Posts

Showing posts with the label short moral story

సమయస్ఫూర్తి

Image
అనగనగా ఒక ఊరిలో సాంబయ్య అనే వ్యాపారి ఉండేవాడు.అతను వ్యాపారరీత్యా ఒక ఉరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తూ ఉండేవాడు.ఒక పని మీద తన ప్రాణస్నేహితుడిని కలవడానికి దొంగలపురం అనే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో దొంగతనాలు ఎక్కువగా జరగడం వల్ల ఆ ఊరికి దొంగలపురం అనే పేరు వచ్చింది.తన స్నేహితుడిని కలిసి మాట్లాడేసరికి చాలా సమయం అయింది సాయంకాలం ఆ ఉరి నుండి బయలుదేరాడు ,తన స్నేహితుడు ఈ ఊర్లో దొంగలు ఎక్కువగా ఉంటారు నువ్వు నీ సొమ్ము జాగ్రత్తగా తీసుకెళ్లు అన్నాడు.చీకటి మరియు అడవిగుండా ప్రయాణం అవడం చేత సాంబయ్య మెల్లిగా నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఎవరో తనను వెంబడిస్తున్నారు అని చూసాడు .ఒక వ్యక్తి తనను దూరం నుంచి ఫాలో అవుతున్నాడు అతనికి భయం వేసింది.అలా నడుస్తూ ఉన్నాడు, కొంతసేపటికి ఒక చెరువు కనిపించింది అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది.చెరువు దగ్గరకు వెళ్లి అయ్యయ్యో నా పెట్టె చెరువులో పడిపోయింది అని లబోదిబోమన్నాడు.అతనిని వెంబడిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమైంది ?అంటాడు నా పెట్టె పడిపోయింది అన్నాడు సాంబయ్య .దొంగ వెంటనే నేను తీసి ఇస్తా అని చెరువులోకి దూకాడు ,సాంబయ్య వెంటనే పొదల్లో ఉన్న పెట్టె తీ...

నిబద్ధత

Image
అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు రమణ, వామన వుండేవారు.రమణ ఎప్పుడు ఎదో ఒక పని చేసుకుంటూఉండేవాడు వామన మాత్రం ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. వారిద్దరూ ప్రాణ స్నేహితులు అవడంతో రమణ,వామనను వెనకేసుకొని వచ్చేవాడు తర్వాత మందలించేవాడు. ఆ ఊరులో పనులు దొరకక పోవడంతో వేరే ప్రాంతానికి వలస వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక తోటలో పనికి కుదిరారు ఇద్దరు.తోట యజమాని ఇద్దర్నీ పిలిచి ఒకరు కాపలా పని ,ఇంకొకరు కాయలు తెంపడం చేయండి అని చెప్పాడు. బద్ధకస్తుడు అయిన వామన నేను కాపలా ఉంటాను నువ్వు కాయలు తెంపు అన్నాడు,సరే అన్నాడు రమణ .ప్రతిరోజూ వారి వారి పనులు చేస్తూ జీవించ సాగారు.ఒకరోజు తోట యజమాని పని మీద బయటకు వెళ్ళాడు, రమణ కాయలు తెంపి యింటికి వెళ్ళాడు.వామన తోటలో ఎవరు లేరు అని హాయిగా నిద్రపోయాడు ,తోటలో దొంగలు పడి కాయలు ఎత్తుకెళ్లారు.యజమాని వచ్చేసరికి వామన నిద్రపోతుండడం దొంగలు పడడం చూసి అతనిని నిద్ర లేపి తిట్టి పంపించాడు.ఇప్పటిదాకా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వలేదు . అందుకే ఎవరైనా ఏదైనా పని చెప్తే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దానిని నిబద్ధతతో చేయాలి......

ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు...

సెప్టెంబర్ 5 న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు ,ఏ రోజు ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కనుక. గురువు అంటే అజ్ఞానం తొలగించి జ్ఞానం అనే వెలుగులోకి నడిపే మార్గాన్ని చూపే వ్యక్తి. అది ఎవరైనా కావచ్చు మనను మంచి వైపు నడిపించేవాడు ఎల్లప్పుడూ గురువే అయి ఉంటాడు. సూర్యుడు లేకుండా వెలుగు లేదు, ఔషదం సేవించకుండా రోగం నశించదు అలాగే గురువు లేకుండా  జ్ఞానం లభించదు అని పెద్దల మాట. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు కు అత్యంత విలువైన ప్రాముఖ్యత వుంటుది.మన తల్లిదండ్రులు మనకు జన్మ ఇస్తే గురువు పునర్జన్మ ఇస్తాడు. ఈ సందర్భంగా ఒకచిన్న కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో స్వేచ్ఛ అని ఒక అల్లరి పిల్ల ఉండేది తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు అవడం వల్ల అల్లారు ముద్దుగా పెంచారు .ఆమెను పాఠశాలలో చేరిస్తే అల్లరి తగ్గుతుంది అని భావించి తల్లిదండ్రులు పాఠశాలకు పంపించారు, కానీ తీరు మారలేదు,ఆమె ఒకరోజు అటుగా వెళుతున్న గురువు పంచె ను లాగింది దాని వల్ల అతడు కింద పడిపోయారు  తలకు గాయం అయింది అది చూసి పరుగెత్తింది స్వేచ్ఛ, భయంతో వణికిపోతోంది ఆమెను చూసి గురువు చూసావా నువు చేసిన అల్లరి పని వల్ల నాకు రక్తం వస్తుంది ...