Skip to main content

పీత-కొంగ కథ .🦀🦢.

ఈ రోజు పంచతంత్రం కథలలో పీత-కొంగ  కథ తెలుసుకుందాం. అనగనగా ఒక కొలను ఆ కొలనులో ఒక పీత నివాసం ఉంటుంది. ఒకసారి ఆ కొలను దగ్గరకు ఒక కొంగ వచ్చింది.అది ఆ కొలనులో దిగి ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టు నటించుతుంది రోజు ! అది రోజూ పీత, కొలనులో చేపలు చూస్తున్నాయి.అయితే ఆ చేపలు కానీ పీత కానీ కొంగది దొంగ జపం అని గుర్తించ లేకపోయినాయి.ఒకరోజు పీత కొంగ దగ్గరకు వచ్చి మహాత్మా! ఇక్కడ ఇన్ని చేపలు మీ కళ్ళ ముందు తిరుగుతున్న కూడా మీరు వాటిని పట్టి తినకుండా ఇలా జపం చేసుకుంటున్నారు దీనికి కారణం ఏమిటి అన్నది.
అప్పుడు ఆ కొంగ మరింత ధ్యానంలో ఉన్నట్టు నటించింది.కొంగగారు మిమ్మల్ని నేను అడుగుతున్న అయిన సమాధానం చెప్పడం లేదు కారణం ఏమైనా ఉందా అని అడిగింది మళ్లి పీత.
కొంగ మెల్లిగా కళ్ళు తెరిచి మీరు భక్తి శ్రద్ధలతో అడిగారు కాబట్టి చెబుతున్న విను,నువ్వు చెప్పినట్టు ఆ మధ్యదాక  నేను కూడా చేపలనే కాదు భగవంతుడు మాకు ఇచ్చిన నేను తినదగిన అన్ని జంతువులను తినేవాడిని.ఆ మధ్య కాలంలో నేను నివసించే చెట్టు కిందకు ఒక యోగి వచ్చాడు.ఆయనతో చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు.ఆ శిష్యులకు ఉపదేశం చేసేటపుడు నేను ఆ చెట్టు పైన వున్నాను ,ఆయన ఇలా చెప్పాడు  భక్తులారా! మన బ్రతుకులు నీటి బుడగ లాంటివి అవి ఏ ఘడియలో అయినా చివరికి పోవచ్చు అందువలన మనం బ్రతికుండగానే చేయవలసిన పుణ్య కార్యాలు, దాన ధర్మాలు  చేయాలి.దైవ ప్రార్థనలు చేసి ముక్తి పొందాలి.అహింసయే పరమో ధర్మహా . మన  ఆకలిని అంతం చేసుకోవడానికి హింస చేయరాదు. అని చెప్పాడు.
అది విన్న నేను ఆ నిముషం నుండి బార్యాబిడ్డలను వదిలి పెట్టాను. బంధుమిత్రులను గురుంచి పట్టించుకోలేదు . ఇంకొక విషయం నేను వుండే ఇంటిని కూడా వదిలేశాను. స్నానం ధ్యానం చేయడానికి ఇక్కడ వీలు ఉంటుందని తలచి ఇక్కడికి వచ్చాను.మళ్ళీ ఒంటి కాలు మీద నిలబడి  తపస్సు ప్రారంభించింది.కొంగ చెప్పిన మాటలు పీతతో పాటు చేపలు విన్నాయి, వినడం మాత్రమే కాదు రోజు అవి బయటకు వచ్చి కొంగను మెచ్చుకుంటూ అవి కూడా ధ్యానం చేయడం మొదలు పెట్టాయి.కొంగ చెప్పే వేదాంత ఉపన్యాసాలు వింటున్నాయి ప్రతిరోజూ.
నాలుగు రోజులు పోయాక ఎప్పటిలాగే చేపలు, పీతలు  కొంగ దగ్గరకు వచ్చాయి.అవి రావడం దూరం నుండే గమనించిన కొంగ ఏడుస్తుంది, కన్నీళ్లు ధారగా పడుతున్నాయి.ఏమైంది? కొంగ గారు  ఏడుస్తున్నారా? ఎందుకు అని ఆడిగాయి.
 ఈ కొలనులో స్నానం చేసి ఒడ్డుకు వచ్చి తపస్సు చేస్తున్నాను , అప్పుడే  అక్కడికి వచ్చిన బెస్తవాళ్లు ఇలా అంటున్నారు.ఈ వేసవి కాలంలో ఇక్కడ కొలను ఎండిపోతుంది ఇక్కడ ఉన్న చేపలన్ని పట్టి తీసుకొని పోవచ్చు అని అనుకున్నారు .పొరుగు వూరు వెళ్లిన పోయిన ఖర్మం తప్పులేదని నేను అన్ని త్యజించి ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళ మాటలు విన్న  ,అని బాధపడింది.కొంగ నాటకం కన్నా ఎక్కువ చేపలు బాధ పడుతున్నాయి.ఆ బెస్తవాళ్లు మమ్మల్ని పట్టి తీసుకొని పోతారేమో అని భయపడసాగాయి.
