Skip to main content

లాభమా? -నష్టమా?

అనగనగా ఒక పెద్ద అడవి దాని పేరు సుందరవనము.అది అతి సుందరంగా వుండడం చేతదానిని సుందరవనము అంటారు.ప్రతి అడవికి రాజు సింహమే కదా ఇక్కడ కూడా సింహమే రాజు ,కుందేలు మాత్రం మంత్రి . అడవిలో అన్నీ జంతువులు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది అక్క కొన్ని వృద్ధ జంతువులు కూర్చొని తమ తమ సమస్యల గురుంచి మాట్లాడుకుంటున్నాయి.
       దూరం నుంచి ఆ మాటలు వింటుంది సింహం వారికి కనపడకుండా .ఆ జంతువులు మనము ఇప్పుడు ముసలి వాళ్ళము మనకు వేటాడే శక్తి లేదు కాబట్టి మన పిల్లలను బాధ పెట్టకుండా మనలో మనం ఆహారం ఐపోయి చనిపోదాం అని అంటున్నాయి.ఆ మాట విన్న సింహం కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
సింహం తన స్థావరనికి వచ్చి కుందేలును పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .జంతువులు అన్ని భయం భయంగా వచ్చాయి.అప్పుడు అక్కడ ఉన్న జంతువులను ఉద్దేశించి మన అడవిలో ఎవరికైనా అత్యవసరంగా సాయం చేయవలసి ఉందా అని అడిగింది, అన్ని ఆలోచించసాగాయి.కుందేలు టక్కున లేచి సాయం కోసం ఎదురు చూసేది కేవలం వృద్ధ ప్రాణులే అంది కుందేలు.ఐతే మీరందరు వృద్ధ జంతువుల సంరక్షణ కోసం సలహాలు,సూచనలు చేయవలసిందిగా ఆదేశించింది.
రాజా మనం తెచ్చుకునే ఆహారంలో కొంత భాగాన్ని ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం అన్నది కుందేలు.అలా ఎలా కుదురుతుంది అని అన్నది నక్క మృగరాజుకు కోపం వచ్చింది ,అది గమనించిన చిరుత అవి మనలాగా పరుగెత్తలేక పోవచ్చు కానీ ఆరుస్తూ  వేటగాళ్ల బారి నుండి జింక పిల్లలను కాపాడడం నేను చూసాను అన్నది.
ఒక కొండముచ్చు నేను ఆహారం కోసం వెళ్ళినపుడు నా పిల్లలను డేగ నుండి రక్షించిది.పిల్లలను జాగ్రత్తగా చూస్తాయి అని అంది ఉడుత.ఇది మాకు కలిగిన ఉపకారమే కదా అన్నాయి.
అవును కేసరి గారు మేము ఆహారం వేటకు వెళ్ళినపుడు మా పిల్లలను వృద్ధ జంతువులు చూసుకుంటున్నాయి.కాబట్టి వాటి సంరక్షణ మన బాధ్యత .పైగా మా పిల్లలకు వేటాడేందుకు కావలిసిన నైపుణ్యాలను, ఎలా ఉండాలి,ఎలా ఉండకూడదు అనే జాగ్రత్తలు నేర్పిస్తున్నాయి.అడవిలో ఒకరికి ఒకరు ఎలా తోడి ఉండాలో కూడా, సంస్కారం నేర్పిస్తున్నాయి.ఏ విధంగా చూసిన లాభమే ఉంది నష్టం ఏమి లేదు అన్నది తోడేలు .
అప్పుడు మృగరాజు నడవలేని ఆహారం తెచుకోలేని జీవులకు మిగతా జంతువులు తమ ఆహారంలో కొంత భాగాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పింది అది బాధ్యతగా భావించాలి ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరిక జారీ చేసింది.దానికి నక్కతో సహా మిగతా జంతువులు సరే అన్నాయి. ఎవరికైనా అనారోగ్యం వస్తే వారికి నేను ఉచితంగా వైద్యం చేస్తాను అంది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి ఆలోచనకు మృగరాజుతో సహా అన్ని జంతువులు కరతాల ధ్వనులు చేశాయి.అక్కడ ఉన్న  వృద్ధ జంతువులు అన్ని సింహం దగ్గరికి వచ్చి  ధన్యవాదాలు తెలిపాయి .
సింహం మెల్లిగా చూడండి మీరు వృద్ధులు అయినంత మాత్రాన చనిపోవాలని ఆలోచన చేయవద్దు అన్నది.దానికి అన్ని జంతువులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాయి, నాకు అడవిలో జరిగే అన్ని సంఘటనలు తెలుస్తాయి.మేము కూడా వృద్ధులము అయిపోతాము.మీ సలహాలు సూచనలు ఈ తరానికి అవసరం అనగానే అవన్నీ సరే మహారాజా ఇంకోసారి ఇలా చేయము అని మాట ఇచ్చాయి.
అప్పటి నుండి అడవి జీవులు వృద్ధ జీవులకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకున్నాయి.అనుకోని ఇబ్బందులు వచ్చినపుడు ఎలా ఉండాలో పిల్లలకు తమ అనుభవాలు చెప్తున్నాయి.
ఈ కథ కేవలం అడవి జంతువులకు మాత్రమే కాదు మనుషులకు కూడా .మన సమాజంలో కూడా వృద్దులు వుంటారు ప్రతి ఇంట్లో వారి సంరక్షణ నేడు భారం అయింది .వారి అనుభవాలు నేటి తరానికి చాలా అవసరం అందుకే బాధ్యతగా భావించి వృద్ధులని జాగ్రత్తగా చూసుకోవాలి .ఎన్నో చూసి వుంటారు వాళ్ళు ఒక్కోసారి కోపంతో అన్న మాటలు  పట్టించుకోవద్దు.తల్లిదండ్రులు పిల్లలకు మంచి నేర్పిస్తే ఆ తరువాత వాళ్ళు కూడా వృద్ధులైన తర్వాత చూసుకుంటారు.
వారి సంరక్షణ కోసం ప్రభుత్వం చాలా చట్టాలు అందుబాటులోకి తెచ్చింది.చట్టాలకు భయపడి కాకుండా  జీవితాన్ని మన కోసం బ్రతికిన వారి కోసం మనం  కేవలం   వారు ఉన్నన్ని రోజులు  వారిని ఆరోగ్యంగా ఆనందంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది.





Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .