Posts

Showing posts from March, 2026

బహుమతి - శిక్ష

Image
తెలుగు కథలలో ముఖ్యంగా తెనాలి రామ కథలు చాలా ప్రత్యేకం.కొన్ని హాస్యాస్పదం మరికొన్ని తెలివి తేటలకు సంబంధించినవి ఉంటాయి.ఇది కూడా అలాంటిదే. రామకృష్ణుడి స్నేహితుడు ఒకరోజు సభా మందిరాన్ని చూడాలని అనుకున్నాడు అయితే అతడు రేపు రా అని చెప్పాడు . స్నేహితుడు తెల్లారక సభ సమయానికి వచ్చాడు ద్వార పాలకులు అడ్డగించారు లోపలికి వెళ్లనివ్వలేదు.అతను రామలింగని స్నేహితుడిని అని చెప్పినా వినలేదు.మరుసటి రోజు ఆ స్నేహితుడు రామలింగడి ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. సరే ఈ విషయాన్నీ నేను కనిపెడత్తా అని  రామలింగడు మరునాడు సభకు మారువేషంలో వెళ్ళాడు.లోపలికి వెళ్లబోతుంటే ద్వారపాలకులు అడ్డుకున్నారు  , అయితే రామలింగడు తనను తాను ఒక కళాకారుడిగా పరిచయం చేసుకున్నాడు.భటులు ఒకవేళ నీ కళ నచ్చితే రాజుగారు నీకు బహుమతి ఇస్తారు మాకు ఏం లాభం అన్నారు .సరే నాకు ఇచ్చిన బహుమతిలో సగం ఇస్తాను అని అన్నాడు రామలింగడు.ఇలా కొంచెం లోపలికి వెళ్లగానే మళ్లీ ద్వారపాలకులు అడ్డగించారు అలా మొత్తం సభలోకి వెళ్ళడానికి చాలా మంది అడ్డగించారు . రాజు దగ్గరికి వెళ్ళి తన కవిత్వం చెప్పాడు ఆ కవిత్వానికి మెచ్చి  కృష్ణదేవరాయలు ఏమి బహుమతి క...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Image
మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా  మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయటా  అలుపని రవ్వంత  అని అనవంట వెలుగులు పూస్తవు వెళ్ళే దారంతా. ఈ పాట వింటే ప్రతి ఒక్కరి కంట్లో చిన్న కన్నీటి చెమ్మ  వస్తుంది ,  ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీ పాత్ర అలాంటిది. ముఖ్యంగా తెలుగు ఇళ్లలో ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గు వేస్తే ఆ ఇంటి కల వేరుగా ఉంటుంది నా చిన్నప్పటి నుండి అది ఒక ఎమోషన్.  స్త్రీలు  బాల్యం నుండి అల్లారు ముద్దుగా పెరిగి వివాహం అయిన తర్వాత వేరే ఇంటికి వెళతారు. అక్కడ  వాళ్ళను కూడా సొంత ఇంటి వారిగానే భావించి కలిసి పోతారు. వాళ్ళు కొన్నిసార్లు ఇష్టాలను చంపుకొని,బాధను దిగమింగి తల్లితండ్రులకు మంచి పేరు తేవడానికి ప్రయత్నిస్తారు.ఆమె లేని ఇల్లు ఒక నరకం అని చాలా మంది అభిప్రాయం.భర్తకు భార్యగా సేవలు చేస్తుంది అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి అన్ని పనులు చేస్తుంది   వాళ్ళ వంశం అభివృద్ధి కోసం తన   ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంకొక ప్రాణానికి ఊపిరి   పోస...

హోళీ ఎందుకు జరుపుకుంటారు

Image
హోళీ పండుగ శుభాకాంక్షలు మై డియర్ బ్లాగు రీడర్స్ .  భారతదేశంలో జరిగే ప్రతి పండగకు ఒక ప్రాధాన్యత ఉంటుంది .హోళీ రంగుల పండగ చిన్న పెద్ద తేడా  లేకుండా  అందరు ఈ పండగను రంగులు చల్లుకుంటూ , మిఠాయిలు తినిపించుకుంటూ చాలా సంబరాలు చేసుకుంటారు.  హోళీ పండగ జరుపుకోవడానికి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి పండగలో అంతరార్థం చెడుపై మంచి సాధించిన విజయం లేక ఆధ్యాత్మికత ఇమిడి ఉంటాయి. విష్ణుపురాణం ప్రకారం హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక వరం పొందాడు.అతను ఎలాగైనా చావకుండా ఉండాలని దేవతలతో గానీ,రాక్షసులతో గాని,అస్త్రము,శస్త్రము లతో గానీ ,పగలు కానీ , రాత్రి కానీ, నేలమీద కానీ ఆకాశం మీద కానీ ,ఇంటిలోపల ,బయట కానీ జంతువులతో కానీ ,మనుషులతో కానీ ఇలా ఎవరి వల్ల చావులేకుండా వరాన్ని పొందాడు.ఈ వర గర్వంతో హిరణ్యకశిపుడు లోకాలను బాధపెట్ట సాగాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ బాలుడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు.అతను గురుకులంలో చదువుకుంటున్నప్పుడు విష్ణువు మీద భక్తి కలిగింది శ్రీ మహావిష్ణువు లీలలు తెలుసుకున్న ప్రహ్లాదుడు విష్ణువు తప్ప ఎవరు గొప్ప కాదు అని అంటుండేవ...