Posts

Showing posts with the label story

తెనాలి రామలింగని తెలివి

Image
అది శ్రీకృష్ణదేవరాయలు రాజ్యం ,అతని మంత్రి తెనాలి రామకృష్ణుడు. అతను చాలా తెలివినవాడు.పక్క రాజ్యం లోని రాజు ఈ విషయం తెలుసుకుని అతని తెలివికి పరీక్ష పెట్టాలనుకున్నాడు.మా రాజ్యానికి ఒక ఇరవై కిలోల క్యాబేజీ,యాభై ఆకుకూర కట్టలు కావాలని  వర్తమానం పంపాడు.అందరూ ఈ వర్తమానాన్ని చూసి తలలు పట్టుకొని కూర్చున్నారు.ఆ రాజ్యం నుండి ఈ రాజ్యానికి వెళ్ళడానికి అరవై రోజుల ప్రయాణం పడుతుంది,అని భయపడుతున్నారు.శ్రీకృష్ణదేవరాయలు రామలింగడిని పిలిచి ఈ సమస్యకు పరిష్కారం చూపమని అడిగాడు. రామలింగడు బాగా ఆలోచించి ఒక  పది ఎద్దులబండ్లు తెప్పించామన్నాడు.అందరూ చాలా ఉత్కంఠగా చూస్తున్నారు ఈయన ఏమి చేస్తున్నాడు అని.రాయలు మాత్రం రామలింగడి మీద నమ్మకంతో ఏమి అడగలేదు,తెనాలి రామలింగడు అన్ని ఎద్దులబండ్లలో సగం వరకు మట్టిని నింపాడు.కొన్నింటిలో ఆకుకూరలు విత్తనాలు కొన్నింటిలో క్యాబేజీ విత్తనాలు వేశాడు. ఒక్కొక్క బండికి రెండు కుండలు కట్టాడు,ఒక్కో బండికి ఇద్దరు మనుషులను పెట్టాడు వారు దారి పొడవునా వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆ మట్టికి నీరు పెట్టమన్నాడు అలా అరవై రోజుల ప్రయాణ సమయానికి ఆ గింజలు మొలకెత్తి తాజా కూరగాయలు,ఆకుకూరలు రాజు గ...

రామచంద్రయ్య కథ

Image
అనగనగా ఒక ఊరిలో రామచంద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను కట్టెలు కొట్టి డబ్బులు సంపాదించేవాడు .ఎంత చేసినా తినడానికిఈ తప్ప ఏమీ మిగలడం లేదు,అని పగలు రాత్రి కష్టపడి కట్టెలు కొట్టేవాడు అతనికి నిద్ర కూడా సరిగా ఉండేది కాదు.ఒకరోజు అతని కూతురికి ఆరోగ్యం బాగాలేదు అదే దిగులుతో ఎలాగైనా ఏ రోజు ఎక్కువ కట్టెలు కొట్టాలని నిర్ణయించుకున్నాడు.అలా కొడుతున్న సమయంలో గొడ్డలి చేయి జారీ నీటిలో పడిపోయింది.అందులో నుండి గంగా మాత బయటకువచ్చి బంగారు గొడ్డలి ఇచ్చింది.అమ్మ ఇది నాది కాదు అన్నాడు రామచంద్రయ్య, గంగామాత లోపలికి వెళ్లి వెండి గొడ్డలి తెచ్చింది .అమ్మా ఇదికూడా నాది కాదు ,నాది కేవలం ఇనుప గొడ్డలి అంతే అన్నాడు .గంగమాత మళ్ళీ లోపలికి వెళ్లి ఇనుప గొడ్డలి తెచ్చి ఇచ్చింది.హా ఇది నాదే అని తీసుకున్నాడు .అతను నిస్వార్థంగా ఉన్నందువల్ల గంగమాత సంతోషించి బంగారు మరియు వెండి గొడ్డలి కూడా ఇచ్చింది.రామచంద్రయ్య వద్దు అమ్మా నాకు అన్నాడు,అయినా ఆమె ఇచ్చింది,దానిని తీసుకొని ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చి జరిగిన విషయాన్ని చెప్పాడు. అనోటా ఈ నోటా అది ఎదురింటి రాజయ్యకు తెలిసింది.రాజయ్య కూడా ఎలాగైనా  బంగారు గొడ్డలి, వెండి గొడ్డ...

స్నేహమేరా జీవితం.

