మాట వినకుండా చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల వారు జీవితంలో నష్ట పోతారు అని భావించి అతను అలా చేశాడు.కానీ తాడిని తన్నేవాడు ఒకడైతే  వాడి   తల తన్నేవాడు ఇంకొకడు వుంటారు అని అంటారు కదా! అలా ఈయన నిషేధిస్తే మనం ఎందుకు పాటించాలి అనుకున్న సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి అదే ప్రేమ వివాహాలకు మద్దతు తెలిపాడు .అతన్ని  చక్రవర్తి ఎన్నో సార్ల...

ఆహార సూత్రాలు.

Image
తాతయ్య ఒక కథ చెప్పావా ? అని అడిగింది చిట్టి. రోజూ కథ ఎందుకు చెప్పాలి, ఈ రోజు నీకు ఒక మంచి విషయం చెప్తాను చిట్టీ అని చెప్పాడు.సరే తాతయ్య ఏదో ఒకటి చెప్పు నేర్చుకుంట అన్నది. అవును ఏ మంచి విషయం చెప్తావు తాత అన్నది . అదే తినడం గురించి, అంటే తాతయ్య?మనం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం అన్న విషయం.సరే తాత ఇదేదో విచిత్రంగా ఉంది రోజు తినే అన్నం తినడానికి కూడా పద్ధతులు ఉన్నాయా? . హితంగా తినాలి,మితంగా తినాలి,ఋతు అనుగుణంగా తినాలి అంటారు  పెద్దలు.ఏం తినాలో,ఎంత తినాలో,ఎప్పుడూ తినాలో చూసుకొని తినాలి.ఆహారం ఎలా తినాలో తెలిస్తే ఆరోగ్యంగా మారుతుంది అమృతంగా బతికిస్తుంది.  వైశ్వనర విద్యగా పిలిచే ఈ విధానాన్ని  మన పూర్వీకులు ఓ యజ్ఞంలాగ ఆచరించారు.ఇప్పుడు మాత్రం నూటికి 90 మంది ఆహార సూత్రాల విషయంలో అలసత్వం వహిస్తున్నారు.       అవునా తాతా భోజనం చేయడం ఓ యజ్ఞమా ? అవును చిట్టి భోజనం చేయడం ఒక యజ్ఞం. మన ఋషులు మోక్ష సాధన గురించే కాక ఇహ లోకంలో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు.మనం తినే ఆహారం త్రాగే నీరు స్వచ్చంగా ఉండాలి.మనకు వచ్చే ఎక్కువ రోగాలలో అత్యధిక శాతం జీర్ణ వ్యవస్థకు చ...

గోదా కల్యాణం

Image
గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ వచ్చెనమ్మా శ్రీ విల్లిపుత్తూర్ నుండి గోదాదేవి వచ్చెనమ్మా మన కృష్ణుణ్ణి పెళ్లాడ  వచ్చెనమ్మా.  ఈ పాట నిజంగా వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఈ పాట అందరికి తెలుసు .మన గోదాదేవి కల్యాణం పాట కాబట్టి . ఈ రోజు మన కథ గోదా కల్యాణం కథ.ఆమె ఎవరు ?ఆమె కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది ? అని ఆమెని గురించి తెలుసుకుందాం. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు.అతని చిత్తం ఎల్లప్పుడూ విష్ణువు మీదనే ఉండడం వల్ల అతనికి విష్ణుచిత్తుడు అనే పేరు వచ్చింది ఇతను ఆళ్వార్ లలో ఒకరు మరియు పెద్ద ఆళ్వార్ . విష్ణుచిత్తుడు ఒక తోట పెంచేవాడు ఆ తోటలో మొక్కలకు పాదులు తీసే సమయంలో తులసి మొక్కల దగ్గర ఒక చిన్న పాప దొరికింది. ఆమెకు కోదై అనే పేరు పెట్టాడు  కోదై అంటే పూలమాల అని అర్థం అది  క్రమంగా గోద గా మారింది.   ఆమెను విష్ణుచిత్తుడు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.గోదకు ప్రతిరోజు చిన్ని కృష్ణుడి లీలలు చెప్పేవాడు ఆమె ఎంతో శ్రద్ధతో వినేది .ఆమె కృష్ణుడి కథ లేకుండా నిద్రపోయేది కాదు .అలా అలా పెరిగి పెద్దది అయింది .చిన్నతనం ను...

