Skip to main content

Posts

Showing posts with the label mahabharatam kathalu

భృగు మహర్షి బ్రహ్మజ్ఞానం పొందిన కథ – ఆనందమే బ్రహ్మం

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. అదేంటంటే, ఆధ్యాత్మిక సాధనలో చేసే ఏ ప్రయత్నమూ ఎప్పటికీ వృథా కాదు. మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ విధంగా ప్రయత్నిస్తారు. కొందరికి సత్యాన్ని గ్రహించడానికి ఎక్కువ సమయం పడుతుంది, మరికొందరు త్వరగా తెలుసుకుంటారు. ఇది వారి శ్రద్ధ, పట్టుదల, సాధనపై ఆధారపడి ఉంటుంది. అందుకే గీతలో "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అని చెప్పబడింది. సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నవాడు తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటాడని గీత బోధిస్తుంది. అలాంటి సత్యాన్వేషణలో భాగంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహర్షే భృగు మహర్షి.   భృగు మహర్షి బ్రహ్మదేవుని మానస పుత్రుడు. ఒకరోజు ఆయన తన తండ్రిని అడిగాడు: "దేవుడు ఎవరు? ఆయనను ఎలా తెలుసుకోవాలి?" అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: "తపస్సు ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. బ్రహ్మం మాటలకు అందదు, మనసుకు పూర్తిగా అర్థం కాదు. అనుభవం ద్వారానే దానిని తెలుసుకోవాలి." తండ్రి మాటలలోని లోతైన అర్థాన్ని గ్రహించిన భృగు మహర్షి అరణ్యానికి వెళ్లి కఠోర తపస్సు ప్రారంభించాడు. దీర్ఘకాల ధ్యానం, ...

శిఖండి కథ

ఆడవారు ఎంత ప్రేమగా అమ్మలా ఉంటారో అదేవిధంగా తనకు అన్యాయం జరిగితే అదే అమ్మ కాళికా మాత అవతారంతో తన ప్రతీకారం తీర్చుకుంటారు.అలాంటి ఒక ప్రేమ ,ఆప్యాయత,ప్రతీకారం కి సంబంధించిన కథ మన మహాభారతంలోని శిఖండిని కథ. అనగనగా కాశీ దేశానికి ఒక రాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు అందమైన కుమార్తెలు  అంబ, అంబిక, అంబాలికలు ఉండేవారు.వారిని రాజు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కొంతకాలం తర్వాత వారికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి అన్ని దిక్కుల నుండి రాజులు వచ్చారు. విషయం తెలుసుకున్న భీష్ముడు తన సోదరుడు విచిత్రవీర్యుడి వివాహం జరిపించాలని ఆ స్వయంవరానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన వారందరిలో ఎవరు బలవంతులైతే వారికి నా కూతుర్లును ఇచ్చి వివాహం చేస్తాను అని కాశి రాజు ప్రకటించాడు.అక్కడికి వచ్చిన వారందరిని ఒంటిచేత్తో భీష్ముడు ఓడించాడు అందులో సాళ్వుడు అనే యువరాజు కూడా ఉన్నాడు. భీష్ముడు అంబ,అంబికా,అంబాలికలను తీసుకొని వాయువేగంతో హస్తినాపురానికి చేరాడు.వెళ్ళే మార్గంలో అంబ తను సాల్వుడినీ ప్రేమిస్తున్న విషయం చెప్పింది ,  భీష్ముడు అంబను గౌరవంగా  పంపించాడు. అంబ శాల్వుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చ...

Mahabharatham లో ekalavya katha (ekalavya story)

  మీకు ఎప్పుడూ చెప్పినా మహాభారతం లోని కథలే చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మహాభారతంలో లేనిది లోకంలో లేదు లోకంలో లేనిది ఏది మహాభారతంలో ఉండదు అని ఒక సామెత. ఒకప్పుడు హస్తినాపురానికి దగ్గరలో ఉన్న అడవిలో హిరణ్యధనుస్సు అనే గిరిజన రాజు నివసించేవాడు. అతనికి ఏకలవ్యుడు అనే కుమారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఏకలవ్యుడికి విలువిద్య అంటే ఎంతో ఇష్టం. అతను ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి కావాలని కలలు కనేవాడు. ఆ కాలంలో విలువిద్యలో అత్యంత ప్రఖ్యాత గురువు ద్రోణాచార్యుడు. ఆయన వద్దే కౌరవులు, పాండవులు విద్యలు నేర్చుకుంటుండేవారు. ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి నమస్కరించి, “గురువర్యా! నాకు కూడా విలువిద్య నేర్పించండి” అని వినయంగా అడిగాడు. ద్రోణాచార్యుడు అతని వేషధారణ చూసి, “నేను రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పుతాను” అని చెప్పి తిరస్కరించాడు. ఆ మాటలు విన్న ఏకలవ్యుడు చాలా బాధపడ్డాడు. కానీ తన కలను వదలలేదు. అడవికి తిరిగి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని గురువుగా భావించి ప్రతిరోజూ  వారికి నేర్పించేటపుడు చూసి సాధన  చేయసాగాడు. అతను ఉదయం నుంచి స...

ఉడిపి మహారాజు కథ.

