Skip to main content

Posts

Showing posts with the label chinna neethi kathalu

స్నేహం అంటే ఇదే – శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం

ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున భారతదేశంలో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు ప్రతి ఒక్కరి వాట్సాప్ స్టేటస్‌లు “స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం…” అనే పాటతో మార్మోగిపోతుంటాయి. మనకు మనమే ఉత్తమమైన, ఆదర్శమైన స్నేహితులమని అనుకుంటాం. స్నేహితులంతా ఒకచోట చేరి, తమకు ఇష్టమైన వారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. కానీ ప్రపంచంలో స్నేహానికి నిజమైన అర్థాన్ని తెలియజేసే ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. అలాంటి కథల్లో “స్నేహం అంటే ఇదే” అని మనకు తెలియజేసే గొప్ప పురాణ కథ — శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం. గురుకులంలో మొదలైన స్నేహం సాందీపని మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, కుచేలుడు (సుదాముడు) కలిసి విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటి నుంచే వారిద్దరి మధ్య ఎంతో ఆత్మీయమైన స్నేహం ఏర్పడింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి స్నేహం బలపడింది. కాలం గడిచింది. ఇద్దరూ పెద్దయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కుచేలుడు మాత్రం తన గ్రామంలో దొరికిన పని చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపసాగాడు. అతనికి వివాహం జరిగింది. కొంతకాలానికి పిల్లలు కూడా కలిగారు. కానీ రోజులు గడిచేకొద్దీ కుచేలుడి కుటుంబం తీవ్రమైన ...

మహాభారతంలో ధర్మవ్యాధుని కథ

సాధారణంగా మనం సినిమాల్లో హీరో వేషం వేసిన వారు అందరూ హీరోలలాగా , విలన్ గా చేసినవారిని విలన్ లాగా అనుకుంటాం కానీ అందరూ అలాగే ఉండరు కొంతమంది హీరోలగా చేసినా విలన్ క్యారెక్టర్ చూపిస్తారు.మీకు అందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన చెప్తా , సోనూసూద్ గారు కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి సహాయం చేసి తన యొక్క మానవత్వాన్ని నిరూపించాడు. అతను తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే చేశాడు  కానీ అతను చేసిన పని చూసి చాలా మందికి గౌరవం కలిగింది . ఎవరైనా ఎలాంటి వారు అన్నది ఇంట్లో ఉండి అయినా చూడాలి లేదా వెంట వెళ్ళి అయినా చూడాలి అంటారు పెద్దలు అప్పుడే వాళ్ళ ప్రవర్తన మనకు పూర్తిగా అర్థం అవుతుంది.     చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని చెప్పే ఒక కథ తెలుసుకుందాం . మహాభారతంలో    ధర్మవ్యాధుడు అని ఒకతను ఉండేవాడు అతని కథను చదివితే మీకే అర్థం అవుతుంది చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని. పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతడు అన్ని విద్యలలో ఆరి తేరిన వాడు,సర్వ ఙ్ఞానం కలిగినవాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చొని శిష్యులకు వేదాలు నేర్పుతుండగా ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది అద...

భృగు మహర్షి బ్రహ్మజ్ఞానం పొందిన కథ – ఆనందమే బ్రహ్మం

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. అదేంటంటే, ఆధ్యాత్మిక సాధనలో చేసే ఏ ప్రయత్నమూ ఎప్పటికీ వృథా కాదు. మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ విధంగా ప్రయత్నిస్తారు. కొందరికి సత్యాన్ని గ్రహించడానికి ఎక్కువ సమయం పడుతుంది, మరికొందరు త్వరగా తెలుసుకుంటారు. ఇది వారి శ్రద్ధ, పట్టుదల, సాధనపై ఆధారపడి ఉంటుంది. అందుకే గీతలో "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అని చెప్పబడింది. సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నవాడు తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటాడని గీత బోధిస్తుంది. అలాంటి సత్యాన్వేషణలో భాగంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహర్షే భృగు మహర్షి.   భృగు మహర్షి బ్రహ్మదేవుని మానస పుత్రుడు. ఒకరోజు ఆయన తన తండ్రిని అడిగాడు: "దేవుడు ఎవరు? ఆయనను ఎలా తెలుసుకోవాలి?" అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: "తపస్సు ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. బ్రహ్మం మాటలకు అందదు, మనసుకు పూర్తిగా అర్థం కాదు. అనుభవం ద్వారానే దానిని తెలుసుకోవాలి." తండ్రి మాటలలోని లోతైన అర్థాన్ని గ్రహించిన భృగు మహర్షి అరణ్యానికి వెళ్లి కఠోర తపస్సు ప్రారంభించాడు. దీర్ఘకాల ధ్యానం, ...

💙 Happy Father's Day💙

అందరికీ Happy Father's Day — తండ్రులందరికీ, అలాగే త్వరలో తండ్రులు కాబోయే వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర ఎంతో గొప్పది. చిన్నప్పుడు నాన్న దగ్గరకు వెళ్లాలంటే కూడా భయపడేదాన్ని. కానీ కాలం మారే కొద్దీ నాన్న కూడా ఒక మంచి స్నేహితుడిలా మారిపోయాడు. మనతో ఉన్నప్పుడు వారి విలువ పూర్తిగా అర్థం కాదు. కానీ వారిని కోల్పోయిన తర్వాతే వారి ప్రేమ, త్యాగం, ఆప్యాయత ఎంత గొప్పవో తెలుస్తుంది తండ్రి ప్రేమ – ఒక చిన్న కథ అనగనగా ఒక ఊరిలో సాంబశివరావు, పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ప్రసాద్ అనే ఒకే ఒక్క కుమారుడు. ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో ప్రేమగా పెంచారు. అతన్ని ఉన్నత విద్యావంతుడిని చేయాలని అహర్నిశలు కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితంగా ప్రసాద్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఉపాధ్యాయుల సూచనతో అతన్ని పట్టణానికి తీసుకెళ్లి చదివించారు. తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేస్తూ కష్టాలు పడినా, కొడుకు భవిష్యత్తు కోసం ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. కాలం గడిచింది. ప్రసాద్ చదువు పూర్తి చేసి ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడే ఉమ అనే అమ్మాయిని ప్రేమించి, తల్లిదం...

శిఖండి కథ

ఆడవారు ఎంత ప్రేమగా అమ్మలా ఉంటారో అదేవిధంగా తనకు అన్యాయం జరిగితే అదే అమ్మ కాళికా మాత అవతారంతో తన ప్రతీకారం తీర్చుకుంటారు.అలాంటి ఒక ప్రేమ ,ఆప్యాయత,ప్రతీకారం కి సంబంధించిన కథ మన మహాభారతంలోని శిఖండిని కథ. అనగనగా కాశీ దేశానికి ఒక రాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు అందమైన కుమార్తెలు  అంబ, అంబిక, అంబాలికలు ఉండేవారు.వారిని రాజు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కొంతకాలం తర్వాత వారికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి అన్ని దిక్కుల నుండి రాజులు వచ్చారు. విషయం తెలుసుకున్న భీష్ముడు తన సోదరుడు విచిత్రవీర్యుడి వివాహం జరిపించాలని ఆ స్వయంవరానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన వారందరిలో ఎవరు బలవంతులైతే వారికి నా కూతుర్లును ఇచ్చి వివాహం చేస్తాను అని కాశి రాజు ప్రకటించాడు.అక్కడికి వచ్చిన వారందరిని ఒంటిచేత్తో భీష్ముడు ఓడించాడు అందులో సాళ్వుడు అనే యువరాజు కూడా ఉన్నాడు. భీష్ముడు అంబ,అంబికా,అంబాలికలను తీసుకొని వాయువేగంతో హస్తినాపురానికి చేరాడు.వెళ్ళే మార్గంలో అంబ తను సాల్వుడినీ ప్రేమిస్తున్న విషయం చెప్పింది ,  భీష్ముడు అంబను గౌరవంగా  పంపించాడు. అంబ శాల్వుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చ...

Mahabharatham లో ekalavya katha (ekalavya story)

  మీకు ఎప్పుడూ చెప్పినా మహాభారతం లోని కథలే చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మహాభారతంలో లేనిది లోకంలో లేదు లోకంలో లేనిది ఏది మహాభారతంలో ఉండదు అని ఒక సామెత. ఒకప్పుడు హస్తినాపురానికి దగ్గరలో ఉన్న అడవిలో హిరణ్యధనుస్సు అనే గిరిజన రాజు నివసించేవాడు. అతనికి ఏకలవ్యుడు అనే కుమారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఏకలవ్యుడికి విలువిద్య అంటే ఎంతో ఇష్టం. అతను ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి కావాలని కలలు కనేవాడు. ఆ కాలంలో విలువిద్యలో అత్యంత ప్రఖ్యాత గురువు ద్రోణాచార్యుడు. ఆయన వద్దే కౌరవులు, పాండవులు విద్యలు నేర్చుకుంటుండేవారు. ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి నమస్కరించి, “గురువర్యా! నాకు కూడా విలువిద్య నేర్పించండి” అని వినయంగా అడిగాడు. ద్రోణాచార్యుడు అతని వేషధారణ చూసి, “నేను రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పుతాను” అని చెప్పి తిరస్కరించాడు. ఆ మాటలు విన్న ఏకలవ్యుడు చాలా బాధపడ్డాడు. కానీ తన కలను వదలలేదు. అడవికి తిరిగి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని గురువుగా భావించి ప్రతిరోజూ  వారికి నేర్పించేటపుడు చూసి సాధన  చేయసాగాడు. అతను ఉదయం నుంచి స...

ఉడిపి మహారాజు కథ.

అనగనగా చాలా కాలం క్రితం దక్షిణ భారతదేశంలో ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు ఉడిపి . ఉడిపి మహారాజు పేరు నరేషుడు . ఆయన ఎంతో ధర్మపరుడు, ప్రజల పట్ల ప్రేమ కలిగినవాడు. రాజ్యంలో ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేసేవాడు. అందుకే ప్రజలు ఆయనను ఎంతో గౌరవించేవారు. కానీ ఒక సమస్య మాత్రం మహారాజును ఎప్పుడూ ఆలోచనలో పడేసేది. అది ఏమిటంటే — “నా ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా? లేక నా ముందు మాత్రమే సంతోషంగా నటిస్తున్నారా?” అనే సందేహం. ఒకరోజు ఆయన తన మంత్రి అయిన సోమదేవుడిని పిలిచాడు. “మంత్రి గారూ, మన రాజ్యంలో ప్రజలు నిజంగా మంచివాళ్లా? లేక భయంతో మంచిగా ఉంటున్నారా?” అని అడిగాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించి, “మహారాజా! ఇది తెలుసుకోవాలంటే ఒక పరీక్ష పెట్టాలి” అన్నాడు. రాజు వెంటనే అంగీకరించాడు. పాల కుండ పరీక్ష రాజు రాజ్యం అంతటా ఒక ప్రకటన చేయించాడు. “రేపు ఉదయం రాజభవనం ముందు ఒక పెద్ద కుండ ఉంచబడుతుంది. ప్రతి ఇంటి వారు ఒక గ్లాసు పాలు ఆ కుండలో పోయాలి. అది దేవాలయ సేవకు ఉపయోగపడుతుంది” అని ప్రకటించారు. ప్రజలందరూ “సరే మహారాజా” అని ఒప్పుకున్నారు. ఆ రాత్రి చాలా మంది ఇలా ఆలోచించారు: “అందరూ పాలు పోస్తారు ...

వాతాపి జీర్ణం కథ..

 చిన్న పిల్లలకు అన్నం తినిపించిన వెంటనే జీర్ణం జీర్ణం  వాతాపి జీర్ణం అని ఎందుకు అంటారో తెలుసా? అయితే ఈ కథ చదవండి. వాతాపి జీర్ణం కథ పురాణాలలో ప్రసిద్ధమైన ఒక ఆసక్తికరమైన కథ. ఒకప్పుడు వాతాపి, ఇల్వల అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు.  వీరు బలవంతులు మరియు మాయలమారులు  .  వారు తమ తెలివితేటలను మంచికి కాకుండా దుర్మార్గానికి ఉపయోగించేవారు.ఋషులను మోసం చేసి చంపడం తమ అలవాటుగా చేసుకున్నారు. ఇల్వల బ్రాహ్మణ వేషం వేసుకొని  అతిధి సత్కారం పేరుతో అడవులలో తిరిగే ఋషులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడు. వాతాపి అనే తన తమ్ముడిని మాయశక్తితో మేకగా మార్చి, ఆ మేకను వండి అతిథులకు భోజనంగా పెట్టేవాడు. అది మామూలు ఆహారం అని భావించి వారు భోజనం చేసేవారు. ఋషులు ఆ మాంసం తిన్న తర్వాత, ఇల్వల “వాతాపి! బయటకు రా!” అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి మళ్లీ తన అసలు రూపంలోకి వచ్చి, ఋషుల పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అనేకమంది ఋషులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారు ఋషులను తినేవారు. ఈ విషయం ఆనోటా ఈ నోటా అగస్త్యుడికి తెలిసింది. సరే ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. అసలే సమ...

తండ్రి కొడుకు గాడిద కథ(telugu moral story)

అనగనగా ఒక ఊరిలో  చంద్రయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు .అతనికి రుద్ర అనే కొడుకు ఉండేవాడు  . వాళ్ళు  ఒకరోజు బజారుకు వెళ్ళి ఒక గాడిదను కొన్నారు దానిని తీసుకొని నడుచుకుంటూ వెళుతున్నారు . అలా వెళ్తుండగా అతనికి తెలిసినవాళ్ళు వచ్చి చిన్న పిల్లాడిని ఎందుకు  నడిపిస్తున్నావు , గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళవచ్చు కదా ! అని అన్నారు . ఆ మాటలు విన్న చంద్రయ్య రుద్రను ఎక్కించి నడుచుకుంటూ వెళుతున్నారు. అలా కొంత సేపటికి మరల ఒక వ్యక్తి కనిపించి అరేయ్ రుద్రా నువ్వు దిగు  మీ నాన్నకు కాళ్ళు నొప్పులు వస్తాయి , నువ్వు చిన్న పిల్లాడివి  నీకు ఏం కాదు అన్నాడు. అప్పుడు రుద్ర దిగి తండ్రి చంద్రయ్య ను ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళాక   రమణయ్య అనే పాత స్నేహితుడు కలిసి పిల్లాడిని నడిపించి నువ్వు హాయిగా కూర్చున్నావు అని అన్నాడు  చంద్రయ్య ఆలోచించి రుద్రను కూడా పైకి ఎక్కించాడు . కొద్దిసేపటికి బ్రాహ్మణుల గుంపు ఎదురయింది వారు ,గాడిదపైన ఇద్దరు కూర్చున్నారు ఎలా వెళ్తదీ అది  మీరు జీవహింస చేస్తున్నారు అని అన్నారు.అప్పుడు బ్రాహ్మణుల మాటలు విన్న చంద్రయ్య,...

nala damayanthi story in telugu(Mahabharatham stories)

మీకు ముందే చెప్పాను కదా , మహాభారతంలో కథలు చాలా బాగుంటాయి అవి మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి .ఇది ఒక  అందమైన ప్రేమకథ .చాలా ప్రేమకథలు తెలుసు కానీ ఎన్నో ట్విస్టులు వున్న కథ ఇది. అయిపోయింది అనుకున్నప్పుడే మళ్ళీ మలుపు వుంటుంది అందుకే ఈ కథ ప్రేక్షకులు చదువుతున్నంత సేపు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి  కలుగుతుంది.జీవితంలో ఎన్నో కష్టాలను ఓర్చుకొని  ప్రేమను గెలిపించుకున్న  నల దమయంతుల ప్రేమకథ. అనగనగా నిషధ దేశాన్ని వీరసేనుడు   అనే రాజు   పాలిస్తుండేవాడు అతనికి నలుడు  , పుష్కరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నలుడు  ధర్మపరుడు , సత్యవంతుడు, ప్రజలకు ఎంతో ఇష్టమైనవాడు .  తండ్రి  వీరసేనుడుకు కూడా నలుడు అంటే ఇష్టం వల్ల అతన్ని రాజుగా ప్రకటించాడు నలుడు రాజు అవ్వడం పుష్కరుడికి ఇష్టం లేదు. ఇదిలా ఉండగా విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు,అతనికి ధమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు దముడు ,ధమనుడు,దంతుడు అనే కుమారులు కలిగారు.    దమయంతి అపూర్వ సౌందర్యం, వినయం కలిగినది . ఈ విషయం నలుడు  ...

