Skip to main content

Posts

Showing posts from May, 2026

Mahabharatham లో ekalavya katha (ekalavya story)

  మీకు ఎప్పుడూ చెప్పినా మహాభారతం లోని కథలే చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మహాభారతంలో లేనిది లోకంలో లేదు లోకంలో లేనిది ఏది మహాభారతంలో ఉండదు అని ఒక సామెత. ఒకప్పుడు హస్తినాపురానికి దగ్గరలో ఉన్న అడవిలో హిరణ్యధనుస్సు అనే గిరిజన రాజు నివసించేవాడు. అతనికి ఏకలవ్యుడు అనే కుమారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఏకలవ్యుడికి విలువిద్య అంటే ఎంతో ఇష్టం. అతను ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి కావాలని కలలు కనేవాడు. ఆ కాలంలో విలువిద్యలో అత్యంత ప్రఖ్యాత గురువు ద్రోణాచార్యుడు. ఆయన వద్దే కౌరవులు, పాండవులు విద్యలు నేర్చుకుంటుండేవారు. ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి నమస్కరించి, “గురువర్యా! నాకు కూడా విలువిద్య నేర్పించండి” అని వినయంగా అడిగాడు. ద్రోణాచార్యుడు అతని వేషధారణ చూసి, “నేను రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పుతాను” అని చెప్పి తిరస్కరించాడు. ఆ మాటలు విన్న ఏకలవ్యుడు చాలా బాధపడ్డాడు. కానీ తన కలను వదలలేదు. అడవికి తిరిగి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని గురువుగా భావించి ప్రతిరోజూ  వారికి నేర్పించేటపుడు చూసి సాధన  చేయసాగాడు. అతను ఉదయం నుంచి స...

ఉడిపి మహారాజు కథ.

అనగనగా చాలా కాలం క్రితం దక్షిణ భారతదేశంలో ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు ఉడిపి . ఉడిపి మహారాజు పేరు నరేషుడు . ఆయన ఎంతో ధర్మపరుడు, ప్రజల పట్ల ప్రేమ కలిగినవాడు. రాజ్యంలో ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేసేవాడు. అందుకే ప్రజలు ఆయనను ఎంతో గౌరవించేవారు. కానీ ఒక సమస్య మాత్రం మహారాజును ఎప్పుడూ ఆలోచనలో పడేసేది. అది ఏమిటంటే — “నా ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా? లేక నా ముందు మాత్రమే సంతోషంగా నటిస్తున్నారా?” అనే సందేహం. ఒకరోజు ఆయన తన మంత్రి అయిన సోమదేవుడిని పిలిచాడు. “మంత్రి గారూ, మన రాజ్యంలో ప్రజలు నిజంగా మంచివాళ్లా? లేక భయంతో మంచిగా ఉంటున్నారా?” అని అడిగాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించి, “మహారాజా! ఇది తెలుసుకోవాలంటే ఒక పరీక్ష పెట్టాలి” అన్నాడు. రాజు వెంటనే అంగీకరించాడు. పాల కుండ పరీక్ష రాజు రాజ్యం అంతటా ఒక ప్రకటన చేయించాడు. “రేపు ఉదయం రాజభవనం ముందు ఒక పెద్ద కుండ ఉంచబడుతుంది. ప్రతి ఇంటి వారు ఒక గ్లాసు పాలు ఆ కుండలో పోయాలి. అది దేవాలయ సేవకు ఉపయోగపడుతుంది” అని ప్రకటించారు. ప్రజలందరూ “సరే మహారాజా” అని ఒప్పుకున్నారు. ఆ రాత్రి చాలా మంది ఇలా ఆలోచించారు: “అందరూ పాలు పోస్తారు ...

వాతాపి జీర్ణం కథ..

 చిన్న పిల్లలకు అన్నం తినిపించిన వెంటనే జీర్ణం జీర్ణం  వాతాపి జీర్ణం అని ఎందుకు అంటారో తెలుసా? అయితే ఈ కథ చదవండి. వాతాపి జీర్ణం కథ పురాణాలలో ప్రసిద్ధమైన ఒక ఆసక్తికరమైన కథ. ఒకప్పుడు వాతాపి, ఇల్వల అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు.  వీరు బలవంతులు మరియు మాయలమారులు  .  వారు తమ తెలివితేటలను మంచికి కాకుండా దుర్మార్గానికి ఉపయోగించేవారు.ఋషులను మోసం చేసి చంపడం తమ అలవాటుగా చేసుకున్నారు. ఇల్వల బ్రాహ్మణ వేషం వేసుకొని  అతిధి సత్కారం పేరుతో అడవులలో తిరిగే ఋషులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడు. వాతాపి అనే తన తమ్ముడిని మాయశక్తితో మేకగా మార్చి, ఆ మేకను వండి అతిథులకు భోజనంగా పెట్టేవాడు. అది మామూలు ఆహారం అని భావించి వారు భోజనం చేసేవారు. ఋషులు ఆ మాంసం తిన్న తర్వాత, ఇల్వల “వాతాపి! బయటకు రా!” అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి మళ్లీ తన అసలు రూపంలోకి వచ్చి, ఋషుల పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అనేకమంది ఋషులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారు ఋషులను తినేవారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా అగస్త్యుడికి తెలిసింది. సరే ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. అసలే సమ...