కచుడు -దేవయాని కథ..

Image
మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో  ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం.             హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా  మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా  బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు. దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు.      దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి  దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు. శుక్రాచార్యుడుకి దేవయాని...

లాభమా? -నష్టమా?

Image
అనగనగా ఒక పెద్ద అడవి దాని పేరు సుందరవనము.అది అతి సుందరంగా వుండడం చేతదానిని సుందరవనము అంటారు.ప్రతి అడవికి రాజు సింహమే కదా ఇక్కడ కూడా సింహమే రాజు ,కుందేలు మాత్రం మంత్రి . అడవిలో అన్నీ జంతువులు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది అక్క కొన్ని వృద్ధ జంతువులు కూర్చొని తమ తమ సమస్యల గురుంచి మాట్లాడుకుంటున్నాయి.        దూరం నుంచి ఆ మాటలు వింటుంది సింహం వారికి కనపడకుండా .ఆ జంతువులు మనము ఇప్పుడు ముసలి వాళ్ళము మనకు వేటాడే శక్తి లేదు కాబట్టి మన పిల్లలను బాధ పెట్టకుండా మనలో మనం ఆహారం ఐపోయి చనిపోదాం అని అంటున్నాయి.ఆ మాట విన్న సింహం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సింహం తన స్థావరనికి వచ్చి కుందేలును పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .జంతువులు అన్ని భయం భయంగా వచ్చాయి.అప్పుడు అక్కడ ఉన్న జంతువులను ఉద్దేశించి మన అడవిలో ఎవరికైనా అత్యవసరంగా సాయం చేయవలసి ఉందా అని అడిగింది, అన్ని ఆలోచించసాగాయి.కుందేలు టక్కున లేచి సాయం కోసం ఎదురు చూసేది కేవలం వృద్ధ ప్రాణులే అంది కుందేలు.ఐతే మీరందరు వృద్ధ జంతువుల సంరక్షణ కోసం సలహాలు,సూచనలు చేయవలసిందిగా ఆదేశించింది. రాజా మన...

పాజిటివ్ థింకింగ్.

Image
  సెప్టెంబర్ నెలలో 13 వ తేదీని పాజిటివ్ థింకింగ్ డే గా నిర్వహిస్తారు.సానుకూల ఆలోచనలు మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లిస్తాయి.ఒక వ్యక్తి ఎంత బాధలో ఉన్నా తనయొక్క ఆలోచనలు నియంత్రించుకోకపోతే అవి వ్యతిరేక ఆలోచనలుగా మారతాయి,దానివల్ల మనం లేక ఇతరులు భాదపడవలసి వస్తుంది.సానుకూల ఆలోచనలు మన మెదడును ప్రభావితం చేస్తాయి.మనం చేసే ప్రతి పని ఒక పద్దతిలో చేయాలి,ప్రతికూల ఆలోచనల ధోరణిని విడిచిపెట్టాలి.కాదు అని అనుకున్న పనులు కూడా మన ప్రయత్నంతో పూర్తి అవుతాయి.ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ప్రణాళిక రచన చాలా ప్రధానం,ప్రణాలికను చక్కగా ఆచరణలో పెడితే తొంబై శాతం పూర్తి అవుతుంది.మిగిలిన 10 శాతం పని చేయడం వల్ల ఐపోతుంది.సానుకూల ఆలోచనల వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది,సృజనాత్మకత బయట పడుతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది.రక్తపోటు, ఆందోళన,డిప్రెషన్ వంటివి చేరతాయి.ఆటగ్యాన్ని దెబ్బతీసే ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. ఒక విషయాన్ని ఎంత ఆలోచించిన మారదు, కాన్ని దాని నుండి బయట పడే మార్గాన్ని వెతికితే సులువుగా ఆ పని మనం చేయవచ్చు. మీకు పాజిటివ్ థింకింగ్ గురించి ఒక కథ చెప్తాను.రామాపురంలో సుగుణమ్మ అనే ఒక ముసలి అవ్...

