Skip to main content

శ్రీకృష్ణ రాయబారం .

మహాభారతంలో అన్ని కథలు మనకు చాలా దగ్గరగా ఉంటాయి అని గతంలో చెప్పుకున్నట్లే ఈ శ్రీకృష్ణ రాయబారం కూడా అలాంటిదే.
రాయబారం అంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడడం కాదు ఇరువురి మధ్య ఉన్న సమస్య గురించి లోతైన అవగాహన ఉండాలి.సమస్య తెలిస్తేనే కదా ! దారి తెలుస్తుంది.మహాభారతం ఒక కథ మాత్రమే కాదు మనందరి జీవితాలకు ఒక అర్థవంతమైన పుస్తకం.
పాండవులను కౌరవులు అడుగడుగునా హింసిస్తున్నా కూడా చెక్కు చెదరకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతున్నారు.ఈ క్రమంలో వారు కొత్తగా నిర్మించిన ఇంద్రప్రస్తాన్ని చూడడానికి ఒకరోజు దుర్యోధనుడు వెళ్తాడు అతను ఆ భవనాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందాడు,దానితో అసూయ చెందాడు.ఎలాగైనా ఇంద్రప్రస్తాన్ని కూడా చేజిక్కించుకోవాలి అని పన్నాగాలు పన్నాడు.శకుని మామ సహాయంతో మాయ పాచికలు తయారు చేసాడు.ధర్మరాజు జూదానికి బానిస కాదు కాని అతనికి జూదం అంటే ప్రాణం.
  ధర్మరాజును కౌరవులు జూదానికి ఆహ్వానించారు ,వారి మనస్తత్వం తెలిసి కూడా ధర్మరాజు ఒప్పుకున్నాడు.వారు ఆహ్వానించనందువల్ల మనం వెళ్ళాలి అని అందరిని కూడా గట్టుకొని హస్తీనాపురానికి వచ్చాడు.శకుని తన చాకచక్యంతో పండిత పామర జనాలను మభ్య పెడుతూ ధర్మరాజును జూదంలో కూర్చోబెట్టాడు.పాచికలు అన్ని శకుని చెప్పినట్టే వింటాయి కాబట్టి అతను ఇది కోరుకుంటే అదే పడుతుంది.ధర్మజుడు చూస్తూ ఉండిపోయాడు మెల్లి మెల్లిగా ఒక్కో ఆట ఓడిపోయాడు.
ధర్మరాజును పూర్తిగా ఓడించాలని నిర్ణయించుకున్న కౌరవరాజు దుర్యోధనుడు రెచ్చగొట్టి తన సోదరులను పణంగా పెట్టాడు.ధర్మరాజు తన సోదరులను కోల్పోయాడు.ఇప్పుడు దుర్యోధనుడు తన భార్యను పందెంగా పెట్టాడు భీష్ముడు వద్దు అని వారించాడు ఇది ఆమోద యోగ్యం కాదు అని హెచ్చరించాడు.అహంకారం వల్ల కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు వినలేదు. మాట కోసం ధర్మజుడు పాంచాలిని ఫణంగా పెట్టాడు,ఆమెను ఓడిపోయాడు.దుర్యోధనుడు ఆమెను ఘోరంగా అవమానించాడు.చివరకు ఒక ఒప్పందం ప్రకారం పాండవులు 12 సంవత్సరాల అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది.వారు ఈ కఠినమైన కాలాన్ని కూడా ఒక సవాలుగా స్వీకరించారు , పూర్తి చేశారు.
         13 సంవత్సరాల తరువాత తిరిగి ఇంద్రప్రస్థానికి వచ్చారు.మా రాజ్యం మాకు ఇవ్వవలసిందిగా అడిగారు.కౌరవులు మీకు అర్థభాగం కాదు కదా! సూది మొన మోపేటంత స్థలాన్ని కూడా ఇవ్వను అన్నాడు దుర్యోధనుడు.
ఇరువైపులా వాతావరణం అనుకూలంగా లేదు. సంజయుడు రాయభారానికి వచ్చి మీకు రాజ్యం ఇచ్చేది లేదని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుడు దగ్గరకు వెళ్లి బావా ! మా తరపున రాయభారానికి వెళ్ళాలి అన్నాడు.వెళ్లి ఎం చేయాలి అన్నాడు శ్రీకృష్ణుడు. యుద్ధం జరిగితే చనిపోయేవారు అంతా మన బంధువులు కదా శాంతిగా ఒప్పించి మాకు జీవించడానికి సరిపోయేంత 5 గ్రామాలు ఇవ్వమను అన్నాడు.ధర్మరాజు చెప్పినంతనే వెళ్ళలేదు మిగిలిన పాండవుల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుందాం అని  అడిగాడు.భీముడు,అర్జునుడు,నకుల సహదేవులు యుద్దానికే సిద్ధంగా ఉన్నారు.ద్రుపది మాత్రం తనకు తానే చాలా ప్రశ్నలు వేసుకుంటుంది యుద్ధం జరిగితే జరిగే ప్రాణ నష్టాలకు పూర్తి బాధ్యత నాదే కదా! నేను రక్త పిచాచినా అని అనుకుంటూ ఉంటుంది.ఇంకోవైపు వాళ్ళు చేసిన  గాయం మనసులో మెదులుతుంది మొత్తానికి యుద్ధమే శరణం అన్నది.
ధర్మరాజు నువ్వు వెళ్లి మాట్లాడు కానీ వాళ్ళంతట వాళ్లే చెప్పేదాక యుద్ధం ప్రస్థావన తేవద్దు అన్నాడు.శ్రీకృష్ణుడు సాత్యకిని వెంట పెట్టుకొని హస్తీనాపురానికి వెళ్ళాడు.అతను రాయబారిగా వెళ్ళాడు కనుక మొదట తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆ తర్వాత సభలో ఉన్న పెద్దలందరికి నమస్కారం చేసి కుశల ప్రశ్నలు వేసాడు.మనం ఎప్పుడూ శాంతి వైపే ఉండాలి కనుక పాండవులకు 5 వూళ్లను ఇవ్వమని అడిగాడు .మేము ఇవ్వము కావాలంటే యుద్ధం చేసి రాజ్యాన్ని గెలుచుకొమ్మని సలహా ఇచ్చాడు దుర్యోధనుడు.యుద్ధం వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం అని పెద్దలు గురువులు చెప్తున్నారు.అయినా కూడా  వినలేది సరి కదా,   శ్రీకృష్ణుడుని హెచ్చరించాడు.సరే మీకు అంతగా యుద్ధం చేయాలని ఉంటే వారు మాత్రం చేయకుండా ఎలా ఉంటారు, ఎక్కడ యుద్ధం చేయాలో మీరే నిర్ణయించండి అని అన్నాడు.యుద్ధ ప్రదేశం యుద్ధ సమయం, ముహూర్తం అన్ని వారి చేతనే పెట్టించాడు శ్రీకృష్ణుడు.కౌరవులు వారి చావుకు వారే ముహూర్తం పెట్టుకున్నారు.
  ధర్మరాజు యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ముందుగానే అంచనా వేశాడు. శ్రీకృష్ణుడు మంచి మిత్రుడు మంచి సలహాదారు కాబట్టి మంచి సలహాలు సూచనలు ఇచ్చాడు.అతని సారధ్యంలో  పాండవులు యుద్ధం గెలిచి రాజ్యాన్ని స్థాపించారు.దుర్యోధనుడు అతని సోదరులు శకుని సాంగత్యంతో చెడు ప్రవర్తన కలిగి అంతం అయ్యారు.











Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .