శ్రీనివాస కళ్యాణం
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి భక్తులు దూర ప్రాంతాలనుండి ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకొని వస్తారు. ఆనందనిలయంలో ఉన్న ఆ శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినంతనే ఎంతో ఆనందం కలుగుతుందని అంటారు.ఇది నిజంగా అనుభూతి చెందిన వారికే అనిపిస్తుంది.
ఈ రోజు మన కథ శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ,ఎన్నో కథలు గాథలు ఉన్నాయి కానీ అందులో ఒకటి మీకోసం .
ఒకనాడు మహర్షులు అందరూ కలసి లోకకళ్యాణం కొరకు యజ్ఞం చేయాలని భావించారు ఆ యజ్ఞానికి ముఖ్య అతిథిగా త్రిమూర్తులలో ఒకరిని పిలవాలని అనుకున్నారు . ఎవరు గొప్ప అయితే వారిని పిలవాలని అనుకున్నారు.ఈ ఎవరు గొప్ప అని నిర్ణయం చేయవలసిందిగా బృగు మహర్షిని పంపారు.మొదట బృగు మహర్షి సత్య లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతి మాత వీణ వాయిస్తుండగా అతను లీనమై పోయాడు. ఆశ్చర్యం అసలు బ్రహ్మ బృగు మహర్షి రాకను గమనించలేదు దానికి ఆ మహర్షి కోపంతో నీకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించాడు. బ్రహ్మ దేవుడు బాధ పడ్డాడు అందుకే బ్రహ్మ దేవుడికి గుడులు చాలా తక్కువ ఉంటాయి.
కైలాసానికి బయలుదేరాడు ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం .కైలాసంలో శివపార్వతులు ఇద్దరూ నాట్యం చేస్తున్నారు వారితో పాటు గణపతి ,కుమారస్వామి ,నంది బృంగి ,రుద్ర గణాలు కూడా ఆ నాట్య ప్రదర్శనను ఆసక్తిగా చూస్తున్నారు.బృగు సహజంగానే కోపిష్టి దానికి తోడు అతనికి అరికాలులో ఒక కన్ను ఉంది అది అతనికి అదనపు శక్తి ఉంది కదా! అందుకే అహంకారంతో ఆగ్రహాన్ని ప్రదర్శించి నువ్వు లింగాకృతిలో తప్ప మానవ రూపంలో పూజలు అందుకోలేవు అని శపించాడు.
ఈ సారి విష్ణు వంతు వాళ్ళిద్దరూ అంటే ఊరుకున్నారు కానీ విష్ణువు అలా కాదు.
బృగు మహర్షి వచ్చాడు, విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ చదరంగం ఆడుతున్నారు.క్రీడలో మునిగి ముచ్చట్లు పెట్టుకుంటున్న వారిని చూసి అప్పటికే కోపంతో వున్న భృగువు విష్ణువును కాలు ఎత్తి వక్షస్థలంపైన తన్నాడు . వెంటనే కోపం తెచ్చుకోకుండా శ్రీహరి శాంతంగా క్షమాపణలు చెప్పి అతిధి మర్యాదలు చేస్తూ బృగు అరికాలులో వున్న కన్నును చిదిమి వేశాడు.అప్పుడు అతని అహంకారం పోయి శ్రీహరి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరాడు మరల తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు.
ఇదంతా చూసిన లక్ష్మీదేవి , నేను కొలువై ఉండే వక్షస్థలాన్ని తన్నినా కూడా అతనిని శిక్షించకుండా వదిలేశాడు అని బాధపడి కోపంతో వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేకపోవడంతో శ్రీహరి అడవుల పాలు అయ్యాడు ఆమెను వెతుకుతూ శ్రీనివాసుడిగా అవతారం ఎత్తి అడవులలో తిరుగుతూ తపస్సు చేయసాగాడు.అతని చుట్టూ పుట్టలాగా తయారు అయింది. శ్రీనివాసుడి ఆకలి తీర్చడానికి కామధేనువు ప్రతిరోజు ఆ పుట్ట దగ్గరకు వచి పాలు ఇచ్చి వెళ్ళేది .కొందరు బాటసారులు ఆ పుట్టలో ఏమి ఉందో అనుకుని తవ్వడం మొదలుపెట్టారు ఆ గునపం శ్రీహరికి తాకింది అమ్మా అని అన డంతో అందరూ పారిపోయారు.అతడు తీవ్ర రక్తస్రావంతో నడుస్తూ వకులాదేవి ఇంటిదగ్గర పడిపోయాడు ఆమె అతడిని ఆదరించి తన దగ్గర ఉంచుకుని కొడుకులా పెంచుకుంది. కొన్ని రోజుల తర్వాత పద్మావతి అమ్మవారు శ్రీహరిని కలలో కనుగొని అతడిని ప్రేమించసాగింది.అతడు కూడా ఆమెను నారాయణవనంలో చూసి ఇష్టపడ్డాడు.ఈ విషయాన్ని వకుళదేవికి చెప్పాడు శ్రీనివాసుడు ఆమె పద్మావతి అమ్మవారి తండ్రిగారైన ఆకాశ రాజు దగ్గరకు వెళ్ళి అడిగింది, ఆకాశరాజు నా కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలంటే ధనం కావాలి అన్నాడు .దానికోసం శ్రీహరి కుబేరుడి దగ్గర అప్పు చేసి వివాహం ఘనంగా చేసుకున్నాడు. చేసుకొని తిరుమల కొండపైన కొలువైఉన్నాడు.
అందుకే అంటారు పెద్దలు ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం ఆమె కంట తడి పెడితే ఇంట్లో లక్ష్మీ నిలవదు సాక్షాత్తు శ్రీహరికి తప్పలేదు మనమెంత.
Comments
Post a Comment