అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

  ఫిబ్రవరి  21 రోజు  అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం  అని  ఎంతమందికి తెలుసు .  మాతృభాష అంటే మనము  మాట్లాడే భాష కానీ మనం ఎంతవరకు ఆ తల్లి భాషకు దగ్గరగా ఉన్నాము ఎవరికి తెలియదు, తెలిసినా కూడా దానిని పట్టించుకోరు.
  భాష అనేది భావ వ్యక్తీకరణ ప్రక్రియ , మనము మన మనసులో వున్న భావాలను ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెప్పడం . ప్రపంచవ్యాప్తంగా రకరకాల భాషలు అందుబాటులో ఉన్నాయి ఓ ఇంగ్లీష్ అనే భాష ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందింది
ఇంగ్లీష్ , హిందీ , తర్వాత అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాష తెలుగు .
మాతృభాషలో మాట్లాడితే వచ్చే ఆనందం గురించి ఒక చిన్న ఉదాహరణ.
మా అమ్మమ్మ తాత వాళ్ళు మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగం చేసేవాళ్ళు  ప్రతి సంవత్సరం సెలవులకు నేను అక్కడికి వెళ్లేదాన్ని .అక్కడ మార్కెట్ కి గాని, గుడికి గానీ వెళ్ళినప్పుడు అక్కడ మన భాష మాట్లాడే వాళ్ళు ఒక్కరు కనిపించినా మనకు చాలా సంతోషంగా దగ్గరకు వెళ్ళి కొద్ది సేపు మాట్లాడి వచ్చేది.నిజంగా వేరే ప్రాంతానికి వెళ్లినపుడు మన బాషలో మాట్లాడితే ఆ ఆనందమే వేరు. మాతృభాష ప్రతి చిన్న భావాన్ని చాలా స్పష్టంగా వ్యక్తపరచగలిగే సాధనం.
ప్రతి ఒక్కరు తమ మాతృ భాష ఏమిటో తెలుసుకోవాలి,దానిలోనే మాట్లాడడానికి ప్రయత్నించాలి ,  ఇతరులను ప్రోత్సహించాలి.
ఉదాహరణకు ఇంగ్లీషు లాంటి భాషలు కేవలం అఫిషియల్ గా సంప్రదింపులు జరపడానికి మాత్రమే కానీ ఆ ధ్యాసలో మన మాతృభాషను మరవద్దు.
ప్రతి భాషకు ఒక ప్రత్యేకమైన లిపి , దానికి ఒక చరిత్ర ,పరిణామ క్రమం ఉంటాయి . ఏ భాషను చిన్న చూపు చూడొద్దు.కొందరైతే ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పవాళ్ళుగా భావింపబడతారు అని వాళ్ళ నిజమైన భాష పక్కన పెట్టీ మాట్లాడతారు.
ప్రపంచవ్యాప్తంగా మాతృభాష దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. భారతదేశం , పాకిస్థాన్ విభజన తర్వాత తూర్పు పాకిస్థాన్  , పశ్చిమ పాకిస్థాన్ గా పాకిస్థాన్ ఆవిర్భావం జరిగింది. పాకిస్థాన్ ఉర్దూను జాతీయ భాషగా ప్రకటించింది. తూర్పు పాకిస్థాన్ లో బెంగాలీలు ఎక్కువగా ఉన్నారు వారు  ఉర్దూతో పాటు  బెంగాలీని జాతీయ భాషగా చేయమని అన్నారు పాకిస్థాన్ వినలేదు అది మెల్లగా భాషా ఉద్యమంగా తయారు అయింది.  తూర్పు పాకిస్థాన్ కు చెందిన ధీరేంద్ర నాథ్ దత్త ఈ విషయాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు. ఫిబ్రవరి 21 న ఉద్యమంలో పాల్గొన్న వారిపై కాల్పులు జరిపారు.వందలాది మంది గాయపడ్డారు. తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి  బెంగాలీని జాతీయ భాషగా ప్రకటించింది.ఈ ఘటన భాష ప్రేమికులందరిని తీవ్రంగా కలచి వేసింది దానికోసం ఐక్యరాజ్య సమితిలో కూడా తీర్మానం ప్రవేశ పెట్టారు. యునెస్కో ఫిబ్రవరి 21 నీ అంతర్జాతీయ  మాతృబాషా దినోత్సవంగా ప్రకటించింది.దీని వల్ల చిన్న చిన్న భాషల అభివృద్ధికి మరియు నిర్లక్ష్యంకి గురి అవకుండా కాపాడుకోవచ్చు .
ప్రతి ఒక్కరు తమ మాతృభాషను నిర్లక్ష్యం చేయకుండా , దాని అభివృద్ధికి కృషి చేయాలి.
నా మాతృభాష తెలుగు నేను సాధ్యమైనంత వరకు తెలుగులోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను . మీరు కూడా మీ మాతృభాష ఏంటో తెలుసుకునీ మీరు మాట్లాడండి.






 


.


Comments

Post a Comment

Popular posts from this blog

రామచిలుక కథ

అంతా మన మంచికే...

ఐకమత్యమే మహాబలం.