Skip to main content

కచుడు -దేవయాని కథ..

మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో  ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం.         
   హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా  మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా  బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు.
దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు.
     దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి  దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు.
శుక్రాచార్యుడుకి దేవయాని అనే కూతురు ఉంది ఆమె కచుడి  అందానికి  మోహితురాలు అయింది ,అతని ప్రవర్తన కూడా ఆమెకు చాలా నచ్చింది దాంతో ఆమె కచుడిని ప్రేమించడం మొదలు పెట్టింది.
కచుడు మాత్రం గురువు గారి పుత్రిక అయినందున తనను సోదరి సమానురాలిగా భావించాడు.ఇలా అయిదు సంవత్సరాల కాలం గడిచిపోయింది.
కచుడు శుక్రాచార్యుడుకి,దేవయానికి దగ్గరగా ఉండడం తన తోటి సహచరులకు నచ్చలేదు.అందువల్ల కచుడు ఒక్కడే  ఆవులను తొలుకొని వెళ్లిన సమయంలో అతన్ని వెంబడించి చంపి ముక్కలుగా చేసి తోడేళ్లకు ఆహారంగా వేశారు.చీకటి పడుతున్న కచుడు ఇంకా ఆశ్రమానికి తిరిగి రాలేదని కంగారు పడి తండ్రిని ప్రాధేయపడింది.శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని  మృత సంజీవని విద్య ద్వారా అతనిని బ్రతికించాడు.
మరల కొన్ని రోజులకు కచుడు ఒంటరిగా ఉన్న సమయం చూసి అతనిని హత్య చేసి  ఈ సారి బూడిద చేశారు .ఆ బూడిదను ఏమి చేసినా మళ్ళీ గురువు గారు బ్రతికిస్తారు అని అనుకోని ఆ రాక్షసులు   శుక్రాచార్యుడి సురా పానంలో కలిపారు.ఆ విషయం తెలియక శుక్రాచార్యుడు ఆ సురను తాగేసాడు.
మద్యం మత్తులో అతను  దేవయాని ఏడుస్తున్న కూడా పట్టించుకోలేదు, తెల్లవారిన తర్వాత జరిగిన విషయం తెలుసుకొని  చాలా బాధ పడ్డాడు.దేవయాని ఎలాగైనా కచుడిని బ్రతికించమని బ్రతిమలాడింది , నేను అతనిని బ్రతికిస్తే నా ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అని ఆలోచించాడు.
అందరూ గురువు గారు  ఎం చేస్తారు అని ఆలోచించసాగారు.దేవయాని నువ్వు నీ కడుపులో ఉన్న కచుడికి మృతసంజీవని విద్య నేర్పించు దాని వల్ల అతను నువ్వు చనిపోయినా నిన్ను  అతను బ్రతికిస్తాడు అన్నది.
ఇక తప్పదు అనుకోని శుక్రాచార్యుడు తన కడుపులో ఉన్న కచుడికి మృతసంజీవని విద్య నేర్పించి అతనిని బయటకు తీసి మరణించాడు.కచుడు శుక్రాచార్యుడిని బ్రతికించాడు. ఆ తర్వాత తను వచ్చిన పని అయిపోయింది అని అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు.
గురుపుత్రిక దేవయాని  కచుడిని నువ్వు నన్ను పెళ్లి చేసుకో , అన్నది కచుడు నేను ఎప్పుడూ నిన్ను అలాంటి ఉద్దేశ్యంతో చూడలేదు నువ్వు నన్ను వదిలేయ్ అన్నాడు.దేవయానికి కోపం వచ్చింది తను విచక్షణ కోల్పోయి నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని శపిస్తుంది.కచుడు మాత్రం పోనీ లే నాకు కాకుండా ఎవరికైనా పనికి వస్తుందిలే అని ఆనందపడ్డాడు.
ఈ కథలో నీతి ఎల్లవేళలా నిజం చెప్పాలి కచుడు నిజాయితీగా తన గురుంచి ,తను వచ్చిన పని గురుంచి చెప్పాడు.
మద్యం తాగవద్దు,దాని వల్ల  అనర్థాలు వస్తాయి అని తెలుసుకోవాలి . 
దేవయాని శాపం పెట్టినా కూడా నా విద్య నాకు పనికి రాకున్నా సరే వేరే వాళ్లకు పనికివస్తుంది అన్న ఉద్దేశ్యం సరైనది.








Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .