Posts

Showing posts with the label education neetikathalu

పాజిటివ్ థింకింగ్.

Image
  సెప్టెంబర్ నెలలో 13 వ తేదీని పాజిటివ్ థింకింగ్ డే గా నిర్వహిస్తారు.సానుకూల ఆలోచనలు మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లిస్తాయి.ఒక వ్యక్తి ఎంత బాధలో ఉన్నా తనయొక్క ఆలోచనలు నియంత్రించుకోకపోతే అవి వ్యతిరేక ఆలోచనలుగా మారతాయి,దానివల్ల మనం లేక ఇతరులు భాదపడవలసి వస్తుంది.సానుకూల ఆలోచనలు మన మెదడును ప్రభావితం చేస్తాయి.మనం చేసే ప్రతి పని ఒక పద్దతిలో చేయాలి,ప్రతికూల ఆలోచనల ధోరణిని విడిచిపెట్టాలి.కాదు అని అనుకున్న పనులు కూడా మన ప్రయత్నంతో పూర్తి అవుతాయి.ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ప్రణాళిక రచన చాలా ప్రధానం,ప్రణాలికను చక్కగా ఆచరణలో పెడితే తొంబై శాతం పూర్తి అవుతుంది.మిగిలిన 10 శాతం పని చేయడం వల్ల ఐపోతుంది.సానుకూల ఆలోచనల వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది,సృజనాత్మకత బయట పడుతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది.రక్తపోటు, ఆందోళన,డిప్రెషన్ వంటివి చేరతాయి.ఆటగ్యాన్ని దెబ్బతీసే ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. ఒక విషయాన్ని ఎంత ఆలోచించిన మారదు, కాన్ని దాని నుండి బయట పడే మార్గాన్ని వెతికితే సులువుగా ఆ పని మనం చేయవచ్చు. మీకు పాజిటివ్ థింకింగ్ గురించి ఒక కథ చెప్తాను.రామాపురంలో సుగుణమ్మ అనే ఒక ముసలి అవ్...

ఐకమత్యమే మహాబలం.

Image
ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .

తెనాలి రామలింగని తెలివి

Image
అది శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం ,అతని మంత్రి తెనాలి రామకృష్ణుడు. అతను చాలా తెలివినవాడు.పక్క రాజ్యం లోని రాజు ఈ విషయం తెలుసుకుని అతని తెలివికి పరీక్ష పెట్టాలనుకున్నాడు.మా రాజ్యానికి ఒక ఇరవై కిలోల క్యాబేజీ,యాభై ఆకుకూర కట్టలు కావాలని  వర్తమానం పంపాడు.అందరూ ఈ వర్తమానాన్ని చూసి తలలు పట్టుకొని కూర్చున్నారు.ఆ రాజ్యం నుండి ఈ రాజ్యానికి వెళ్ళడానికి అరవై రోజుల ప్రయాణం పడుతుంది,అని భయపడుతున్నారు.శ్రీకృష్ణదేవరాయలు రామలింగడిని పిలిచి ఈ సమస్యకు పరిష్కారం చూపమని అడిగాడు. రామలింగడు బాగా ఆలోచించి ఒక  పది ఎద్దులబండ్లు తెప్పించామన్నాడు.అందరూ చాలా ఉత్కంఠగా చూస్తున్నారు ఈయన ఏమి చేస్తున్నాడు అని.రాయలు మాత్రం రామలింగడి మీద నమ్మకంతో ఏమి అడగలేదు,తెనాలి రామలింగడు అన్ని ఎద్దులబండ్లలో సగం వరకు మట్టిని నింపాడు.కొన్నింటిలో ఆకుకూరలు విత్తనాలు కొన్నింటిలో క్యాబేజీ విత్తనాలు వేశాడు. ఒక్కొక్క బండికి రెండు కుండలు కట్టాడు,ఒక్కో బండికి ఇద్దరు మనుషులను పెట్టాడు వారు దారి పొడవునా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆ మట్టికి నీరు పెట్టమన్నాడు అలా అరవై రోజుల ప్రయాణ సమయానికి ఆ గింజలు మొలకెత్తి తాజా కూరగాయలు,ఆకుకూరలు రాజు గ...

అంతా మన మంచికే...

Image
అనగనగా ఒక రాజ్యం ఉండేది, దానికి రాజు సులోచనడు.అంటే మంచి ఆలోచనలు కలిగినవాడు అని అర్థం .రాజు చాలా మంచివాడు కానీ ముక్కోపి వెంటనే కోపం వస్తుంది.ఆయనతో ఎవరు మాట్లాడిన చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతారు. అతని దగ్గర రాజశేఖరుడు అనే మంత్రి ఉండేవాడు.అతను మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి.ఒకసారి రాజదర్బారులో పండితుల సేవ చేస్తుంటే పండ్లను కోసి ఇస్తుండగా వేలు తెగింది అక్కడ ఉన్నవారు అంత బాధపడ్డారు ఒక్క మంత్రి మాత్రం అంత మన మంచికే అన్నాడు.అసలే ముక్కోపి అయిన సులోచనడు ఎం ఆలోచించకుండా అతనిని బంధించాడు.ఒక వారం రోజుల తర్వాత వేటకు వెళ్ళాడు మంది మార్బలంతో చీకటి పడింది.తన వెంట వచ్చినవారు తప్పిపోయారు అలా వెళుతూ ఒక గూడెంకి చేరాడు.అక్కడ ఉన్నవాళ్లు ఇతనిని దొంగగా భావించి కట్టిపడేశారు.గూడెం పెద్ద వచ్చాడు అక్కడివారు అయ్యా ఇతను వేరే ప్రదేశం నుండి చొరబడ్డాడు అందుకే కట్టి పడేసాము అన్నారు.పెద్ద చూసి ఐతే ఇతనిని అమ్మవారికి బలి ఇవ్వండి  అన్నాడు.ఇంకొక తలారీ వచ్చి రాజు సులోచనుడిని కింద నుండి మీద వరకు తేరిపారా చూసాడు .అతని వేలు తెగి ఉంది,ఇతను బలి ఇవ్వడానికి సరిపోదు అన్నాడు.హమ్మయ్య ప్రాణాలు నిలబడ్డాయి అని సంతోషించి ...

రామచంద్రయ్య కథ

Image
అనగనగా ఒక ఊరిలో రామచంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించేవాడు .ఎంత చేసినా తినడానికిఈ తప్ప ఏమీ మిగలడం లేదు,అని పగలు రాత్రి కష్టపడి కట్టెలు కొట్టేవాడు అతనికి నిద్ర కూడా సరిగా ఉండేది కాదు.ఒకరోజు అతని కూతురికి ఆరోగ్యం బాగాలేదు అదే దిగులుతో ఎలాగైనా ఏ రోజు ఎక్కువ కట్టెలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు.అలా కొడుతున్న సమయంలో గొడ్డలి చేయి జారీ నీటిలో పడిపోయింది.అందులో నుండి గంగా మాత బయటకువచ్చి బంగారు గొడ్డలి ఇచ్చింది.అమ్మ ఇది నాది కాదు అన్నాడు రామచంద్రయ్య, గంగామాత లోపలికి వెళ్లి వెండి గొడ్డలి తెచ్చింది .అమ్మా ఇదికూడా నాది కాదు ,నాది కేవలం ఇనుప గొడ్డలి అంతే అన్నాడు .గంగమాత మళ్ళీ లోపలికి వెళ్లి ఇనుప గొడ్డలి తెచ్చి ఇచ్చింది.హా ఇది నాదే అని తీసుకున్నాడు .అతను నిస్వార్థంగా ఉన్నందువల్ల గంగమాత సంతోషించి బంగారు మరియు వెండి గొడ్డలి కూడా ఇచ్చింది.రామచంద్రయ్య వద్దు అమ్మా నాకు అన్నాడు,అయినా ఆమె ఇచ్చింది,దానిని తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనోటా ఈ నోటా అది ఎదురింటి రాజయ్యకు తెలిసింది.రాజయ్య కూడా ఎలాగైనా  బంగారు గొడ్డలి, వెండి గొడ్డ...

గాడిద తెలివి

Image
అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతను ఒక కుక్కను,గాడిదను పెంచుకున్నాడు.కుక్కను కాపలాగా ఉంచి గాడిదను పట్నానికి తీసుకోని వెళ్ళాడు అక్కడ నుండి సరుకులు అన్ని తెచుకునేవాడు.ఇలా రోజులు గడిచిపోతున్నాయి.,గాడిదకు కుక్క మీద ఎక్కువ అసూయ పెంచుకుంటుంది.ఒకరోజు ఇంట్లో వాళ్ళు అందరూ నిద్రిస్తుండగా దొంగలు వచ్చారు వారిని చూసి కుక్క మొరిగింది, అందరూ లేచి దొంగలను తరిమికొట్టారు. గాడిదకు కోపం వచ్చింది దానిని మెచ్చుకొని ఇంకా గారబం చేశారు.గాడిద అరిచింది ఈ సారి దానిని కొట్టాడు రైతు రామయ్య. కోపం తెచ్చుకొని ఎలాగైనా వీరికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది.పట్నానికి సరుకులు తేవడానికి వెళ్ళేటప్పుడు నదిని దాటాలి,అప్పుడు నేను పడిపోయినట్టు నటిస్తాను అన్ని సరుకులు పడిపోతాయి అనుకుంది.సరుకులు తీసుకొని వస్తుండగా నదిలో పడిపోయింది దానిలో సరుకులు పాడైపోయాయి.ఉప్పు బస్తా మొత్తం కరిగిపోయింది గాడిదకు ఇది ఎదో మాయనదివలె ఉంది అని భావించి ఏ రోజు కి ఏ పని లేదు అని సంతోషంగా ఇంటికి వెళ్ళింది .రైతు మాత్రం గాడిదకు ఏమైనా దెబ్బలు తగిలాయి అని అనుకోని డాక్టర్ ని తెచ్చాడు మందులు ఇచ్చాడు .రెండు రోజులు ఏ పని చెప్పలేదు  అది...

కష్టేఫలి

Image
  అనగనగా ఒక ఊరిలో ఒక కోడి,ఎలుక ,చిలుక, బాతులు స్నేహితులు .ఐతే ఎలుక ,చిలుక, బాతు ఏ పని చేయకుండా ఎప్పుడూ కోడి తోనే అన్ని పనులు చూపిస్తూ ఉండేవి.ఎలాగైనా వాటికి బుద్ది చెప్పాలి అని ఆ కోడి నిర్ణయించుకుంది. పొద్దున్న లేవగానే ఈ ఇల్లు ఎవరు ఉడుస్తారు? అని అన్నది.నేనుకాదు నేను కాదు అని చిలుక ,ఎలుక ,బాతు అన్నాయ్. సరే నేనె ఉడుస్తా అని ఉడిచింది.గిన్నెలు ఎవరు తోముతారు అని అడిగింది నేను తోమను నేను తోమను అని అన్ని పారిపోయారు.గిన్నెలు కడిగింది కోడి.ధాన్యం ఎవరు సేకరిస్తారు అని అంటే చిలుక, ఎలుక ,బాతు మా వల్ల కాదు అని వెళ్ళిపోయాయ్. కోడి పాపం బెంగగా వెళ్లి ధాన్యం సేకరించింది,వంట చేసింది.ఈ భోజనం ఎవరు చేస్తారు అని కోడి అడిగింది ,మేము తింటాం మేము తింటాం అని అన్ని ముందుకు వచ్చాయి. దానితో కోపం వచ్చిన కోడి నేను ఎవరికి పెట్టను అని అంటుంది.ఎందుకు అని అడుగుతాయి చిలుక,ఎలుక ,బాతు పొద్దున్నుంచి ఒక్కదాన్నే అన్ని చేస్తుంటే ఎవరు సహాయం చేయడానికి రాలేదు తినడానికి మాత్రం వచ్చారు. అందరూ కలిసి పని చేయాలి కలిసి తినాలి తప్ప ఒక్కరే చేయాలి నేను ఏమి చేయను అని ఉండకూడదు..కష్టపడితేనే ఫలితం వస్తుంది అని కోడి చెప్తుంది.

మౌన వ్రతం

Image
రాఘవ పురం అనే గ్రామం ఉండేది.ఆ గ్రామంలో ప్రజలు అంతా సుఖ శాంతులతో జీవించసాగారు.అలాంటి గ్రామం లోకి ఒక వదరుబోతు వచ్చాడు అతను గ్రామంలోని ప్రజలు ఇంత సుఖంగా ఉండడం చూడలేక పోయాడు. అతను అక్కడి వారందరితో స్నేహం చేసాడు, అలా కొంత కాలం మంచిపేరు ,నమ్మకం సంపాదించాడు.  తర్వాత ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు మొదట్లో ఎవరూ నమ్మకపోయేవారు తర్వాత తర్వాత నమ్మడం మొదలు పెట్టారు దీని వలన ఆ గ్రామం లోని ప్రజలు నిత్యం ఏదో ఒక సంఘర్షణ పడుతుండేవారు, దానితో విసుగు చెందిన గ్రామ పెద్దలు ఒక సాధువు దగ్గరకు వెళ్ళి వాళ్ళ గోడు చెప్పారు .ఉన్నట్టుండి మా గ్రామంలో అంతః కలహాల వల్ల గ్రామాభివృద్ధి జరగడం లేదు అని చెప్పారు. ఆ సాధువు మీరు ఒక నెలంతా మౌనవ్రతం పాటించండి అని చెప్పాడు .గ్రామపెద్దలకు ఏమి బోధ పడలేదు అయిన సాధువు చెప్పడం వల్ల ప్రజలంతా మౌనవ్రతం పాటించాలని చాటింపు వేసారు.గ్రామంలో ప్రజలు మౌనంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవించారు.ఊరు ఊరు అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది గ్రామ పెద్దలు సంతోషించి సాధువు దగ్గరకు వెళ్లారు అయ్యా మీరు చెప్పిన్నట్టే నెల నుండి మేము వ్రతం చేస్తున్నాం అందరూ సంతోషంగా వున్నారు అని ...

చిన్న చేప కథ

Image
అనగనగా కథలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఇది ఒక చేప పిల్ల కథ. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది,అందులో ఒక చేపల కుటుంబం నివసిస్తూ ఉండేది.అందులో అందరికన్నా చిన్నది అయిన చేప ఒకరోజు బయటకు వచ్చి ఈదడం నేర్చుకుంటుంది.అక్కడే ఒక  కోమ్మ పైన ఉన్న పక్షిని చూసి అది అంతలా ఎలా ఎగురుతుంది అని ఆలోచించింది దానితో   దగ్గరగా వెళ్లి నేను ఈదుతున్న మొత్తం నీటిలోనే ఉంటాను కానీ నువ్వు మాత్రం రెక్కలతొ ఎంత దూరం అయిన ప్రయాణం చేయగలవు అని బాధ  పడుతుంది .ఆ పక్షి అలా కాదు అమ్మ నువ్వు జల జీవివి నీకు రెక్కలు ఉండవు .నువ్వు ఈదుతున్నావు నేను ఈదలేను అని బాధ పడుతున్నాన అని అంటుంది . ఆ చిన్న చేప తన తల్లి దగ్గరకు వెళ్లి అమ్మా మనకు రెక్కలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తుంది, అప్పుడు ఆ తల్లి చేప భగవంతుడు ఒక్కో ప్రాణిని ఒక్కో లాగా సృష్టించాడు అని చెపుతుంది అయిన వినకుండా మారం చేస్తుంది. తెల్లవారుజామున ఆ తల్లి చేప  అడవిలో ఉన్న జంతువులు అన్నింటినీ సమావేశం కావాలిసిందిగా కోరింది, కోరిన విధంగా అన్ని జంతువులు చెరువు చుట్టూ మూగారు .తల్లి చేప పిల్ల చేపను తీసుకొని వచ్చి చూడు ఇవన్ని అడవిలోని రకరకాల జంతువులు కోతి ,నక్...