నక్క తెలివి

అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి.ఆ అడవికి రాజు మృగరాజు సింహం .సింహం మంచిదే కానీ దాని దగ్గర ఉన్న సైన్యంలో తోడేలు, నక్క,రాబందు ఉండేవి.సింహం సైన్యంలో నక్క అసలు మంచిది కాదు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఇతరులను బలి చేసేది.ఒకరోజు సింహం పర్యటనకు వెళ్ళింది అన్ని జంతువులు ఈ అడవిలో ఎలా ఉన్నాయి నేను అంటే  అసలు బయపడుతున్నాయా లేదా!అని అంతటా తిరిగింది.
ఏనుగు దగ్గరకు వచ్చింది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది అది చెప్పే లోపే నక్క కల్పించుకొని వాళ్లకు ఏమి సమస్యలు లేవు రాజు గారు అవి ఇంకా ఇష్టారాజ్యంగా తిరిగి అడవులను పాడు చేస్తున్నాయి వెంటనే ఏనుగులు ఎం చెప్పాలో అర్థం కాక తల దించుకున్నాయి.మృగరాజు ఏనుగులను మంద లించాడు. ఆ తర్వాత పక్షులను అడిగాడు ,వారు అన్ని కలిపి ఒకటే గొంతుతో నక్కను మాట్లాడనియక మాకు చాలా సమస్యలు ఉన్నాయి.అడవిలో మేము గూడు కట్టిన చోట ఇంకొకరిని రానివ్వకండి .మాకు చాలా కష్టం అవుతుంది లేకపోతే మాకు అందరికి ఒక దగ్గర మంచి గూళ్లు కట్టించండి అన్నాయి.వెంటనే నక్క మీకు గుళ్ళు కట్టడానికి డబ్బులు ప్రస్తుతం ఖాజానలో లేవు అవి సర్దిబాటు ఐతే కడతాం అన్నది సింహం పేరుకు రాజు అయిన నక్క మాట వింటుంది కాబట్టి ఏమి అనలేదు అలా అందరి సమస్యలు తెలుసుకొని ఇంటికి బయలుదేరింది.అలా వెళుతున్న సింహాన్ని ఒక వేటగాడు చూసాడు దానిని బాణం వేసి చంపాలని చూస్తూ అనుసరిస్తున్నడు.అలా పైన వెళుతున్న కాకి అది చూసి మహారాజ మిమ్ములను ఎవరో చంపడానికి చూస్తున్నారు అంటుంది.నక్క ఈ అడవికి రాజు ఆయనను ఎవరు చంపుతారు అంటుంది.అలా నడుస్తుంది వేటగాడు బాణం వేస్తాడు సింహం చచ్చిపోతుంది.నక్క పారిపోతుంది అందుకే ఎప్పుడూ ఎవరు చెప్పిన వినాలి ,వింటే నష్టం ఏమి జరగదు కదా వినకపోవడంతో జరిగే అనర్థం ఎక్కువ కదా! వినడానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు అది మంచి అయితే చాలు.రాజు ఎప్పుడు ఒకరిద్దరు మాటలు విని నిర్ణయాలు తీసుకోవద్దు.
 





Comments

Popular posts from this blog

రామచిలుక కథ

అంతా మన మంచికే...

ఐకమత్యమే మహాబలం.