Skip to main content

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా 
మగువ మగువ నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా
పరుగులు తీస్తావు ఇంటా బయటా 
అలుపని రవ్వంత  అని అనవంట
వెలుగులు పూస్తవు వెళ్ళే దారంతా.
ఈ పాట వింటే ప్రతి ఒక్కరి కంట్లో చిన్న కన్నీటి చెమ్మ  వస్తుంది ,  ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో స్త్రీ పాత్ర అలాంటిది.
ముఖ్యంగా తెలుగు ఇళ్లలో ఇంటి ముందు కళ్ళాపి చల్లి అందమైన ముగ్గు వేస్తే ఆ ఇంటి కల వేరుగా ఉంటుంది నా చిన్నప్పటి నుండి అది ఒక ఎమోషన్.  స్త్రీలు  బాల్యం నుండి అల్లారు ముద్దుగా పెరిగి వివాహం అయిన తర్వాత వేరే ఇంటికి వెళతారు. అక్కడ  వాళ్ళను కూడా సొంత ఇంటి వారిగానే భావించి కలిసి పోతారు. వాళ్ళు కొన్నిసార్లు ఇష్టాలను చంపుకొని,బాధను దిగమింగి తల్లితండ్రులకు మంచి పేరు తేవడానికి ప్రయత్నిస్తారు.ఆమె లేని ఇల్లు ఒక నరకం అని చాలా మంది అభిప్రాయం.భర్తకు భార్యగా సేవలు చేస్తుంది అత్తమామలను తల్లిదండ్రులుగా భావించి అన్ని పనులు చేస్తుంది   వాళ్ళ వంశం అభివృద్ధి కోసం తన   ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇంకొక ప్రాణానికి ఊపిరి   పోస్తుంది ఇన్ని చేసినా కూడా తనకంటూ ఒక గుర్తింపు కోసం ఎప్పుడూ ఆశ పడదు.ఇలా చాలా మంది మహిళలు ఉన్నారు.
 ప్రపంచ జనాభాలో సగం మంది జనాభా ఆడవాళ్లు అయినా కూడా వాళ్ళ గొంతుక వినపడదు.అభివృద్ధి చెందిన దేశాలలో,అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా మహిళల గొంతుక వినపడదు.ఆకాశంలో సగం ,అని చెప్తారు తప్ప ఆచరణలో పెట్టడం మాత్రం ఉండదు.స్త్రీల జీవితం చాలా మలుపులు ఆటుపోట్లతో ఉంటుంది. పుట్టుక నుండి అంతటా వివక్ష నే  గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు బాలిక అని తెలిస్తే అబార్షన్. ఇది అరికట్టడానికి ప్రభుత్వం PCPNDT  చట్టం చేసింది అయిన కూడా కొంత మంది బాలికలు బలి అవుతున్నారు. విద్య కోసం కూడా బాలికలు చాలా కష్టపడుతున్నారు ఇంకా కొన్ని చోట్ల స్త్రీ లను చిన్నచూపు చూడడం వంటివి జరుగుతూ ఉన్నాయి. వివాహం తర్వాత వాళ్ళ జీవితం మారిపోతుంది  . ఒక స్త్రీ ఇంటర్వ్యూ లో అమ్మాయిలకు సొంత ఇల్లు లేదు తెలుసా అని అంటే ఆమెను ఎంత మంది ఆమెను సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్ చేశారు తెలుసా.నిజానికి ఆమె చెప్పాలి అనుకున్న మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం ఎవరికి అవసరం లేదు .పెళ్లి అయిన తర్వాత అన్ని అత్తగారిల్లే కానీ ,అదే అతింట్లో  ఒక చిన్న మాట ఆమె ఎదురు మాట్లాడినా కూడా ఆమెను విమర్శించే వాళ్ళు తప్ప ,తనకు సపోర్ట్ చేసేవారు ఉండరు.చివరకు మొగుడు కూడా ఆమె వైపు నిలబడడు కొన్ని సందర్భాల్లో. ఇంట్లో నుండి వెళ్ళిపో ఇది నీ ఇల్లు కాదు అంటారు అప్పుడు ఆమె మానసిక స్థితి ఏమిటో ఎవరికి అర్థం కాదు .
గుడిలో వున్న అమ్మవారికి చేతులు ఎత్తి దండం పెడతాం కానీ ఇంట్లో వున్న ఆడవారిని గౌరవించ దానికి మాత్రం ఆలోచిస్తాం.
కాలం మారింది నేటి తరం మహిళలు జీవితాన్ని పోరాడి గెలుస్తున్నారు వాళ్లు అన్ని రంగాలలో కూడా తమదైన ముద్ర వేశారు.ఎంతసేపు మహిళల గొప్పదనం గురించి చెప్తే మగవాళ్ళు కూడా ఫీల్ అవుతారు కానీ నిజానికి ప్రతి మగవాడికి తెలుసు వాళ్ళ జీవితంలో ఆమె లేని లోటు ఎంతుందో అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే పురుషులు బలవంతులు అని వాళ్ళు తక్కువ కావొద్దని అనుకుంటారు.ఇది పితృస్వామ్య వ్యవస్థ కదా  ! కొన్ని తెగలలో మాతృస్వామ్య వ్యవస్థ కూడా ఉంది భారతదేశంలో మేఘాలయ లోని ఖాసి తీగ ,కేరళలో నాయర్ తెగలలో ఈ ఆచారం మనకు కనిపిస్తుంది. 
 ఒక సర్వే ప్రకారం  ప్రతి ఏటా 14 శాతం మంది మహిళలు కుటుంబ కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు  .ఇది ప్రపంచ సగటు కన్నా ఎక్కువ.యత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంత దేవతా" అన్నారు పెద్దలు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని ప్రతీతి.గౌరీశంకరులు అది దంపతులు వారు మానవాళికి ఆదర్శ దంపతులు. స్త్రీ ,పురుషులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ,గౌరవం, ప్రేమ ఉండాలి.నారాయణుడు లక్ష్మీదేవిని, శివుడు పార్వతిని, బ్రహ్మ సరస్వతిని గౌరవించారు అదే గౌరవం సమాజంలో స్త్రీల పట్ల ఉండాలి అని పురాణాలు చాటి చెప్పాయి.ఎక్కడో ఉన్న గుడిలోని దేవతమూర్తికి వంగి వంగి దండాలు పెడతాం ,అమ్మా కాపాడు అని ప్రార్దిస్తాం కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీ ,సరస్వతి, పార్వతిని మాత్రం చులకనగా చూస్తాం.స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నారు.స్త్రీల యొక్క ప్రయాణం ఎన్నో అవరోధాలను కలిగి ఉంటుంది.అయినా వారు అన్ని ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు.ప్రయాణం ముఖ్యం కాదు గమ్యస్థాననికి చేరుకోవడం ప్రధానం అంటారు పెద్దలు.స్త్రీల పట్ల దయ ,జాలి ,కరుణ ఉండాల్సిన అవసరం లేదు కానీ వారి హక్కులను నియంత్రించకుండా ఉంటే సరిపోతుంది.కాలం మారింది కానీ సనాతన సంప్రదాయాలు,కట్టుబాట్లు కొన్ని మారడం లేదు.అరవింద సమేత సినిమా లో ఆడవాళ్లకు రాజకీయలా అంటే పాలిచ్చే తల్లులకు పరిపాలించడం ఒక లెక్కనా అంటుంది .మనందరి జీవితంలో తల్లి యొక్క పాత్ర అమోఘం.అలా అని పురుషుడు గొప్ప కదా అని ప్రశ్న పుడుతుంది మనసులో, స్త్రీ, పురుషులు ఇరువురూ ప్రధానమే కానీ పురుషాహంకార ధోరణి మాత్రం సరైనది కాదు అనేది ఈ వ్యాఖ్య యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

