Posts

Showing posts from December, 2025

చిరు తొండనంబి కథ.

Image
పరమ శివుని భక్తులు చాలా మంది ఉన్నారు అందులో అరవై మూడు మంది మహాభక్త మహాశయులచరిత్ర పెరియ పురాణము .ఈ కథ నేను చదివిన పెరియ పురాణం లోనిది చిరు తొండనంబి కథ. కావేరినది ప్రవాహం ఒడ్డున తిరుచెంగట్టంగుడి అనే ఒక గ్రామం కలదు.ఆ గ్రామంలో మహామట్టిరార్ అను బ్రాహ్మణ వంశంలో పరంజ్యోతి (ఇతనికి చిరుతోండని పేరు) అను వాడుండెను.అతను ఆయుర్వేదం,సంస్కృతము,యుద్ధ విద్య ,అశ్వ,గజ శిక్షణలలో నిపుణుడు ఆయినప్పటికి సకల శాస్త్ర పరమార్థము శివుడే అని  అనుకోని శివుని పాద సేవకంటే ఏదీ ఎక్కువ కాదని  శివసేవకే అంకితమయ్యాడు.   పరంజ్యోతి పల్లవ రాజు సేనాధిపతి,అతను చాలా సార్లు అనేక నగరాలపై దండయాత్ర చేసి , వాటిని నేల మట్టం చేసి అక్కడ కొల్ల గొట్టిన ధనాన్ని తెచ్చి రాజుకు ఇచ్చేవాడు. అతని బల పరాక్రమం చూసి మంత్రులు తలమీద చంద్రవంక పెట్టుకున్న శివుడిని పూజ చేయడం ద్వారా ఇతనికి చాలా పరాక్రమం ఉంది ఈయనను ఎదురించువారు ఈ లోకములో లేరు అని అన్నారు.ఆ మాటలు విన్న రాజు నేను ఒక శివ భక్తుడిని నా సేవ కోసం ఉపయోగం చేసుకుంటున్నా నా ఎంత పాపం తగులుతుంది నాకు అనుకోని నన్ను క్షమించు అని పరంజ్యోతిని వేడుకున్నాడు. నువ్వు నీ సొంత గ్రామానికి...

రైతు కథ..

Image
ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

శ్రీకృష్ణ రాయబారం .

Image
మహాభారతంలో అన్ని కథలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నట్లే ఈ శ్రీకృష్ణ రాయబారం కూడా అలాంటిదే. రాయబారం అంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం కాదు ఇరువురి మధ్య ఉన్న సమస్య గురించి లోతైన అవగాహన ఉండాలి.సమస్య తెలిస్తేనే కదా ! దారి తెలుస్తుంది.మహాభారతం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితాలకు ఒక అర్థవంతమైన పుస్తకం. పాండవులను కౌరవులు అడుగడుగునా హింసిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలో వారు కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్తాన్ని చూడడానికి ఒకరోజు దుర్యోధనుడు వెళ్తాడు అతను ఆ భవనాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందాడు,దానితో అసూయ చెందాడు.ఎలాగైనా ఇంద్రప్రస్తాన్ని కూడా చేజిక్కించుకోవాలి అని పన్నాగాలు పన్నాడు.శకుని మామ సహాయంతో మాయ పాచికలు తయారు చేసాడు.ధర్మరాజు జూదానికి బానిస కాదు కాని అతనికి జూదం అంటే ప్రాణం.   ధర్మరాజును కౌరవులు జూదానికి ఆహ్వానించారు ,వారి మనస్తత్వం తెలిసి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు.వారు ఆహ్వానించనందువల్ల మనం వెళ్ళాలి అని అందరిని కూడా గట్టుకొని హస్తీనాపురానికి వచ్చాడు.శకుని తన చాకచక్యంతో పండిత పామర జనాలను మభ్య పెడుతూ ధర...

మనుషులు -రకాలు

Image
మనుషులు మూడు రకాలుగా ఉంటారు .        మొదటి రకం ఏ పనినైనా గొప్పగా ప్రారంభిస్తారు పది మందికి చెప్పుకుంటారు.ఏ ఉత్సాహంతో మొదలు పెట్టారో అదే ఉత్సాహాన్ని చివరిదాకా కొనసాగించరు.మొదలు పెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తారు.        రెండవరకం పని మొదలు పెట్టడానికి ముందే వంద ఆలోచిస్తారు అవుతాదా?లేదా? అవకపోతే ఎలా ఎం చేయాలి అని రకరకాలుగా ఆలోచించి సమయం వృధా చేస్తారు.మొత్తానికి పని మొదలు పెట్టరు.      మూడవ రకం  పని చిన్నదా ?పెద్దదా? అని ఆలోచించరు ఏ పని అయిన వీళ్ళ చేతిలో పడిందంటే పూర్తి కావాల్సిందే.పూర్తి చేసేదాక వదిలి పెట్టరు. కానీ అదే పనిని సంవత్సరాల తరబడి అయినా చాలా ఓపికగా చేస్తారు చివరకు విజయాన్ని సాధిస్తారు.   ఒక పని ఆరంభించినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనకడుగు వేయరాదు .లక్ష్యాన్ని చేరుకునే దాకా అహర్నిశలు కష్టపడాలి. ఈ సాధనలో కఠోర దీక్ష , అంతులేని  శ్రమ,దుఃఖము, త్యాగము అన్ని ఇమిడి ఉంటాయి. అలాంటి కొన్ని పురాణ కథలను మనం తెలుసుకుందాం. వాయి పుత్రుడు హనుమాన్ ,అతను అత్యంత బలశాలి అతనికి గురువు ఎవరో తెలుసా  సూర్యుడు. చిన్నతనంలోనే ...