Posts

Showing posts with the label చిన్న నీతి కథలు

సజ్జన సాంగత్యం

Image
అది వర్షాకాలం గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కురు దేశంలో వున్నాడు .వర్షాల కారణంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లడం కష్టం కాబట్టి ఆ నాలుగు నెలలు అక్కడే వున్నారు.ఒకరోజు ఆనందుడు బిక్షాటనకు బయలుదేరాడు .అతను అనుకోకుండా అవంతిక అనే వేశ్య ఇంటికి బిక్షకు వెళ్ళాడు.ఆమె అతనికి భిక్ష వేసి వర్షాల కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారని విన్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా ఇంట్లో ఉండొచ్చు అంది . దానికి ఆనందుడు బిక్షువులు ఎక్కడ ఉండాలో తధగతుడు నిర్ణయిస్తాడు అని వారిని అడిగి చెబుతానన్నాడు.అది విన్న బుద్దుడు ఆమెనే ఆహ్వానించినపుడు నువ్వు ఆ ఇంట్లో విడది  చేయడంలో తప్పులేదు నువ్వు అక్కడికి మకాం మార్చుకో అన్నాడు.   అలా ఆనందుడు వేశ్య ఇంటికి వెళ్ళాడు.అవంతిక చక్కటి అతిధి మర్యాదలతో స్వాగతం పలికి ఆహ్వానించింది.అతనికి చినిగిపోయిన బట్టలు చూసి కొత్తవి కుట్టించింది.ఆనందుడికి చలి నుండి రక్షణ కలిగింది.అవంతిక వేళకు అతనికి వేడి వేడి భోజనం అందిస్తూ ఆనందుడు చెప్పే హితోక్తులు శ్రద్ధగా వినేది. ఆ మాటల ప్రభావం చేత అవంతిక కొద్దిరోజుల్లోనే అతడి శిష్యురాలు అయింది .అయితే ఒక బిక్షువు వేశ్య ఇంట్లో ఉండడం తోటివార...

పులి-బాటసారి కథ

Image
పంచతంత్ర కథలు చాలా గొప్ప నీతిని కలిగి ఉంటాయి, వీటిని విష్ణుశర్మ గారు రచించారు.అందులో ఒకటి పులి -బాటసారి కథ . అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి అవతల చెరువు ఒడ్డుకు ఒక పులి నివాసం ఉంది అది చాలా ముసలి పులి.అయితే దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంది .ఒకరోజు అటుగా వెళుతున్న బాటసారిని చూసి దగ్గరగా వెళ్లి ఓ బ్రహ్మణోత్తమా!నువు చూడడానికి చాలా పుణ్యాత్ముడి లాగా కనిపిస్తున్నావు.నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది దీనిని నేను ఎవరైనా పుణ్యాత్ముడికి దానం చేయాలని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నా.నువ్వు కనిపించావు ఇదిగో  ఒకసారి ఆ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ  కంకణం తీసుకో అన్నది పులి .      సరే కానీ నువ్వు క్రూర జంతువువు నేను నిన్ను ఎలా నమ్మాలి అని భయంతో కూడిన ధైర్యంతో ప్రశ్నించాడు. దానికి ఆ ముసలి పులి చూడు నాయనా నన్ను చూస్తే కనబడుత లేదా నేను ఎంత ముసలి దానినో, నా గోర్లు అన్ని మొద్దుబారినవి ,పళ్ళు మొత్తం ఉడిపోయినవి చేతులు కాళ్లు లేవడం లేదు ఎన్నో రోజుల నుండి చాలా మంది ప్రాణాలు తీసిన తప్పుకు పరిహారంగా ఈ దానం చేద్దాం అనుకుంటున్నా అన్నది పులి.పులి చాలా నమ్మకంగా చెప్పే సరికి అతను స్నానం చేయడానికి చెరువులోకి ద...

ఆదిశక్తి....

Image
" యత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంత దేవతా " అన్నారు పెద్దలు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని ప్రతీతి.గౌరీశంకరులు అది దంపతులు వారు మానవాళికి ఆదర్శ దంపతులు. స్త్రీ ,పురుషులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ,గౌరవం, ప్రేమ ఉండాలి.నారాయణుడు లక్ష్మీదేవిని, శివుడు పార్వతిని, బ్రహ్మ సరస్వతిని గౌరవించారు అదే గౌరవం సమాజంలో స్త్రీల పట్ల ఉండాలి అని పురాణాలు చాటి చెప్పాయి.ఎక్కడో ఉన్న గుడిలోని దేవతమూర్తికి వంగి వంగి దండాలు పెడతాం ,అమ్మా కాపాడు అని ప్రార్దిస్తాం కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీ ,సరస్వతి, పార్వతిని మాత్రం చులకనగా చూస్తాం.స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నారు.స్త్రీల యొక్క ప్రయాణం ఎన్నో అవరోధాలను కలిగి ఉంటుంది.అయినా వారు అన్ని ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు.ప్రయాణం ముఖ్యం కాదు గమ్యస్థాననికి చేరుకోవడం ప్రధానం అంటారు పెద్దలు.స్త్రీల పట్ల దయ ,జాలి ,కరుణ ఉండాల్సిన అవసరం లేదు కానీ వారి హక్కులను నియంత్రించకుండా ఉంటే సరిపోతుంది.కాలం మారింది కానీ సనాతన సంప్రదాయాలు,కట్టుబాట్లు కొన్ని మారడం లేదు.అరవింద సమేత సినిమా లో ఆడవాళ్లకు రాజకీయలా...

అప్పయ్య ,కొండయ్య, కొరడా దెబ్బలు

Image
రంగాపురంలో అప్పయ్య,కొండయ్య అనే ఇద్దరు స్నేహితులు వుండేవారు.వారు దేశ సంచారం చేసేవారు రాజ్యంలోని పరిస్థితులను రాజుకు వివరించేవారు.అలా తిరుగుతూ తిరుగుతూ వుండేవారు. కోటిలింగాల రాజ్యంలో రాజు మా రాజ్యంలో ప్రజలు అంతా చాలా మంచివారు స్వార్థం లేని వారు అధికారులు లంచం తీసుకోరు అని బాగా గొప్పలు చెప్పుకునేవారు. కోటిలింగాల ప్రజల గురుంచి,అధికారుల గురించి తెలుసుకోవడానికి అప్పయ్య, కొండయ్య బయలుదేరారు.గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఇద్దరు ఆట పాటలతో అందరిని ఆకట్టుకొని డబ్బులు పొగుచేస్తున్నారు.వాళ్ళు దారిలో వెళుతుంటే ఆగంతకులు వచ్చి వాళ్ళ సంచిని ఎత్తుకొని వెళ్లారు వీరు వాళ్ళను వెంబడించి దొంగలను పట్టుకున్నారు ఎందుకు ఇలా చేసారు అని అడగగా మాకు పని దొరకక ఆకలికి దొంగతనం చేసాము ఈ రాజ్యంలో ఏదయినా లోటు ఉంది అని చెప్తే మంత్రి వర్గం అంత మమ్ములను బ్రతనివ్వరు అందుకే మేము సంతోషంగా ఉన్నట్లు రాజు గారిని నమ్మిస్తున్నాము అని అన్నారు.అలా అన్ని గ్రామాలు పూర్తి అయిన తర్వాత అనోటా ఈనోట అప్పయ్య ,కొండయ్యల ఆట పాటల వినోదాలు రాజు గారికి తెలిసింది .వారికి రాజభవనం నుండి ఆహ్వానం లభించింది. వారు వస్తుంటే ఇద్దరు కాపలాదారులు మిమ్మ...

రుక్మయ్య-వడ్డీ..

Image
అనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు సులోచనడు.సులోచనడు అంటే మంచి ఆలోచనలు కలిగిన వాడు అని అర్థం .ఆ రాజ్యంలో రుక్మయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను నగలు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవాడు,కానీ ఎక్కువ వడ్డీ లాగేవాడు.కలలో కూడా వడ్డీ వడ్డీ అని ఆలోచించేవాడు. సులోచనడు అతనిని చాలా సార్లు మందలించాడు. అయిన అతని పద్దతి మార్చుకోలేదు. రుక్మయ్య దగ్గరికి చెన్నయ్య దంపతులు వచ్చారు వారి కూతురి వివాహం కోసం సొమ్ము అవసరం అయ్యింది. చెన్నయ్య దంపతులు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి ధనాన్ని తీసుకెళ్లారు అందరికంటే నీకు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాను అనేసరికి నోటు రాసుకోలేదు.చెన్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు , కూతురి వివాహం జరిగిపోయింది.      కొన్ని రోజుల తరువాత చెన్నయ్య దంపతులు పంట అమ్ముడుపోగా మిగిలిన ధనాన్ని ,దాచి ఉంచారు .అలా కూడబెట్టిన ధనాన్ని తీసుకొని పోయి రుక్మయ్య దగ్గరకు వెళ్లారు ,ఆయన నువ్వు నా దగ్గర ఎప్పుడు తాకట్టు పెట్టవు ? నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాను అని అన్నాడు.చెన్నయ్య దంపతులు కంగారుపడి తర్వాత తేరుకొని అలా మాట్లాడతారు ఏంటి రుక్మయ్య గారు మేము మా క...

శ్రవణకుమారుడి కథ..

Image
 ఈ కథ అందరికీ తెలుసు కానీ  ఇంకా తెలియని వాళ్ళ కోసం మాత్రమే. గాంధీజీ తన ఆశ్రమంలో జనులందరితో ముచ్చటిస్తూ వున్నారు.అక్కడ ఉన్నవారు తల్లిదండ్రుల సేవ ఎలా చేయాలి అని అడిగారు దానికి గాంధీజీ ఒక కథ చెప్తాను అన్నాడు ఎందుకంటే ఆ కథ అంటే గాంధీజీకి చాలా ఇష్టం.అది తల్లిదండ్రులను గౌరవించే శ్రవణకుమారుడి కథ.శ్రవనకుమారుడి తల్లిదండ్రులకు కళ్ళు లేవు ఐతే వారి బాగోగులు మొత్తం ఆయనే చూస్తూ ఉండేవాడు .వారు వయసు మీరడంతో మాకు తీర్థయాత్రలు చేయలని ఉంది అని అన్నారు దానికి శ్రవనకుమారుడు సరే అన్నాడు.వారిద్దరిని ఒక కావడి తయారు చేసి దానిలో కూర్చో బెట్టాడు.వారిని అలా తీసుకొని వెళుతుండగా దారిలో వారికి దాహం వేసింది ,నీళ్ల కోసం వారిని అక్కడే ఉంచి వెళ్ళాడు.ఇంతలో వేటకు వచ్చిన దశరథ మహారాజు జింక అనుకోని బాణం వేసాడు అది శ్రవనకుమారుడికి గుచ్చుకుంది .దశరథుడు వచ్చి చూసి అయ్యె?నేను ఎంత పాపం చేసాను అని బాణం తీయడానికి ప్రయత్నించాడు,శ్రవనకుమారుడు వద్దు మహారాజ న తల్లిదండ్రులకు దాహం తీర్చి ఈ విషయాన్ని చెప్పండి అని కన్ను ముసాడు.దశరథుడు తీవ్రమైన దుఃఖంతో వచ్చి వారి దాహం తీర్చి నా  వల్ల మీ కుమారుడు మరణించాడు అని చెప్...

సహవాస దోషం

Image
అనగనగా ఒక ఊరిలో ఒక గ్రామాధికారి,పూజారి,జూదరి అనుకోకుండా ఒక విహారయాత్రకు బయలుదేరారు.వారు పడవ ప్రయాణం చేస్తున్నారు,ఇంతలో ఒక భయంకరమైన తుఫాను వచ్చింది .దాని వల్ల వారు ఒక ద్వీపంలో చిక్కుకుపోయారు.అటునుంది వారు బయటపడే మార్గం కొరకు చాలా వెతికారు,కానీ వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. చివరకు ఇది ఐతే అది జరుగుతుందని భావించి అలా ఉండిపోయారు. అలా రెండు నెలలు గడిచిపోయాయి ,ఒకరోజు జూదరి రండి ఎంతకాలం ఇలాగే ఉంటారు సరదాగా పేకాట ఆడుకుందాం అంటాడు. గ్రామాధికారి ఈ విషయం మా ఊరిలో తెలిస్తే గ్రామస్తులు నాకు మర్యాద ఇవ్వరు నేను ఆడను అంటాడు.పూజారి జూదం అనేది ఒక వ్యసనం అది మహాపాపం ,నేను ఆడను అంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత గ్రామాధికారి జూదరి దగ్గరగా వచ్చి పోనీలే నేను ఇక్కడ ఆడితే అక్కడ మా గ్రామంలో ప్రజలకు ఎలా తెలుస్తుంది రా నాకు ఆట నేర్పించు అన్నాడు.ఆ తర్వాత పూజారి వచ్చి ఏవైనా దోష పరిహారాలు ఉంటే చేసుకుంటా,ఖాళీగా ఉండి ఏమి లాభం అన్నాడు.అలా ముగ్గురు కలిసి ఆడటం మొదలుపెట్టారు.పని ఏమి లేకపోవడంతో వారు ఒక వారంలొనే ఆట నేర్చుకున్నారు.అలా ఆడుకుంటూ కొన్ని నెలలు గడిచాయి.ఒకరోజు ఆ ద్వీపంలో ఒక సీసా కనిపించింది దానికి మూత పెట్టి వుంది వారు ...