హోలీ ఎందుకు జరుపుకుంటారు? - రంగుల పండుగ ప్రాముఖ్యత

హోళీ పండుగ శుభాకాంక్షలు మై డియర్ బ్లాగు రీడర్స్ .  భారతదేశంలో జరిగే ప్రతి పండగకు ఒక ప్రాధాన్యత ఉంటుంది .హోళీ రంగుల పండగ చిన్న పెద్ద తేడా  లేకుండా  అందరు ఈ పండగను రంగులు చల్లుకుంటూ , మిఠాయిలు తినిపించుకుంటూ చాలా సంబరాలు చేసుకుంటారు.  హోళీ పండగ జరుపుకోవడానికి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి పండగలో అంతరార్థం చెడుపై మంచి సాధించిన విజయం లేక ఆధ్యాత్మికత ఇమిడి ఉంటాయి. విష్ణుపురాణం ప్రకారం హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక వరం పొందాడు.అతను ఎలాగైనా చావకుండా ఉండాలని దేవతలతో గానీ,రాక్షసులతో గాని,అస్త్రము,శస్త్రము లతో గానీ ,పగలు కానీ , రాత్రి కానీ, నేలమీద కానీ ఆకాశం మీద కానీ ,ఇంటిలోపల ,బయట కానీ జంతువులతో కానీ ,మనుషులతో కానీ ఇలా ఎవరి వల్ల చావులేకుండా వరాన్ని పొందాడు.ఈ వర గర్వంతో హిరణ్యకశిపుడు లోకాలను బాధపెట్ట సాగాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ బాలుడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు.అతను గురుకులంలో చదువుకుంటున్నప్పుడు విష్ణువు మీద భక్తి కలిగింది శ్రీ మహావిష్ణువు లీలలు తెలుసుకున్న ప్రహ్లాదుడు విష్ణువు తప్ప ఎవరు గొప్ప కాదు అని అంటుండేవ...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

శని - శివ - హనుమంతుడు కథ

ఒకరోజు పరమశివుడికి ఉదయాన్నే ఒక కల వచ్చింది. ఆ కలలో శని భగవానుడు నేను నిన్ను ముప్ప తిప్పలు పెడతా   ఈ  రోజు సాయంత్రం వరకు కనీసం 4 నుండి 5 గంటలు అని చెప్పాడు . శని భగవానుడు ఎంతటి వారినైనా ముప్ప తిప్పలు పెడతారు అని తెలిసిన మహా శివుడు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు . ఆ రోజు తొందరగా స్నానం చేసి కూర్చొని ఆలోచించసాగాడు ఎలాగైనా శని నుండి  తప్పించుకోవాలి అని , సమయం గడుస్తుంది . వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది , శివుడు పార్వతిని వాళ్ళ బంధువుల ఇంటికి , పిల్లలను స్నేహితులతో ఆడుకోవడానికి పంపించి వేశాడు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అతను కూడా అలా కూర్చోకుండా ఒక గుంత తీసి దానిలో కూర్చుని మూత పెట్టుకున్నాడు.ఆ గుంతలో మొత్తం తడిగా ఉండి  ఒకటే వాసన  అయినా కూడా  ఆ గుంతలోనే సాయంత్రం వరకు కూర్చున్నాడు . సాయంత్రం 6 దాటింది అని నిర్ధారించుకున్న తర్వాత బయటికి  వచ్చాడు .బయటకు వచ్చి హమ్మయ్య శనికి నేను దొరకలేదు అతడు నన్ను పట్టుకోలేదు అని తనకు తానే గర్వంగా కూర్చున్నాడు.అతనికి ఎదురుగా శని దేవుడు కూర్చొని ఉండడం చూసి , మహాశివుడు గట్టిగా నవ్వాడు ఏమయ్యా  శని నన్ను పట...

శ్రవణకుమారుడి కథ..

 ఈ కథ అందరికీ తెలుసు కానీ  ఇంకా తెలియని వాళ్ళ కోసం మాత్రమే. గాంధీజీ తన ఆశ్రమంలో జనులందరితో ముచ్చటిస్తూ వున్నారు.అక్కడ ఉన్నవారు తల్లిదండ్రుల సేవ ఎలా చేయాలి అని అడిగారు దానికి గాంధీజీ ఒక కథ చెప్తాను అన్నాడు ఎందుకంటే ఆ కథ అంటే గాంధీజీకి చాలా ఇష్టం.అది తల్లిదండ్రులను గౌరవించే శ్రవణకుమారుడి కథ.శ్రవనకుమారుడి తల్లిదండ్రులకు కళ్ళు లేవు ఐతే వారి బాగోగులు మొత్తం ఆయనే చూస్తూ ఉండేవాడు .వారు వయసు మీరడంతో మాకు తీర్థయాత్రలు చేయలని ఉంది అని అన్నారు దానికి శ్రవనకుమారుడు సరే అన్నాడు.వారిద్దరిని ఒక కావడి తయారు చేసి దానిలో కూర్చో బెట్టాడు.వారిని అలా తీసుకొని వెళుతుండగా దారిలో వారికి దాహం వేసింది ,నీళ్ల కోసం వారిని అక్కడే ఉంచి వెళ్ళాడు.ఇంతలో వేటకు వచ్చిన దశరథ మహారాజు జింక అనుకోని బాణం వేసాడు అది శ్రవనకుమారుడికి గుచ్చుకుంది .దశరథుడు వచ్చి చూసి అయ్యె?నేను ఎంత పాపం చేసాను అని బాణం తీయడానికి ప్రయత్నించాడు,శ్రవనకుమారుడు వద్దు మహారాజ న తల్లిదండ్రులకు దాహం తీర్చి ఈ విషయాన్ని చెప్పండి అని కన్ను ముసాడు.దశరథుడు తీవ్రమైన దుఃఖంతో వచ్చి వారి దాహం తీర్చి నా  వల్ల మీ కుమారుడు మరణించాడు అని చెప్...

శ్రీనివాస కళ్యాణం

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర  స్వామిని దర్శించడానికి భక్తులు దూర ప్రాంతాలనుండి ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకొని వస్తారు. ఆనందనిలయంలో ఉన్న ఆ శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినంతనే ఎంతో ఆనందం కలుగుతుందని  అంటారు.ఇది నిజంగా  అనుభూతి చెందిన వారికే అనిపిస్తుంది. ఈ రోజు మన కథ శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ,ఎన్నో కథలు గాథలు ఉన్నాయి కానీ అందులో ఒకటి మీకోసం . ఒకనాడు మహర్షులు అందరూ కలసి లోకకళ్యాణం కొరకు యజ్ఞం చేయాలని భావించారు ఆ యజ్ఞానికి ముఖ్య అతిథిగా త్రిమూర్తులలో ఒకరిని పిలవాలని అనుకున్నారు . ఎవరు గొప్ప అయితే వారిని పిలవాలని అనుకున్నారు.ఈ ఎవరు గొప్ప అని నిర్ణయం చేయవలసిందిగా బృగు మహర్షిని పంపారు.మొదట బృగు మహర్షి సత్య లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతి మాత వీణ వాయిస్తుండగా అతను లీనమై పోయాడు. ఆశ్చర్యం అసలు బ్రహ్మ బృగు మహర్షి రాకను గమనించలేదు దానికి ఆ మహర్షి కోపంతో నీకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించాడు. బ్రహ్మ దేవుడు బాధ పడ్డాడు అందుకే బ్రహ్మ దేవుడికి గుడులు చాలా తక్కువ ఉంటాయి.   కైలాసానికి బయలుదేరాడు ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం .కైలాసంలో శివపార్వతులు ఇద్దరూ నాట...

బహుమతి - శిక్ష

తెలుగు కథలలో ముఖ్యంగా తెనాలి రామ కథలు చాలా ప్రత్యేకం.కొన్ని హాస్యాస్పదం మరికొన్ని తెలివి తేటలకు సంబంధించినవి ఉంటాయి.ఇది కూడా అలాంటిదే. రామకృష్ణుడి స్నేహితుడు ఒకరోజు సభా మందిరాన్ని చూడాలని అనుకున్నాడు అయితే అతడు రేపు రా అని చెప్పాడు . స్నేహితుడు తెల్లారక సభ సమయానికి వచ్చాడు ద్వార పాలకులు అడ్డగించారు లోపలికి వెళ్లనివ్వలేదు.అతను రామలింగని స్నేహితుడిని అని చెప్పినా వినలేదు.మరుసటి రోజు ఆ స్నేహితుడు రామలింగడి ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. సరే ఈ విషయాన్నీ నేను కనిపెడత్తా అని  రామలింగడు మరునాడు సభకు మారువేషంలో వెళ్ళాడు.లోపలికి వెళ్లబోతుంటే ద్వారపాలకులు అడ్డుకున్నారు  , అయితే రామలింగడు తనను తాను ఒక కళాకారుడిగా పరిచయం చేసుకున్నాడు.భటులు ఒకవేళ నీ కళ నచ్చితే రాజుగారు నీకు బహుమతి ఇస్తారు మాకు ఏం లాభం అన్నారు .సరే నాకు ఇచ్చిన బహుమతిలో సగం ఇస్తాను అని అన్నాడు రామలింగడు.ఇలా కొంచెం లోపలికి వెళ్లగానే మళ్లీ ద్వారపాలకులు అడ్డగించారు అలా మొత్తం సభలోకి వెళ్ళడానికి చాలా మంది అడ్డగించారు . రాజు దగ్గరికి వెళ్ళి తన కవిత్వం చెప్పాడు ఆ కవిత్వానికి మెచ్చి  కృష్ణదేవరాయలు ఏమి బహుమతి క...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా  మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంటా బయటా  అలుపని రవ్వంత  అని అనవంట వెలుగులు పూస్తవు వెళ్ళే దారంతా. ఈ పాట వింటే ప్రతి ఒక్కరి కంట్లో చిన్న కన్నీటి చెమ్మ  వస్తుంది ,  ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీ పాత్ర అలాంటిది. ముఖ్యంగా తెలుగు ఇళ్లలో ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గు వేస్తే ఆ ఇంటి కల వేరుగా ఉంటుంది నా చిన్నప్పటి నుండి అది ఒక ఎమోషన్.  స్త్రీలు  బాల్యం నుండి అల్లారు ముద్దుగా పెరిగి వివాహం అయిన తర్వాత వేరే ఇంటికి వెళతారు. అక్కడ  వాళ్ళను కూడా సొంత ఇంటి వారిగానే భావించి కలిసి పోతారు. వాళ్ళు కొన్నిసార్లు ఇష్టాలను చంపుకొని,బాధను దిగమింగి తల్లితండ్రులకు మంచి పేరు తేవడానికి ప్రయత్నిస్తారు.ఆమె లేని ఇల్లు ఒక నరకం అని చాలా మంది అభిప్రాయం.భర్తకు భార్యగా సేవలు చేస్తుంది అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి అన్ని పనులు చేస్తుంది   వాళ్ళ వంశం అభివృద్ధి కోసం తన   ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంకొక ప్రాణానికి ఊపిరి   పోస...

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

  ఫిబ్రవరి  21 రోజు  అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం  అని  ఎంతమందికి తెలుసు .  మాతృభాష అంటే మనము  మాట్లాడే భాష కానీ మనం ఎంతవరకు ఆ తల్లి భాషకు దగ్గరగా ఉన్నాము ఎవరికి తెలియదు, తెలిసినా కూడా దానిని పట్టించుకోరు.   భాష అనేది భావ వ్యక్తీకరణ ప్రక్రియ , మనము మన మనసులో వున్న భావాలను ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెప్పడం . ప్రపంచవ్యాప్తంగా రకరకాల భాషలు అందుబాటులో ఉన్నాయి ఓ ఇంగ్లీష్ అనే భాష ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందింది ఇంగ్లీష్ , హిందీ , తర్వాత అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాష తెలుగు . మాతృభాషలో మాట్లాడితే వచ్చే ఆనందం గురించి ఒక చిన్న ఉదాహరణ. మా అమ్మమ్మ తాత వాళ్ళు మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగం చేసేవాళ్ళు  ప్రతి సంవత్సరం సెలవులకు నేను అక్కడికి వెళ్లేదాన్ని .అక్కడ మార్కెట్ కి గాని, గుడికి గానీ వెళ్ళినప్పుడు అక్కడ మన భాష మాట్లాడే వాళ్ళు ఒక్కరు కనిపించినా మనకు చాలా సంతోషంగా దగ్గరకు వెళ్ళి కొద్ది సేపు మాట్లాడి వచ్చేది.నిజంగా వేరే ప్రాంతానికి వెళ్లినపుడు మన బాషలో మాట్లాడితే ఆ ఆనందమే వేరు. మాతృభాష ప్రతి చిన్న భావాన్ని చాలా స్పష్టంగా వ్యక్తపరచగలిగే సాధనం. ప...

