తండ్రి కొడుకు గాడిద కథ(telugu moral story)
అనగనగా ఒక ఊరిలో చంద్రయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు .అతనికి రుద్ర అనే కొడుకు ఉండేవాడు . వాళ్ళు ఒకరోజు బజారుకు వెళ్ళి ఒక గాడిదను కొన్నారు దానిని తీసుకొని నడుచుకుంటూ వెళుతున్నారు . అలా వెళ్తుండగా అతనికి తెలిసినవాళ్ళు వచ్చి చిన్న పిల్లాడిని ఎందుకు నడిపిస్తున్నావు , గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళవచ్చు కదా ! అని అన్నారు . ఆ మాటలు విన్న చంద్రయ్య రుద్రను ఎక్కించి నడుచుకుంటూ వెళుతున్నారు. అలా కొంత సేపటికి మరల ఒక వ్యక్తి కనిపించి అరేయ్ రుద్రా నువ్వు దిగు మీ నాన్నకు కాళ్ళు నొప్పులు వస్తాయి , నువ్వు చిన్న పిల్లాడివి నీకు ఏం కాదు అన్నాడు. అప్పుడు రుద్ర దిగి తండ్రి చంద్రయ్య ను ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళాక రమణయ్య అనే పాత స్నేహితుడు కలిసి పిల్లాడిని నడిపించి నువ్వు హాయిగా కూర్చున్నావు అని అన్నాడు చంద్రయ్య ఆలోచించి రుద్రను కూడా పైకి ఎక్కించాడు . కొద్దిసేపటికి బ్రాహ్మణుల గుంపు ఎదురయింది వారు ,గాడిదపైన ఇద్దరు కూర్చున్నారు ఎలా వెళ్తదీ అది మీరు జీవహింస చేస్తున్నారు అని అన్నారు.అప్పుడు బ్రాహ్మణుల మాటలు విన్న చంద్రయ్య, రుద్ర ఇద్దరూ గాడిద మీద నుంచి దిగిపోయారు.
“ఇలా చేస్తే గాడిదకు బాధ ఉండదు” అని అనుకుని, వారు ఒక కర్ర తీసుకొని గాడిద కాళ్లను కట్టి, ఆ కర్రకు వేలాడదీసి ఇద్దరూ మోస్తూ వెళ్లడం మొదలుపెట్టారు.
అలా వెళ్లుతూ ఉండగా, దారిలో ఉన్న వాళ్ళంతా వారిని చూసి నవ్వసాగారు.
“ఏమిట్రా ఇది! గాడిద మీద ఎక్కాల్సింది పోయి, దానినే మోస్తున్నారు!” అని అందరూ వెక్కిరించారు.
ఆ నవ్వుల వల్ల చంద్రయ్యకు కోపం వచ్చి, గందరగోళంలో గాడిదను వదిలేశారు.
అది వెంటనే పారిపోయింది.
చివరికి చంద్రయ్య, రుద్ర ఇద్దరూ ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
“ప్రతి ఒక్కరి మాట వినడం వల్ల మనమే నష్టపోతాం. మనకు సరైనదేంటి అనేది మనమే ఆలోచించాలి.”
Comments
Post a Comment