కష్టేఫలి

 

అనగనగా ఒక ఊరిలో ఒక కోడి,ఎలుక ,చిలుక, బాతులు స్నేహితులు .ఐతే ఎలుక ,చిలుక, బాతు ఏ పని చేయకుండా ఎప్పుడూ కోడి తోనే అన్ని పనులు చూపిస్తూ ఉండేవి.ఎలాగైనా వాటికి బుద్ది చెప్పాలి అని ఆ కోడి నిర్ణయించుకుంది. పొద్దున్న లేవగానే ఈ ఇల్లు ఎవరు ఉడుస్తారు? అని అన్నది.నేనుకాదు నేను కాదు అని చిలుక ,ఎలుక ,బాతు అన్నాయ్. సరే నేనె ఉడుస్తా అని ఉడిచింది.గిన్నెలు ఎవరు తోముతారు అని అడిగింది నేను తోమను నేను తోమను అని అన్ని పారిపోయారు.గిన్నెలు కడిగింది కోడి.ధాన్యం ఎవరు సేకరిస్తారు అని అంటే చిలుక, ఎలుక ,బాతు మా వల్ల కాదు అని వెళ్ళిపోయాయ్. కోడి పాపం బెంగగా వెళ్లి ధాన్యం సేకరించింది,వంట చేసింది.ఈ భోజనం ఎవరు చేస్తారు అని కోడి అడిగింది ,మేము తింటాం మేము తింటాం అని అన్ని ముందుకు వచ్చాయి. దానితో కోపం వచ్చిన కోడి నేను ఎవరికి పెట్టను అని అంటుంది.ఎందుకు అని అడుగుతాయి చిలుక,ఎలుక ,బాతు పొద్దున్నుంచి ఒక్కదాన్నే అన్ని చేస్తుంటే ఎవరు సహాయం చేయడానికి రాలేదు తినడానికి మాత్రం వచ్చారు. అందరూ కలిసి పని చేయాలి కలిసి తినాలి తప్ప ఒక్కరే చేయాలి నేను ఏమి చేయను అని ఉండకూడదు..కష్టపడితేనే ఫలితం వస్తుంది అని కోడి చెప్తుంది.




Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...