తెనాలి వారి బంగారు మామిడి పండ్లు.

Image
తెలుగు కథలలో తెనాలి రామలింగని కథలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.రాయల వారి ఆస్థానంలో తెనాలి రామలింగడు మాత్రమే చాలావరకు సమస్యలను పరిష్కరించారు.తన యుక్తులతో ఇతరుల కుటీలత్వాన్ని రాజుగారి దగ్గర బయటపెట్టాడు. రాయల వారి తల్లి జబ్బుతో బాధపడుతుంది. వైద్యుడు పరీక్షించి తన కోరికలు ఏవైనా ఉంటే తీర్చాలిసిందిగా ఆదేశించాడు.ఆమె తన ఆఖరి కోరికగా మామిడి పండ్లు తినాలని ఉంది అని అన్నది,కానీ అది మామిడి పండ్లు వచ్చే కాలం కాదు కాబట్టి అతనికి లభించలేదు ఆమె ఆ కోరికతో కాలం చేసింది.రాయలవారు బాధపడ్డాడు ఒక పండితుడిని కలిసి విషయం చెప్పాడు.ఆ పండితుడు దోషం జరిగింది పరిహారం చేయాలి అని చెప్పి బంగారు మామిడిపండ్లు పంచాలని చెప్పాడు.రాజుగారు తెచ్చి బంగారు మామిడిపండ్లను పంచాడు.చాలా వరకు ఆ పండ్లను పండితుడి సన్నిహితులు తీసుకున్నారు.విషయం తెలుసుకున్న తెనాలి రామలింగడు వాళ్ళ మోసాన్ని బయటపెట్టాలి అనుకున్నాడు.మా తల్లి గారు చనిపోతుండగా చివరి కోరికగా వాతలు పెట్టమని కోరింది.రాజుగారి దగ్గర మామిడిపండ్లు తీసుకున్న వారు అంతా ఒక వరసలో నిలుచుంటే వాతలు పెడతాను అని అన్నాడు రామలింగడు.దీనితో భయపడిన పండితులు చేసిన తప్పు ఒప్పుకున్నారు.ఇం...

దీపావళి కథ...

Image
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం .ఈ పండగను భారతదేశం అంతటా పిల్లలు పెద్దలు టపాసులు,మిఠాయిలు, పిండివంటలతో  చాలా సంతోషంగా జరుపుకుంటారు. దీపావళి జరుపుకోవడానికి రకరకాల కధలు ప్రచారంలో ఉన్నాయి.పూర్వ కాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతను భూదేవి వరహస్వామికి అసుర సమయంలో జన్మించాడు.ఇతను రాక్షస ప్రవృత్తి చేత మరణించబడతాడు అని బాధ పడిన భూదేవి విష్ణుమూర్తిని ఒక వరం అడిగింది.అతనికి చావు లేకుండా చేయమని అన్నది,  అలా జరగదు కాబట్టి తల్లి చేత మాత్రమే చంపబడతాడు అనే వరాన్ని పొంది ఉన్నాడు. తన తల్లి నేను నా కొడుకును చంపలేను కాబట్టి సరే అంది భూదేవి.ఆమె తన కొడుకు మంచి లక్షణాలు పొందడానికి జనక మహారాజుకి అప్పగించి వెళ్ళింది.జనక మహారాజు దగ్గర విద్య నేర్చుకొని అతను మంచి బుద్ధులు అలవాటు చేసుకున్నాడు.అతను కామాఖ్య అమ్మవారిని చాలా నిష్ఠగా పూజ చేసేవాడు. కొన్ని రోజులకు అతను పక్క రాజ్యం రాజైన బాణాసురుడుతో స్నేహం చేసాడు. అతను స్త్రీలను కేవలం భోగ వస్తువుగా మాత్రమే చూసేవాడు. అతని ప్రభావం చేత నరకాసురుడు కూడా మారిపోయాడు.స్త్రీలను ఆటబొమ్మలుగా చూడడం మొదలు పెట్టాడు,క్రమంగా పూజ చేయడం మానేశాడు.నరకాసురుడు...

రుక్మయ్య-వడ్డీ..

Image
అనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు సులోచనడు.సులోచనడు అంటే మంచి ఆలోచనలు కలిగిన వాడు అని అర్థం .ఆ రాజ్యంలో రుక్మయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను నగలు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవాడు,కానీ ఎక్కువ వడ్డీ లాగేవాడు.కలలో కూడా వడ్డీ వడ్డీ అని ఆలోచించేవాడు. సులోచనడు అతనిని చాలా సార్లు మందలించాడు. అయిన అతని పద్దతి మార్చుకోలేదు. రుక్మయ్య దగ్గరికి చెన్నయ్య దంపతులు వచ్చారు వారి కూతురి వివాహం కోసం సొమ్ము అవసరం అయ్యింది. చెన్నయ్య దంపతులు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి ధనాన్ని తీసుకెళ్లారు అందరికంటే నీకు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాను అనేసరికి నోటు రాసుకోలేదు.చెన్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు , కూతురి వివాహం జరిగిపోయింది.      కొన్ని రోజుల తరువాత చెన్నయ్య దంపతులు పంట అమ్ముడుపోగా మిగిలిన ధనాన్ని ,దాచి ఉంచారు .అలా కూడబెట్టిన ధనాన్ని తీసుకొని పోయి రుక్మయ్య దగ్గరకు వెళ్లారు ,ఆయన నువ్వు నా దగ్గర ఎప్పుడు తాకట్టు పెట్టవు ? నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాను అని అన్నాడు.చెన్నయ్య దంపతులు కంగారుపడి తర్వాత తేరుకొని అలా మాట్లాడతారు ఏంటి రుక్మయ్య గారు మేము మా క...

నమ్మకం

Image
అనగనగా ఒక ఊరిలో  సుబ్బయ్య అనే అతను వున్నాడు.అతను ఒక గొర్రెలకాపరి .అతనికి ఒక కొడుకు సోము ఉండేవాడు.అతను తుంటరి ,ఒకరోజు తండ్రితో పాటు గొర్రెలు మేపడనికి వెళ్ళాడు.సుబ్బయ్య మధ్యాహ్నం భోజనం చేసి ఒక చెట్టు కింద కునుకు తీయడానికి వెళ్ళాడు .వెళ్తూ వెళ్తూ ఇక్కడికి పులి వస్తుంది జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు .సోము సరే అన్నాడు, కాసేపటి తర్వాత సోము తండ్రిని ఆటపట్టించడానికి పులి పులి అని అరిచాడు.వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు.ఎక్కడ ?ఎక్కడ? అని అంటాడు.వురికే అన్నాను నువ్వు వస్తావా లేదా అని అన్నాడు.ఆ తర్వాత కొద్దిసేపటికి  మళ్ళీ ఆలాగే అన్నాడు సోము.సుబ్బయ్య వచ్చాడు ఇంకోసారి ఇలా చేస్తే బాగుండదు అని హెచ్చరించి వెళ్ళాడు.ఒక గంట తర్వాత నిజంగానే పులి వచ్చింది .నాన్న నాన్న అని పిలిచాడు సుబ్బయ్య మాత్రం చెట్టుకిందనుండి రాలేదు పులి వచ్చి మంద లో ఉన్న గొర్రెలను తిన్నది.సోముని గాయపరిచింది. సోము పరిగెత్తుకుంటూ వెళ్లి నాన్నకు  చెప్పి క్షమాపణ వేడుకున్నాడు. మనుషులకు ఒక్కసారి నమ్మకం పోతే దానిని తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టం అందువల్ల నమ్మకం కోల్పోయే పనులు ఎప్పుడు చేయవద్దు. దాన...

నక్క తెలివి

Image
అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి.ఆ అడవికి రాజు మృగరాజు సింహం .సింహం మంచిదే కానీ దాని దగ్గర ఉన్న సైన్యంలో తోడేలు, నక్క,రాబందు ఉండేవి.సింహం సైన్యంలో నక్క అసలు మంచిది కాదు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఇతరులను బలి చేసేది.ఒకరోజు సింహం పర్యటనకు వెళ్ళింది అన్ని జంతువులు ఈ అడవిలో ఎలా ఉన్నాయి నేను అంటే  అసలు బయపడుతున్నాయా లేదా!అని అంతటా తిరిగింది. ఏనుగు దగ్గరకు వచ్చింది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది అది చెప్పే లోపే నక్క కల్పించుకొని వాళ్లకు ఏమి సమస్యలు లేవు రాజు గారు అవి ఇంకా ఇష్టారాజ్యంగా తిరిగి అడవులను పాడు చేస్తున్నాయి వెంటనే ఏనుగులు ఎం చెప్పాలో అర్థం కాక తల దించుకున్నాయి.మృగరాజు ఏనుగులను మంద లించాడు. ఆ తర్వాత పక్షులను అడిగాడు ,వారు అన్ని కలిపి ఒకటే గొంతుతో నక్కను మాట్లాడనియక మాకు చాలా సమస్యలు ఉన్నాయి.అడవిలో మేము గూడు కట్టిన చోట ఇంకొకరిని రానివ్వకండి .మాకు చాలా కష్టం అవుతుంది లేకపోతే మాకు అందరికి ఒక దగ్గర మంచి గూళ్లు కట్టించండి అన్నాయి.వెంటనే నక్క మీకు గుళ్ళు కట్టడానికి డబ్బులు ప్రస్తుతం ఖాజానలో లేవు అవి సర్దిబాటు ఐతే కడతాం అన్నది సింహం పేరుకు రాజు అయిన నక్క మా...

రంగడు-సింగడు-ఉద్యోగం

Image
అనగనగా ఒక రాజ్యంలో సింగడు,రంగడు  అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు.వారి ఇంట్లో వాళ్ళు మీరు ఏ పని చేయడం లేదు అని తిట్టి ఇంట్లో నుండి గెంటేశారు.సింగడు ఏదిఅయినా మన మంచికే అని అనుకుంటాడు అందరికి అలాగే చెప్తాడు.రంగడిని తీసుకుని ఉద్యోగం కోసం బయలుదేరి వెళ్లారు. వారు అలా వెళుతుండగా వారికి సింహాగర్జన వినిపించింది ఇద్దరూ వెంటనే చెట్టు ఎక్కి కోమ్మల్లో దాక్కున్నారు. రంగడు అరేయ్ సింగా మనం ఎంత  ప్రమాదంలో ఉన్నామో తెలుసా మనం ఈ దారిన వద్దు అంటే నువ్వు తెచ్చావు అంటాడు ఎమీ కాదులే నువ్వు గబరపడకు అన్నాడు.మెల్లిగా చెట్టు దిగి చుట్టూ చూసి వేరే దిక్కుగా నడవడం మొదలు పెట్టారు.వెళుతుంటే దారిలో వారికి ఒక ఉంగరం కనిపించింది.దానిని రంగడు వేలికి పెట్టుకున్నాడు. కొంతదూరంలో వారికి భటులు ఎదురుపడ్డారు. రంగడి చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి వాళ్ళను రాజు గర్ దగ్గరికి తీసుకెళ్ళారు. రంగడు భయపడుతున్నాడు, సింగడు ఎమి పర్లేదు మిత్రమా అంత మన మంచికే ఎక్కడ నుండో ప్రయాణం చేసి వచ్చి రాజు గారిని నేరుగా చూసే అవకాశం వచ్చింది అంటాడు.రాజు గారు వారిని గురించి అడిగాడు,వారు జరిగింది అంతా చెప్పారు..నాకు నమ్మకం కలగడం లేదు అప్పటిద...

