ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున భారతదేశంలో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు ప్రతి ఒక్కరి వాట్సాప్ స్టేటస్లు “స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం…” అనే పాటతో మార్మోగిపోతుంటాయి. మనకు మనమే ఉత్తమమైన, ఆదర్శమైన స్నేహితులమని అనుకుంటాం. స్నేహితులంతా ఒకచోట చేరి, తమకు ఇష్టమైన వారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. కానీ ప్రపంచంలో స్నేహానికి నిజమైన అర్థాన్ని తెలియజేసే ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. అలాంటి కథల్లో “స్నేహం అంటే ఇదే” అని మనకు తెలియజేసే గొప్ప పురాణ కథ — శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం. గురుకులంలో మొదలైన స్నేహం సాందీపని మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, కుచేలుడు (సుదాముడు) కలిసి విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటి నుంచే వారిద్దరి మధ్య ఎంతో ఆత్మీయమైన స్నేహం ఏర్పడింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి స్నేహం బలపడింది. కాలం గడిచింది. ఇద్దరూ పెద్దయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కుచేలుడు మాత్రం తన గ్రామంలో దొరికిన పని చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపసాగాడు. అతనికి వివాహం జరిగింది. కొంతకాలానికి పిల్లలు కూడా కలిగారు. కానీ రోజులు గడిచేకొద్దీ కుచేలుడి కుటుంబం తీవ్రమైన ...
సాధారణంగా మనం సినిమాల్లో హీరో వేషం వేసిన వారు అందరూ హీరోలలాగా , విలన్ గా చేసినవారిని విలన్ లాగా అనుకుంటాం కానీ అందరూ అలాగే ఉండరు కొంతమంది హీరోలగా చేసినా విలన్ క్యారెక్టర్ చూపిస్తారు.మీకు అందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన చెప్తా , సోనూసూద్ గారు కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి సహాయం చేసి తన యొక్క మానవత్వాన్ని నిరూపించాడు. అతను తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే చేశాడు కానీ అతను చేసిన పని చూసి చాలా మందికి గౌరవం కలిగింది . ఎవరైనా ఎలాంటి వారు అన్నది ఇంట్లో ఉండి అయినా చూడాలి లేదా వెంట వెళ్ళి అయినా చూడాలి అంటారు పెద్దలు అప్పుడే వాళ్ళ ప్రవర్తన మనకు పూర్తిగా అర్థం అవుతుంది. చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని చెప్పే ఒక కథ తెలుసుకుందాం . మహాభారతంలో ధర్మవ్యాధుడు అని ఒకతను ఉండేవాడు అతని కథను చదివితే మీకే అర్థం అవుతుంది చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని. పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతడు అన్ని విద్యలలో ఆరి తేరిన వాడు,సర్వ ఙ్ఞానం కలిగినవాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చొని శిష్యులకు వేదాలు నేర్పుతుండగా ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది అద...