valentine's day❤️❤️❤️

Valentine's day అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చే విషయం ఏంటి. ?   అదే ఏంటి అని ఆలోచిస్తున్నారా! చెప్తా ఉండండి అసలు విషయం భజరంగ్ దళ వాళ్ళు . అవును కొన్ని రోజుల క్రితం వరకు వాళ్ళు వాలెంటైన్ డే రోజు రోడ్డు మీద ఎవరైనా ప్రేమికులు లేదా జంటగా కనబడినా కూడా వాళ్ళ చేతికి బలవంతంగా తాళి ఇచ్చి కట్టమనేవారు .అందులో కొందరు ఇష్టం ఉండి ,ఇష్టం లేక ,కొందరైతే స్నేహితులుగా ఉండేవాళ్ళు కూడా ఉండేది .కానీ ఇప్పుడు పరిస్థితి మారింది లెండి.ఇది మాకు ఎందుకు అనుకోకండి రీడర్స్  valentine's day special blog.   Valentine's day ఎలా మొదలైంది అంటే , మూడవ శతాబ్దంలో  రోమ్ ను పరిపాలిస్తున్న చక్రవర్తి క్లాడియాస్ 2 తన నగరంలో ప్రేమ వివాహాలను నిషేధించాడు ,పెద్దల మాట వినకుండా చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల వారు జీవితంలో నష్ట పోతారు అని భావించి అతను అలా చేశాడు.కానీ తాడిని తన్నేవాడు ఒకడైతే  వాడి   తల తన్నేవాడు ఇంకొకడు వుంటారు అని అంటారు కదా! అలా ఈయన నిషేధిస్తే మనం ఎందుకు పాటించాలి అనుకున్న సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి అదే ప్రేమ వివాహాలకు మద్దతు తెలిపాడు .అతన్ని  చక్రవర్తి ఎన్నో సార్ల...

ఆహార సూత్రాలు.

తాతయ్య ఒక కథ చెప్పావా ? అని అడిగింది చిట్టి. రోజూ కథ ఎందుకు చెప్పాలి, ఈ రోజు నీకు ఒక మంచి విషయం చెప్తాను చిట్టీ అని చెప్పాడు.సరే తాతయ్య ఏదో ఒకటి చెప్పు నేర్చుకుంట అన్నది. అవును ఏ మంచి విషయం చెప్తావు తాత అన్నది . అదే తినడం గురించి, అంటే తాతయ్య?మనం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం అన్న విషయం.సరే తాత ఇదేదో విచిత్రంగా ఉంది రోజు తినే అన్నం తినడానికి కూడా పద్ధతులు ఉన్నాయా? . హితంగా తినాలి,మితంగా తినాలి,ఋతు అనుగుణంగా తినాలి అంటారు  పెద్దలు.ఏం తినాలో,ఎంత తినాలో,ఎప్పుడూ తినాలో చూసుకొని తినాలి.ఆహారం ఎలా తినాలో తెలిస్తే ఆరోగ్యంగా మారుతుంది అమృతంగా బతికిస్తుంది.  వైశ్వనర విద్యగా పిలిచే ఈ విధానాన్ని  మన పూర్వీకులు ఓ యజ్ఞంలాగ ఆచరించారు.ఇప్పుడు మాత్రం నూటికి 90 మంది ఆహార సూత్రాల విషయంలో అలసత్వం వహిస్తున్నారు.       అవునా తాతా భోజనం చేయడం ఓ యజ్ఞమా ? అవును చిట్టి భోజనం చేయడం ఒక యజ్ఞం. మన ఋషులు మోక్ష సాధన గురించే కాక ఇహ లోకంలో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు.మనం తినే ఆహారం త్రాగే నీరు స్వచ్చంగా ఉండాలి.మనకు వచ్చే ఎక్కువ రోగాలలో అత్యధిక శాతం జీర్ణ వ్యవస్థకు చ...