కొంగ మన కోసం బాధ పడుతుంది అని దాని మంచితనాన్ని మెచ్చుకున్నాయి.కొంగ కుట్ర పాపం చేపలకు పీతకు తెలియదు కదా! మీరే మాకు పెద్ద దిక్కు దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు,ముందు జాగ్రత్త మంచిది. అన్నింటా అశ్రద్ధ పనికి రాదు మనకు మంచి స్నేహం ఉంది .నువ్వు దైవభక్తుడివి మాకు ఏదైనా ఉపాయం చెప్పి మా ప్రాణాలు రక్షించండి అని వేడుకున్నాయి ఆ చేపలు పీత.సరే ఆలోచిద్దాం అన్నది కొంగ.
  కొంతసేపటికి ఇక్కడికి కొద్ది దూరంలో నిత్య జలాశయం ఉంది అక్కడ నీరు ఇంకి పోవడం కానీ ఎండిపోవడం కానీ ఉండదు . మీ అందరినీ అక్కడికి చేరుస్తాను అక్కడ మీరు పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు.మీరు ఒప్పుకుంటే అని అడిగింది కొంగ.
చేపలు అంగీకరించాయి.ప్రతిరోజూ మూడు చేపలను నోట కరుచుకుని వెల్లసాగింది. కొంగ అక్కడికి దూరాన ఉన్న పెద్ద కొండ పై భాగాన చేరి నోటా కరుచుకుని వచ్చిన చేపలను తినేసి మళ్ళీ చేపలు ఉన్న చోటుకి వచ్చేది.
మిగతా చేపలు అవన్నీ సురక్షితంగా ఉన్నాయి మేము ఎప్పుడు బయటపడుతామో అని అనుకుంటూ ఉండేవి.పాపం వాటికి తెలియదు కదా ఆ చేపలు అన్ని చచ్చిపోయాయి అని.రోజు కొని చేపలను తీసుకెళ్లడం,తినడం, తిరిగిరావడం నిరాటంకంగా జరుగుతుంది.కొన్ని రోజుల వ్యవధిలోనే కొలనులో చేపలు అన్ని ఐపోయాయి.
ఒక్క పీత మాత్రమే మిగిలింది నేనె కదా నీకు మొదటి స్నేహితుడను అందరూ వెళ్లి పోయారు నేను ఒక్కదాన్నే వున్నాను. నన్ను కూడా ఆ జలాశయంకి చేర్చు అని అన్నది.అయ్యో ఎంతమాట అన్నావు పీత, నిన్నెందుకు వదిలేస్తా ఇంకా నువ్వే మిగిలాము , పొద్దున్నే  బయలుదేరుదాము.
పొద్దున్న కొంగ పీతను ముక్కుకు కరుచుకుని బయలుదేరింది .ఆకాశ మార్గాన వెళుతుంటే అన్ని ఇల్లు గుట్టలే కనిపించాయి నీరు ఎక్కడా కనబడుటలేదు .పీతకు అనుమానం మొదలయింది ఇది ఏదో ఎత్తుగడతో చేసింది మమ్మల్ని తినడానికి దొంగజపం చేసింది .అంతేకదా నమ్మకం మీద విషం తాగించవచ్చు ,అపనమ్మకం మీద నీరు కూడా త్రాగించలేము అనుకుంది.
కొంతసేపటికి నేను నీ నోటి నుండి జారీ పోతున్నట్టు అనిపిస్తుంది అక్కడ కొండ మీద ఒక్కసారి ఆగు నేను నీ రెక్కలు పట్టుకొని  పైకి ఎక్కుతా అన్నది ,సరే లే అని ఆగింది కొండ మీద అన్ని చేపల అస్థికలు చూసి ఇక్కడ నేను అనుకున్నదే జరుగుతుంది అని వెంటనే కొంగ మెడ గట్టిగా కొరికింది దాంతో అది చనిపోయింది.పీత వెంటనే పక్కన ఉన్న కలుగులోనికి వెళ్ళింది.
ఒక్కొక్కసారి కొందరు చాలా నమ్మకంగా మనను నమ్మిస్తారు.వారు చేసే మోసం పెద్ద ఎత్తుగడతో కూడినది అయి ఉంటుంది.కాబట్టి ఎదుటి వాళ్ళు ఇది చెప్పిన అంత తేలికగా నమ్మవద్దు .ఒకటికి పదిసార్లు ఆలోచించి మన స్వంత నిర్ణయాలు తీసుకోవాలి.








Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .