శిఖండి కథ
ఆడవారు ఎంత ప్రేమగా అమ్మలా ఉంటారో అదేవిధంగా తనకు అన్యాయం జరిగితే అదే అమ్మ కాళికా మాత అవతారంతో తన ప్రతీకారం తీర్చుకుంటారు.అలాంటి ఒక ప్రేమ ,ఆప్యాయత,ప్రతీకారం కి సంబంధించిన కథ మన మహాభారతంలోని శిఖండిని కథ. అనగనగా కాశీ దేశానికి ఒక రాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు అందమైన కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలు ఉండేవారు.వారిని రాజు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కొంతకాలం తర్వాత వారికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి అన్ని దిక్కుల నుండి రాజులు వచ్చారు. విషయం తెలుసుకున్న భీష్ముడు తన సోదరుడు విచిత్రవీర్యుడి వివాహం జరిపించాలని ఆ స్వయంవరానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన వారందరిలో ఎవరు బలవంతులైతే వారికి నా కూతుర్లును ఇచ్చి వివాహం చేస్తాను అని కాశి రాజు ప్రకటించాడు.అక్కడికి వచ్చిన వారందరిని ఒంటిచేత్తో భీష్ముడు ఓడించాడు అందులో సాళ్వుడు అనే యువరాజు కూడా ఉన్నాడు. భీష్ముడు అంబ,అంబికా,అంబాలికలను తీసుకొని వాయువేగంతో హస్తినాపురానికి చేరాడు.వెళ్ళే మార్గంలో అంబ తను సాల్వుడినీ ప్రేమిస్తున్న విషయం చెప్పింది , భీష్ముడు అంబను గౌరవంగా పంపించాడు. అంబ శాల్వుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చ...