రుక్మయ్య-వడ్డీ..
అనగనగా అవంతిపురం అనే రాజ్యం ఉంది ఆ రాజ్యానికి రాజు సులోచనడు.సులోచనడు అంటే మంచి ఆలోచనలు కలిగిన వాడు అని అర్థం .ఆ రాజ్యంలో రుక్మయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను నగలు తాకట్టు పెట్టుకొని సొమ్ము ఇచ్చేవాడు,కానీ ఎక్కువ వడ్డీ లాగేవాడు.కలలో కూడా వడ్డీ వడ్డీ అని ఆలోచించేవాడు. సులోచనడు అతనిని చాలా సార్లు మందలించాడు. అయిన అతని పద్దతి మార్చుకోలేదు. రుక్మయ్య దగ్గరికి చెన్నయ్య దంపతులు వచ్చారు వారి కూతురి వివాహం కోసం సొమ్ము అవసరం అయ్యింది. చెన్నయ్య దంపతులు వారి దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి ధనాన్ని తీసుకెళ్లారు అందరికంటే నీకు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాను అనేసరికి నోటు రాసుకోలేదు.చెన్నయ్య దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు , కూతురి వివాహం జరిగిపోయింది.
కొన్ని రోజుల తరువాత చెన్నయ్య దంపతులు పంట అమ్ముడుపోగా మిగిలిన ధనాన్ని ,దాచి ఉంచారు .అలా కూడబెట్టిన ధనాన్ని తీసుకొని పోయి రుక్మయ్య దగ్గరకు వెళ్లారు ,ఆయన నువ్వు నా దగ్గర ఎప్పుడు తాకట్టు పెట్టవు ? నేను నీకు ఎప్పుడు డబ్బులు ఇచ్చాను అని అన్నాడు.చెన్నయ్య దంపతులు కంగారుపడి తర్వాత తేరుకొని అలా మాట్లాడతారు ఏంటి రుక్మయ్య గారు మేము మా కూతురి వివాహం కోసం డబ్బు తీసుకున్నాం కదా ! మా నగలు మాకు ఇవ్వండి అని అన్నారు. రుక్మయ్య కావాలనే నగలు కొట్టేయడానికి నోటు రాసుకోకుండా తక్కువ వడ్డీకి ఇచ్చాడు.ఈ పంచాయితీ రాజు గారి దగ్గరకు వచ్చింది, రాజు గారు బాగా ఆలోచించి రేపు పొద్దున్న రండి అని పంపించాడు.మరుసటిరోజు తెల్లారేసరికి ఇద్దరు వచ్చి సభలో వున్నారు .అందరూ చూస్తుండగా రాజు రెండు కుండలను తెప్పించాడు వాటికి చుట్టూ గుడ్డ కట్టి ఉంది.ఇందులో పాలు ఉన్నాయి ,ఇవి ఇంటికి తీసుకొని వెళ్ళండి రేపు తీసుకొని రావాలి ఎవరైతే అబద్దం అడతారో వారి పాలు నీళ్ల లాగా మారిపోతాయి అని చెప్పాడు రాజు సులోచనడు.రుక్మయ్య ,చెన్నయ్య దంపతులు వాటిని తీసికొని ఇంటికి వెళ్లారు.చెన్నయ్య వాళ్ళు దానిని అక్కడే పెట్టారు .రుక్మయ్య పొద్దున తెరిచి చూసాడు దానిలో నీళ్లు ఉన్నాయి ,నిజంగానే పాలు నీళ్లు ఐపోయాయి అని అనుకోని దానిలో పాలు వేసాడు.ఇద్దరు వారి వారి కుండలను తీసుకొని వచ్చారు .భటులు వచ్చి రెండింటి మూతలు తెరిచారు ,ఒకదానితో పాలు ఇంకో దానిలో నీళ్లు ఉన్నాయి.రుక్మయ్య చాలా సంతోషంగా చూడండి మహారాజా!ఆ చెన్నయ్య తెచ్చిన కుండలో నీళ్లు ఉన్నాయి అన్నాడు.సులోచనడు వెంటనే నవ్వి,దొంగ దొరికాడు అన్నాడు.అవును మహారాజా అవును,ఈ చెన్నయ్య దంపతులు దొంగలు అబద్దం చెప్తున్నారు.భటులారా రండి ఈ రుక్మయ్యని బంధించండి అన్నాడు రాజు సులోచనడు. అందరూ అయోమయంలో ఉన్నారు. నేను రెండు కుండలలో కేవలం నీటిని నింపాను నువ్వు దొంగతనం చేశావు కనుక భయపడి అందులో పాలు పోసావు అన్నాడు రుక్మయ్య ఖంగుతున్నాడు నిజం ఒప్పుకున్నాడు. చెన్నయ్య దంపతులు సంతోషించి రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.అబద్ధం ఎప్పుడైనా తప్పే ఎవరినైనా మోసం చేయాలని చూస్తే దాని వల్ల మనకే సమస్య ఎదురవుతుంది.ఎల్లవేళలా నిజం చెప్పాలి అదే మమ్మల్ని కాపాడుతుంది.
Excellent
ReplyDeleteNice 👌story💐
ReplyDelete