సమాజంలో స్త్రీలు ఒక్కో కాలానికి ఒక్కో రకంగా పరివర్తన చెందుతున్నారు. పూర్వకాలంలో వేద విద్యలు నేర్చుకున్న లోపముద్ర,గార్గి, రచనలు చేసిన కవయిత్రి మొల్ల,దేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లిం మహిళ రాజియా సుల్తానా ,రాణి రుద్రమదేవి,ఝాన్సీ లక్ష్మీభాయ్, చరిత్రలో నిలిచిపోయారు.ఈ తరానికి కాస్తూర్భా గాంధీ,విజయలక్ష్మీ పండిట్,సరోజిని నాయుడు,ఆనంది బెన్ పటేల్(మొదటి మహిళ వైద్యురాలు) ,వీరనారి చాకలి ఐలమ్మ ఇంక ఎందరో ఉన్నారు.స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు ఉషా మెహతా స్వతంత్ర పోరాటంలో ఏకంగా ఒక రేడియో ను నిర్వహించేది.ఇప్పుడు పి.టి ఉష కరణం మల్లేశ్వరి క్రీడలు, ఇందిరాగాంధీ,సుష్మాస్వరాజ్ రాజకీయాలు, మిథాలి రాజ్ మొట్టమొదటి మహిళ క్రికెటర్ ,సునీత విలియుమ్స్ ,కల్పన చావ్లా మొదలగువారు వున్నారు.సినిమాలు ,రాజకీయాలు, క్రీడలు వంటి అనేక రంగాల్లో స్త్రీలు తమ పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు .మహిళామణులు గతాన్ని గుర్తు చేసుకుంటూభవిష్యత్తును మీకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోండి.ప్రతి స్త్రీ ఒక ఆదిశక్తే...
మహిళలకు ప్రోత్సాహకాలు అందించాలి వారి అభ్యున్నతికి సహాయం చేయాలి. దెబ్బతిన్న మహిళలకు ఆసరా అవ్వాలి. అన్ని రంగాలలో స్త్రీలకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలి అలా చేసినపుడు ప్రతి రోజు మహిళా దినోత్సవమే.











Comments

  1. Murthy Puthineni11 March 2026 at 08:37

    🙏Happy women's day 💐💐

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .