ఉడిపి మహారాజు కథ.

అనగనగా చాలా కాలం క్రితం దక్షిణ భారతదేశంలో ఒక చిన్న రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు ఉడిపి . ఉడిపి మహారాజు పేరు నరేషుడు . ఆయన ఎంతో ధర్మపరుడు, ప్రజల పట్ల ప్రేమ కలిగినవాడు. రాజ్యంలో ఎవరికైనా కష్టం వస్తే వెంటనే సహాయం చేసేవాడు. అందుకే ప్రజలు ఆయనను ఎంతో గౌరవించేవారు.
కానీ ఒక సమస్య మాత్రం మహారాజును ఎప్పుడూ ఆలోచనలో పడేసేది.
అది ఏమిటంటే — “నా ప్రజలు నిజంగా సంతోషంగా ఉన్నారా? లేక నా ముందు మాత్రమే సంతోషంగా నటిస్తున్నారా?” అనే సందేహం.
ఒకరోజు ఆయన తన మంత్రి అయిన సోమదేవుడిని పిలిచాడు.
“మంత్రి గారూ, మన రాజ్యంలో ప్రజలు నిజంగా మంచివాళ్లా? లేక భయంతో మంచిగా ఉంటున్నారా?” అని అడిగాడు.
మంత్రి కొద్దిసేపు ఆలోచించి,
“మహారాజా! ఇది తెలుసుకోవాలంటే ఒక పరీక్ష పెట్టాలి” అన్నాడు.
రాజు వెంటనే అంగీకరించాడు.
పాల కుండ పరీక్ష
రాజు రాజ్యం అంతటా ఒక ప్రకటన చేయించాడు.
“రేపు ఉదయం రాజభవనం ముందు ఒక పెద్ద కుండ ఉంచబడుతుంది. ప్రతి ఇంటి వారు ఒక గ్లాసు పాలు ఆ కుండలో పోయాలి. అది దేవాలయ సేవకు ఉపయోగపడుతుంది” అని ప్రకటించారు.
ప్రజలందరూ “సరే మహారాజా” అని ఒప్పుకున్నారు.
ఆ రాత్రి చాలా మంది ఇలా ఆలోచించారు:
“అందరూ పాలు పోస్తారు కదా… నేను ఒక్క గ్లాసు నీళ్లు పోస్తే ఎవరికీ తెలియదు.”
అలా ఒక్కొక్కరూ అదే ఆలోచనతో పాలు బదులు నీళ్లు తీసుకొచ్చారు.
ఆశ్చర్యపోయిన రాజు
మరుసటి రోజు ఉదయం మహారాజు స్వయంగా వచ్చి కుండను చూడగా…
అందులో మొత్తం నీళ్లే ఉన్నాయి!
ఒక్క చుక్క పాలు కూడా కనిపించలేదు.
రాజు చాలా బాధపడ్డాడు.
“ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను మరొకరిపై వదిలేస్తే… సమాజం ఇలా నాశనం అవుతుంది” అని అన్నారు.
అప్పుడు మంత్రి చెప్పాడు:
“మహారాజా! ఇదే మనుషుల స్వభావం. చిన్న తప్పు ఎవరికీ తెలియదని భావిస్తారు. కానీ అందరూ అలాగే ఆలోచిస్తే పెద్ద నష్టం జరుగుతుంది.”
రాజు వెంటనే ప్రజలందరినీ పిలిపించాడు.
ఉడిపి మహారాజు ప్రజలను చూసి ఇలా అన్నాడు:
మన రాజ్యం బలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలి.
‘నేను ఒక్కరినే కదా’ అనే ఆలోచన సమాజాన్ని బలహీనపరుస్తుంది.”
ప్రజలందరూ తమ తప్పును గ్రహించారు.
రాజుకు క్షమాపణలు చెప్పారు.
ఆ రోజు నుండి రాజ్యంలో ప్రజలు మరింత నిజాయితీగా జీవించడం ప్రారంభించారు.కురుక్షత్రం జరుగుతున్న సమయంలో ఉడిపి మహారాజుకు ఎవరివైపుకి నిలబడాలి అని తేల్చుకోలేక పోయాడు . కృష్ణుడి దగ్గరకు వెళ్ళి అడిగాడు ,కృష్ణుడు ఆలోచించు నీకే పరిష్కారం దొరుకుతుంది అని అన్నాడు. ఉడిపి మహారాజుకు ఆలోచన వచ్చింది.
కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో కోట్లాది మంది సైనికులు యుద్ధభూమిలో ఉండేవారు. అంత పెద్ద సైన్యానికి ప్రతిరోజూ ఆహారం తయారు చేయడం చాలా కష్టం . ఈ బాధ్యతను నేను స్వీకరిస్తాను  అన్నాడు.
ప్రతి రోజు ఎంతమందికి భోజనం అవసరమో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యమే. ఎందుకంటే యుద్ధంలో ఎంతోమంది మరణించేవారు. అయినప్పటికీ, ఉడిపి రాజు ఎప్పుడూ ఆహారం తక్కువ కాకుండా, ఎక్కువ కూడా కాకుండా సరిగ్గా వండించేవాడు.
ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఒకరోజు  భీముడు ఉడిపి రాజును అడిగాడు:
“నువ్వు ప్రతిరోజూ ఎంతమంది బ్రతికి ఉంటారో ఎలా తెలుసుకుంటావు?”
అప్పుడు ఉడిపి రాజు నవ్వుతూ ఇలా చెప్పాడు:
“నేను ప్రతి రాత్రి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్తాను. ఆయన పల్లీలు (వేరుశెనగలు) తింటూ ఉంటారు. ఆయన ఎన్ని పల్లీలు తింటారో నేను లెక్కపెడతాను. ఒక్క పల్లి అంటే మరుసటి రోజు యుద్ధంలో వెయ్యిమంది మరణిస్తారని అర్థం చేసుకుంటాను. అలా లెక్క వేసుకుని ఎంతమందికి భోజనం కావాలో నిర్ణయిస్తాను.”
ఈ విషయం విని అందరూ శ్రీకృష్ణుని మహిమను గ్రహించారు. ఎందుకంటే యుద్ధంలో ఎవరు బ్రతుకుతారు, ఎవరు మరణిస్తారు అన్నది ఆయనకే ముందుగా తెలుసు.శ్రీకృష్ణుడు సర్వాంతర్యామి మాయలు మంత్రాలు లేకుండా మహాభారతాన్ని నడిపించాడు.

Comments

Popular posts from this blog

రామచిలుక కథ

ఐకమత్యమే మహాబలం.

అంతా మన మంచికే...