హోళీ ఎందుకు జరుపుకుంటారు
హోళీ పండుగ శుభాకాంక్షలు మై డియర్ బ్లాగు రీడర్స్ .
భారతదేశంలో జరిగే ప్రతి పండగకు ఒక ప్రాధాన్యత ఉంటుంది .హోళీ రంగుల పండగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఈ పండగను రంగులు చల్లుకుంటూ , మిఠాయిలు తినిపించుకుంటూ చాలా సంబరాలు చేసుకుంటారు. హోళీ పండగ జరుపుకోవడానికి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి పండగలో అంతరార్థం చెడుపై మంచి సాధించిన విజయం లేక ఆధ్యాత్మికత ఇమిడి ఉంటాయి.
విష్ణుపురాణం ప్రకారం హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక వరం పొందాడు.అతను ఎలాగైనా చావకుండా ఉండాలని దేవతలతో గానీ,రాక్షసులతో గాని,అస్త్రము,శస్త్రము లతో గానీ ,పగలు కానీ , రాత్రి కానీ, నేలమీద కానీ ఆకాశం మీద కానీ ,ఇంటిలోపల ,బయట కానీ జంతువులతో కానీ ,మనుషులతో కానీ ఇలా ఎవరి వల్ల చావులేకుండా వరాన్ని పొందాడు.ఈ వర గర్వంతో హిరణ్యకశిపుడు లోకాలను బాధపెట్ట సాగాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ బాలుడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు.అతను గురుకులంలో చదువుకుంటున్నప్పుడు విష్ణువు మీద భక్తి కలిగింది శ్రీ మహావిష్ణువు లీలలు తెలుసుకున్న ప్రహ్లాదుడు విష్ణువు తప్ప ఎవరు గొప్ప కాదు అని అంటుండేవారు,కానీ హిరణ్యకశిపుడు తనే ఈ లోకంలో శక్తి వంతుడిని అని ఎవరు కీర్తించిన , పూజించినా కూడా నన్నే చేయాలి అని అనేవాడు. ప్రహ్లాదుడు మాట వినకపోయే సరికి అతడిని చాలా బాధలకు గురి చేసేవాడు.చివరకు ప్రహ్లాదుడిని చంపడానికి కూడా వెనకాడలేదు. హిరణ్యకశిపుడు ఈ విషయాన్ని తన సోదరి హోలికకు చెప్పాడు ఆమె తన వరం గురించి అన్నకు చెప్పింది .హోలికకు అగ్నిలో ఉన్నా కాలిపోదు, అందుకని ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకొని అగ్నికి ఆహుతి అవుతుంది.ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణు నామాలు పఠిస్తూఉన్నాడు ఆ దేవుడి కృప వలన అతను మంటలనుండి బయటపడ్డాడు,హోళికా అందులో పడి మరణించింది.మంచి ఎల్లప్పుడూ గెలుస్తుంది అని ఈ కథ వలన మనకు తెలుస్తుంది.ప్రతి సంవత్సరం హోళికనూ దహనం చేయడం ఆనవాయితీగా మారింది.ఆ తర్వాత అందరూ తలస్నానం చేసి రంగులు చల్లుకుంటూ హోళీ పండగ చేసుకుంటారు.
ఈ కథతో పాటు కొన్ని ప్రాంతాలలో హోలీని కాముని పున్నమి అని కూడా పిలుస్తారు.శివుడిని మన్మథుడు తన పుష్ప బాణాలను వేసి మోహితుడిని చేశాడు ఆ బాణాలకు శివుడికి పార్వతీ మీద మొహం కలిగింది కొద్దిసేపటికే తేరుకొని శివుడు తన మూడో కన్ను తెరిచాడు మన్మధుడిని కాల్చేశాడు.అతడు బూడిద అయ్యాడు.మనలో ఉన్న కామ ,క్రోధ ,లోభ ,మోహ మద మత్సర్యలను జయించగలిగిన నాడు మనం మానన్ని గెలిచినట్టు. కోపం రావాలి కానీ అది అతిగా వెళ్లొద్దు అతి సర్వత్ర వర్గ్యతే అన్నారు పెద్దలు.
హోళీ రంగులు చల్లుకోవడం అంటే వసంతం రావడానికి ఇది ఆరంభం శీతాకాలం ముగిసి వేసివి ఆరంభానికి సూచన. ఒక్కోచోట ఒక్కోవిధంగా పండగలు జరుపుకుంటారు కానీ మొత్తం మీద ఒకటే విషయం అందరూ కాలి మెలిసి ఆనందంగా ఉండడమే పరమార్థం.
Comments
Post a Comment