సమయస్ఫూర్తి
అనగనగా ఒక ఊరిలో సాంబయ్య అనే వ్యాపారి ఉండేవాడు.అతను వ్యాపారరీత్యా ఒక ఉరి నుండి ఇంకొక ఊరికి ప్రయాణం చేస్తూ ఉండేవాడు.ఒక పని మీద తన ప్రాణస్నేహితుడిని కలవడానికి దొంగలపురం అనే ఊరికి వెళ్ళాడు. ఆ ఊరిలో దొంగతనాలు ఎక్కువగా జరగడం వల్ల ఆ ఊరికి దొంగలపురం అనే పేరు వచ్చింది.తన స్నేహితుడిని కలిసి మాట్లాడేసరికి చాలా సమయం అయింది సాయంకాలం ఆ ఉరి నుండి బయలుదేరాడు ,తన స్నేహితుడు ఈ ఊర్లో దొంగలు ఎక్కువగా ఉంటారు నువ్వు నీ సొమ్ము జాగ్రత్తగా తీసుకెళ్లు అన్నాడు.చీకటి మరియు అడవిగుండా ప్రయాణం అవడం చేత సాంబయ్య మెల్లిగా నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఎవరో తనను వెంబడిస్తున్నారు అని చూసాడు .ఒక వ్యక్తి తనను దూరం నుంచి ఫాలో అవుతున్నాడు అతనికి భయం వేసింది.అలా నడుస్తూ ఉన్నాడు, కొంతసేపటికి ఒక చెరువు కనిపించింది అతనికి వెంటనే ఒక ఉపాయం తట్టింది.చెరువు దగ్గరకు వెళ్లి అయ్యయ్యో నా పెట్టె చెరువులో పడిపోయింది అని లబోదిబోమన్నాడు.అతనిని వెంబడిస్తున్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమైంది ?అంటాడు నా పెట్టె పడిపోయింది అన్నాడు సాంబయ్య .దొంగ వెంటనే నేను తీసి ఇస్తా అని చెరువులోకి దూకాడు ,సాంబయ్య వెంటనే పొదల్లో ఉన్న పెట్టె తీసుకొని వెళ్ళిపోయాడు.అతను చెరువులో వెతుకుతూనే ఉన్నాడు. సాంబయ్య క్షేమంగా ఇల్లు చేరాడు.దొంగని తప్పించు కోవడానికి సమయానికి సరైన ఆలోచన చేసి సమయస్ఫూర్తి ప్రదర్శించాడు.సమయస్ఫూర్తి ఎప్పుడు మనను ఆపద నుండి కాపాడుతుంది.
Comments
Post a Comment