అనగనగా చాలా కాలం క్రితం దక్షిణ భారతదేశంలో ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు ఉడిపి . ఉడిపి మహారాజు పేరు నరేషుడు . ఆయన ఎంతో ధర్మపరుడు, ప్రజల పట్ల ప్రేమ కలిగినవాడు. రాజ్యంలో ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేసేవాడు. అందుకే ప్రజలు ఆయనను ఎంతో గౌరవించేవారు. కానీ ఒక సమస్య మాత్రం మహారాజును ఎప్పుడూ ఆలోచనలో పడేసేది. అది ఏమిటంటే — “నా ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా? లేక నా ముందు మాత్రమే సంతోషంగా నటిస్తున్నారా?” అనే సందేహం. ఒకరోజు ఆయన తన మంత్రి అయిన సోమదేవుడిని పిలిచాడు. “మంత్రి గారూ, మన రాజ్యంలో ప్రజలు నిజంగా మంచివాళ్లా? లేక భయంతో మంచిగా ఉంటున్నారా?” అని అడిగాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించి, “మహారాజా! ఇది తెలుసుకోవాలంటే ఒక పరీక్ష పెట్టాలి” అన్నాడు. రాజు వెంటనే అంగీకరించాడు. పాల కుండ పరీక్ష రాజు రాజ్యం అంతటా ఒక ప్రకటన చేయించాడు. “రేపు ఉదయం రాజభవనం ముందు ఒక పెద్ద కుండ ఉంచబడుతుంది. ప్రతి ఇంటి వారు ఒక గ్లాసు పాలు ఆ కుండలో పోయాలి. అది దేవాలయ సేవకు ఉపయోగపడుతుంది” అని ప్రకటించారు. ప్రజలందరూ “సరే మహారాజా” అని ఒప్పుకున్నారు. ఆ రాత్రి చాలా మంది ఇలా ఆలోచించారు: “అందరూ పాలు పోస్తారు ...

nala damayanthi story in telugu(Mahabharatham stories)

మీకు ముందే చెప్పాను కదా , మహాభారతంలో కథలు చాలా బాగుంటాయి అవి మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి .ఇది ఒక  అందమైన ప్రేమకథ .చాలా ప్రేమకథలు తెలుసు కానీ ఎన్నో ట్విస్టులు వున్న కథ ఇది. అయిపోయింది అనుకున్నప్పుడే మళ్ళీ మలుపు వుంటుంది అందుకే ఈ కథ ప్రేక్షకులు చదువుతున్నంత సేపు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి  కలుగుతుంది.జీవితంలో ఎన్నో కష్టాలను ఓర్చుకొని  ప్రేమను గెలిపించుకున్న  నల దమయంతుల ప్రేమకథ. అనగనగా నిషధ దేశాన్ని వీరసేనుడు   అనే రాజు   పాలిస్తుండేవాడు అతనికి నలుడు  , పుష్కరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నలుడు  ధర్మపరుడు , సత్యవంతుడు, ప్రజలకు ఎంతో ఇష్టమైనవాడు .  తండ్రి  వీరసేనుడుకు కూడా నలుడు అంటే ఇష్టం వల్ల అతన్ని రాజుగా ప్రకటించాడు నలుడు రాజు అవ్వడం పుష్కరుడికి ఇష్టం లేదు. ఇదిలా ఉండగా విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు,అతనికి ధమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు దముడు ,ధమనుడు,దంతుడు అనే కుమారులు కలిగారు.    దమయంతి అపూర్వ సౌందర్యం, వినయం కలిగినది . ఈ విషయం నలుడు  ...

శ్రీకృష్ణ రాయబారం .

మహాభారతంలో అన్ని కథలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నట్లే ఈ శ్రీకృష్ణ రాయబారం కూడా అలాంటిదే. రాయబారం అంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం కాదు ఇరువురి మధ్య ఉన్న సమస్య గురించి లోతైన అవగాహన ఉండాలి.సమస్య తెలిస్తేనే కదా ! దారి తెలుస్తుంది.మహాభారతం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితాలకు ఒక అర్థవంతమైన పుస్తకం. పాండవులను కౌరవులు అడుగడుగునా హింసిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలో వారు కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్తాన్ని చూడడానికి ఒకరోజు దుర్యోధనుడు వెళ్తాడు అతను ఆ భవనాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందాడు,దానితో అసూయ చెందాడు.ఎలాగైనా ఇంద్రప్రస్తాన్ని కూడా చేజిక్కించుకోవాలి అని పన్నాగాలు పన్నాడు.శకుని మామ సహాయంతో మాయ పాచికలు తయారు చేసాడు.ధర్మరాజు జూదానికి బానిస కాదు కాని అతనికి జూదం అంటే ప్రాణం.   ధర్మరాజును కౌరవులు జూదానికి ఆహ్వానించారు ,వారి మనస్తత్వం తెలిసి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు.వారు ఆహ్వానించనందువల్ల మనం వెళ్ళాలి అని అందరిని కూడా గట్టుకొని హస్తీనాపురానికి వచ్చాడు.శకుని తన చాకచక్యంతో పండిత పామర జనాలను మభ్య పెడుతూ ధర...

కచుడు -దేవయాని కథ..

మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో  ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం.             హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా  మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా  బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు. దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు.      దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి  దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు. శుక్రాచార్యుడుకి దేవయాని...