బహుమతి - శిక్ష
తెలుగు కథలలో ముఖ్యంగా తెనాలి రామ కథలు చాలా ప్రత్యేకం.కొన్ని హాస్యాస్పదం మరికొన్ని తెలివి తేటలకు సంబంధించినవి ఉంటాయి.ఇది కూడా అలాంటిదే.
రామకృష్ణుడి స్నేహితుడు ఒకరోజు సభా మందిరాన్ని చూడాలని అనుకున్నాడు అయితే అతడు రేపు రా అని చెప్పాడు . స్నేహితుడు తెల్లారక సభ సమయానికి వచ్చాడు ద్వార పాలకులు అడ్డగించారు లోపలికి వెళ్లనివ్వలేదు.అతను రామలింగని స్నేహితుడిని అని చెప్పినా వినలేదు.మరుసటి రోజు ఆ స్నేహితుడు రామలింగడి ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు.
సరే ఈ విషయాన్నీ నేను కనిపెడత్తా అని రామలింగడు మరునాడు సభకు మారువేషంలో వెళ్ళాడు.లోపలికి వెళ్లబోతుంటే ద్వారపాలకులు అడ్డుకున్నారు , అయితే రామలింగడు తనను తాను ఒక కళాకారుడిగా పరిచయం చేసుకున్నాడు.భటులు ఒకవేళ నీ కళ నచ్చితే రాజుగారు నీకు బహుమతి ఇస్తారు మాకు ఏం లాభం అన్నారు .సరే నాకు ఇచ్చిన బహుమతిలో సగం ఇస్తాను అని అన్నాడు రామలింగడు.ఇలా కొంచెం లోపలికి వెళ్లగానే మళ్లీ ద్వారపాలకులు అడ్డగించారు అలా మొత్తం సభలోకి వెళ్ళడానికి చాలా మంది అడ్డగించారు . రాజు దగ్గరికి వెళ్ళి తన కవిత్వం చెప్పాడు ఆ కవిత్వానికి మెచ్చి కృష్ణదేవరాయలు ఏమి బహుమతి కావాలో కోరుకో అన్నాడు రామలింగడు తెలివిగా నాకు వంద కొరడా దెబ్బలు కావాలి అని అన్నాడు రాజు విచిత్రంగా చూస్తూ , ఎవరైనా మంచి మంచి బహుమతులు అడుగుతారు నువ్వేంటి ? దెబ్బలు అడుగుతున్నావు అన్నాడు .రామలింగడు వేషం తీసి తనను తాను పరిచయం చేసుకున్నాడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం పొందారు .రాజుగారు ఏమైంది రామలింగ ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించాడు.రామలింగడు మన రాజభవనానికి రావడానికి లంచం ఇస్తే సరిపోతుంది ఎవరినైనా లోపలికి అనుమతిస్తారు .మొదటి ద్వారం నుండి చివరి ద్వారం వరకు అందరికీ ఈ కొరడా దెబ్బలు పడాలి ఎందుకంటే అందరూ రాజుగారు ఇచ్చిన బహుమతిలో సగం వారికి ఇస్తేనే లోపలికి అనుమతిస్తాం అన్నారు . మా సభలో ఇలాంటివి జరగవు అన్నాడు, స్వయంగా నేను వెళ్ళి తెలుసుకున్న అన్నాడు రామలింగడు. రాజుకి కోపం వచ్చి ద్వార పాలకులందరినీ తొలగించి కొత్త వారిని నియమించారు . మరల ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు.
Old memories💐 nice
ReplyDelete