అప్పయ్య ,కొండయ్య, కొరడా దెబ్బలు
రంగాపురంలో అప్పయ్య,కొండయ్య అనే ఇద్దరు స్నేహితులు వుండేవారు.వారు దేశ సంచారం చేసేవారు రాజ్యంలోని పరిస్థితులను రాజుకు వివరించేవారు.అలా తిరుగుతూ తిరుగుతూ వుండేవారు. కోటిలింగాల రాజ్యంలో రాజు మా రాజ్యంలో ప్రజలు అంతా చాలా మంచివారు స్వార్థం లేని వారు అధికారులు లంచం తీసుకోరు అని బాగా గొప్పలు చెప్పుకునేవారు.
కోటిలింగాల ప్రజల గురుంచి,అధికారుల గురించి తెలుసుకోవడానికి అప్పయ్య, కొండయ్య బయలుదేరారు.గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఇద్దరు ఆట పాటలతో అందరిని ఆకట్టుకొని డబ్బులు పొగుచేస్తున్నారు.వాళ్ళు దారిలో వెళుతుంటే ఆగంతకులు వచ్చి వాళ్ళ సంచిని ఎత్తుకొని వెళ్లారు వీరు వాళ్ళను వెంబడించి దొంగలను పట్టుకున్నారు ఎందుకు ఇలా చేసారు అని అడగగా మాకు పని దొరకక ఆకలికి దొంగతనం చేసాము ఈ రాజ్యంలో ఏదయినా లోటు ఉంది అని చెప్తే మంత్రి వర్గం అంత మమ్ములను బ్రతనివ్వరు అందుకే మేము సంతోషంగా ఉన్నట్లు రాజు గారిని నమ్మిస్తున్నాము అని అన్నారు.అలా అన్ని గ్రామాలు పూర్తి అయిన తర్వాత అనోటా ఈనోట అప్పయ్య ,కొండయ్యల ఆట పాటల వినోదాలు రాజు గారికి తెలిసింది .వారికి రాజభవనం నుండి ఆహ్వానం లభించింది. వారు వస్తుంటే ఇద్దరు కాపలాదారులు మిమ్మల్ని లోపలికి పంపాలంటే రాజు ఇచ్చిన బహుమతిలో సగం మాకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు.కోట ద్వారం దాటాక ఇద్దరు సేవకులు మిమ్ము రాజు దగ్గరికి పంపితే మాకు సగం ఇవ్వాలి అన్నారు.అలా రాజు గారి దగ్గరకి చేరే వరకు చాలా మంది అడ్డుకున్నారు ,చివరగా మంత్రిగారు కూడా మీకు ఇచ్చే బహుమతిలో సగం ఇవ్వాలని అడిగారు.ఎట్టకేలకు రాజు దగ్గరకు వెళ్లి తమ ఆట పాటలను ప్రదర్శించారు.రాజుకు చాలా సంతోషపడ్డాడు. మీకు ఏమి కావాలో కోరుకో ? అన్నాడు రాజు.మాకు ఒక వంద కొరడా దెబ్బలు కావాలి అన్నారు.రాజు ఆశ్చర్యం పొంది ఎందుకు అని అడిగాడు ,వారు జరిగింది అంతా రాజుకు వివరించారు రాజు జరిగింది తెలుసుకొని అందరిని శిక్షించాడు .అప్పయ్య,కొండయ్యకు బహుమతులు ఇచ్చాడు. రాజు ఎప్పుడైనా సొంతంగా పరిస్థితులు తెలుసుకోవాలి కానీ ఎవరి మీద ఆధారపడకూడదు.పై అధికారులు నుంచికింది స్థాయి వరకు అందరి మీద నిఘా ఉంచాలి గుడ్డిగా ఎవరిని నమ్మవద్దు.
Comments
Post a Comment