అనగనగా ఒక ఊరిలో చెంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు , అతనికి రాజు అనే కొడుకు ఉండేవాడు.అతను చాలా సోమరిపోతు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు.రాజుని తండ్రి ఎప్పుడు మందలించే వాడు.అయిన వాడు మాత్రం ఏమి చేయకుండా అలాగే తిరిగేవాడు. ఒకరోజు ఎంత చెప్పినా వినడం లేదు అని ఇంటి నుండి బయటకు పంపించేశారు.ఏదయినా పని చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వస్తేనే నీకు భోజనం లభిస్తుంది అన్నాడు చెంగయ్య.రాజు పని కోసం వెళ్లాడు కానీ పని దొరకలేదు.అయితే అతను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానిని తెచ్చి తండ్రికి ఇచ్చాడు.దానికి తండ్రి సంతోషించి తీసుకొని భోజనం పెట్టాడు ఆ డబ్బును ఇంట్లొ ఉన్న బావిలో వేసాడు చెంగయ్య. రాజు చూసుకుంటూ వెళ్ళాడు తప్ప ఏమీ అనలేదు.అలా వెళ్లి భోజనం తిని పడుకున్నాడు. తెల్లారి కూడా అలాగే బయటకు వెళ్లి డబ్బులు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాడు.అలా మూడు నెలలు గడిచిపోయాయి.ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది.కొంతకాలానికి ఒకరోజు ఎంత వెతికినా ఎవరు దొరకలేదు ఖాళీగా ఇంటికి వచ్చాడు,ఇంట్లో భోజనం పెట్టలేదు.అలాగే పడుకున్నాడు.మళ్ళీ వెళ్ళాడు సగం రోజు వరకు ఎవరూ దొరకలేదు.రిక్షా తొక్కే వ్యక్తి కనిపిస్తే అతని దగ్గరికి వెళ్లి నేను ఈ రిక్షా తొక్కుతా నాకు ఈ రిక్షా ఇస్తారా అన్నాడు అతను నాకు ఏంటి లాభం అన్నాడు నువ్వు రిక్షా ఇస్తే నీకు వచ్చిన డబ్బులలో సగం ఇస్తాను ఆంటీ సరే అని రిక్షా ఇచ్చాడు.రాత్రి వరకు రిక్షా తొక్కి డబ్బు సంపాదించి సగం తీసుకొని సగం రిక్షా అతనికి ఇచ్చి ఇంటికి వెళ్లి తండ్రికి డబ్బులు ఇచ్చి భోజనానికి వెళ్ళాడు.ఆ డబ్బులు అతను బావిలో వేసాడు రాజుకి కోపం వచ్చింది ,నీకు ఇన్ని రోజులు అసలు కోపం రాలేదు ఈ రోజు ఎందుకు వస్తుంది.నిన్న మొన్న నువ్వు అసలు కోప్పడలేదు ఈ రోజు ఎందుకు అన్నాడు?ఎందుకంటే నేను చెప్పనా!రోజు నువ్వు డబ్బులు సంపాదించకుండా తెస్తున్నావు కాబట్టే నీకు కోపం రాలేదు,ఈ రోజు ఒక్కరోజు సంపాదించే సరికి కోపం వచ్చిందా? కష్టపడి పని చేయడం వల్ల నీకు డబ్బుల విలువ తెలిసింది అదే నువ్వు ప్రతిరోజూ పని చేయకపోవడం వల్ల నువ్వు అసలు బాధ పడలేదు.అందుకే కష్టపడి పనిచేసి సంపాదించిన ఒక రూపాయి అయిన గొప్పదే అన్నాడు చెంగయ్య, రాజు తండ్రిని క్షమించమని అడిగాడు ఇంకెప్పుడు ఇలా చేయను అని అన్నాడు.
ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా. అనగనగా ఒక ఊర...
Comments
Post a Comment