Image
అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది,ఆ చెరువు పక్కన ఒక చెట్టు ఉండేది .ఆ చెట్టు మీద ఒక పావురాల గుంపు ,ఎలుక ,చీమలు ఉండేవి.చెరువులో ఒక బాతు ఉండేది .అవన్నీ మంచి స్నేహంతో కలిసి మెలిసి ఉండేవి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక వేటగాడు వచ్చాడు.ఈ చెట్టు మీద ఎక్కువ పావురాలు ఉన్నాయని వల విసిరి పట్టుకున్నాడు.పావురాలు ఎడుస్తున్నాయి, ఐతే చీమ ,ఎలుక,బాతు అన్ని కలిసి ప్లాన్ చేసాయి ,ఆ పావురాలను ఎలా అయినా విడిపించాలని వెంటనే అమలు చేసాయి. బాతు అరవడం మొదలు పెట్టింది వేటగాడు ఈ శబ్దం ఏంటి అని అటు వెళ్ళాడు,వెంటనే చీమ అతనిని కుట్టింది.అమ్మా నొప్పి అని విలవిల్లాడడు. ఎలుక పరుగున వెళ్లి వలను కొరికింది,పావురాలు అన్ని పారిపోయాయి.వేటగాడు వెంటనే అరవడం మొదలుపెట్టాడు .అన్ని ఎక్కడివి అక్కడకు వెళ్లిపోయాయి ఇంతలో చీమ చెరువులో పడిపోయింది పావురాలు ఒక ఆకును తుంచి నీటిలో వేసింది.చీమ ఆకుపైకి ఎక్కింది ,బాతు దానిని ఒడ్డుకు చేర్చింది.ఇలా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవనం సాగించాయి.  మన చుట్టు పక్కల వారితో ఎల్లవేళలా స్నేహంతో ఉండాలి ఒకరికి మంచి చేస్తే మళ్ళీ అదే తిరిగి వస్తుంది.

మౌన వ్రతం

Image
రాఘవ పురం అనే గ్రామం ఉండేది.ఆ గ్రామంలో ప్రజలు అంతా సుఖ శాంతులతో జీవించసాగారు.అలాంటి గ్రామం లోకి ఒక వదరుబోతు వచ్చాడు అతను గ్రామంలోని ప్రజలు ఇంత సుఖంగా ఉండడం చూడలేక పోయాడు. అతను అక్కడి వారందరితో స్నేహం చేసాడు, అలా కొంత కాలం మంచిపేరు ,నమ్మకం సంపాదించాడు.  తర్వాత ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు మొదట్లో ఎవరూ నమ్మకపోయేవారు తర్వాత తర్వాత నమ్మడం మొదలు పెట్టారు దీని వలన ఆ గ్రామం లోని ప్రజలు నిత్యం ఏదో ఒక సంఘర్షణ పడుతుండేవారు, దానితో విసుగు చెందిన గ్రామ పెద్దలు ఒక సాధువు దగ్గరకు వెళ్ళి వాళ్ళ గోడు చెప్పారు .ఉన్నట్టుండి మా గ్రామంలో అంతః కలహాల వల్ల గ్రామాభివృద్ధి జరగడం లేదు అని చెప్పారు. ఆ సాధువు మీరు ఒక నెలంతా మౌనవ్రతం పాటించండి అని చెప్పాడు .గ్రామపెద్దలకు ఏమి బోధ పడలేదు అయిన సాధువు చెప్పడం వల్ల ప్రజలంతా మౌనవ్రతం పాటించాలని చాటింపు వేసారు.గ్రామంలో ప్రజలు మౌనంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవించారు.ఊరు ఊరు అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది గ్రామ పెద్దలు సంతోషించి సాధువు దగ్గరకు వెళ్లారు అయ్యా మీరు చెప్పిన్నట్టే నెల నుండి మేము వ్రతం చేస్తున్నాం అందరూ సంతోషంగా వున్నారు అని ...

ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు...

సెప్టెంబర్ 5 న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు ,ఏ రోజు ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కనుక. గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి నడిపే మార్గాన్ని చూపే వ్యక్తి. అది ఎవరైనా కావచ్చు మనను మంచి వైపు నడిపించేవాడు ఎల్లప్పుడూ గురువే అయి ఉంటాడు. సూర్యుడు లేకుండా వెలుగు లేదు, ఔషదం సేవించకుండా రోగం నశించదు అలాగే గురువు లేకుండా  జ్ఞానం లభించదు అని పెద్దల మాట. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు కు అత్యంత విలువైన ప్రాముఖ్యత వుంటుది.మన తల్లిదండ్రులు మనకు జన్మ ఇస్తే గురువు పునర్జన్మ ఇస్తాడు. ఈ సందర్భంగా ఒకచిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో స్వేచ్ఛ అని ఒక అల్లరి పిల్ల ఉండేది తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అవడం వల్ల అల్లారు ముద్దుగా పెంచారు .ఆమెను పాఠశాలలో చేరిస్తే అల్లరి తగ్గుతుంది అని భావించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు, కానీ తీరు మారలేదు,ఆమె ఒకరోజు అటుగా వెళుతున్న గురువు పంచె ను లాగింది దాని వల్ల అతడు కింద పడిపోయారు  తలకు గాయం అయింది అది చూసి పరుగెత్తింది స్వేచ్ఛ, భయంతో వణికిపోతోంది ఆమెను చూసి గురువు చూసావా నువు చేసిన అల్లరి పని వల్ల నాకు రక్తం వస్తుంది ...