సహవాస దోషం

Image
అనగనగా ఒక ఊరిలో ఒక గ్రామాధికారి,పూజారి,జూదరి అనుకోకుండా ఒక విహారయాత్రకు బయలుదేరారు.వారు పడవ ప్రయాణం చేస్తున్నారు,ఇంతలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది .దాని వల్ల వారు ఒక ద్వీపంలో చిక్కుకుపోయారు.అటునుంది వారు బయటపడే మార్గం కొరకు చాలా వెతికారు,కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇది ఐతే అది జరుగుతుందని భావించి అలా ఉండిపోయారు. అలా రెండు నెలలు గడిచిపోయాయి ,ఒకరోజు జూదరి రండి ఎంతకాలం ఇలాగే ఉంటారు సరదాగా పేకాట ఆడుకుందాం అంటాడు. గ్రామాధికారి ఈ విషయం మా ఊరిలో తెలిస్తే గ్రామస్తులు నాకు మర్యాద ఇవ్వరు నేను ఆడను అంటాడు.పూజారి జూదం అనేది ఒక వ్యసనం అది మహాపాపం ,నేను ఆడను అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత గ్రామాధికారి జూదరి దగ్గరగా వచ్చి పోనీలే నేను ఇక్కడ ఆడితే అక్కడ మా గ్రామంలో ప్రజలకు ఎలా తెలుస్తుంది రా నాకు ఆట నేర్పించు అన్నాడు.ఆ తర్వాత పూజారి వచ్చి ఏవైనా దోష పరిహారాలు ఉంటే చేసుకుంటా,ఖాళీగా ఉండి ఏమి లాభం అన్నాడు.అలా ముగ్గురు కలిసి ఆడటం మొదలుపెట్టారు.పని ఏమి లేకపోవడంతో వారు ఒక వారంలొనే ఆట నేర్చుకున్నారు.అలా ఆడుకుంటూ కొన్ని నెలలు గడిచాయి.ఒకరోజు ఆ ద్వీపంలో ఒక సీసా కనిపించింది దానికి మూత పెట్టి వుంది వారు ...

స్నేహమేరా జీవితం.

Image
అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది,ఆ చెరువు పక్కన ఒక చెట్టు ఉండేది .ఆ చెట్టు మీద ఒక పావురాల గుంపు ,ఎలుక ,చీమలు ఉండేవి.చెరువులో ఒక బాతు ఉండేది .అవన్నీ మంచి స్నేహంతో కలిసి మెలిసి ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు.ఈ చెట్టు మీద ఎక్కువ పావురాలు ఉన్నాయని వల విసిరి పట్టుకున్నాడు.పావురాలు ఎడుస్తున్నాయి, ఐతే చీమ ,ఎలుక,బాతు అన్ని కలిసి ప్లాన్ చేసాయి ,ఆ పావురాలను ఎలా అయినా విడిపించాలని వెంటనే అమలు చేసాయి. బాతు అరవడం మొదలు పెట్టింది వేటగాడు ఈ శబ్దం ఏంటి అని అటు వెళ్ళాడు,వెంటనే చీమ అతనిని కుట్టింది.అమ్మా నొప్పి అని విలవిల్లాడడు. ఎలుక పరుగున వెళ్లి వలను కొరికింది,పావురాలు అన్ని పారిపోయాయి.వేటగాడు వెంటనే అరవడం మొదలుపెట్టాడు .అన్ని ఎక్కడివి అక్కడకు వెళ్లిపోయాయి ఇంతలో చీమ చెరువులో పడిపోయింది పావురాలు ఒక ఆకును తుంచి నీటిలో వేసింది.చీమ ఆకుపైకి ఎక్కింది ,బాతు దానిని ఒడ్డుకు చేర్చింది.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగించాయి.  మన చుట్టు పక్కల వారితో ఎల్లవేళలా స్నేహంతో ఉండాలి ఒకరికి మంచి చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది.