శిఖండి కథ

ఆడవారు ఎంత ప్రేమగా అమ్మలా ఉంటారో అదేవిధంగా తనకు అన్యాయం జరిగితే అదే అమ్మ కాళికా మాత అవతారంతో తన ప్రతీకారం తీర్చుకుంటారు.అలాంటి ఒక ప్రేమ ,ఆప్యాయత,ప్రతీకారం కి సంబంధించిన కథ మన మహాభారతంలోని శిఖండిని కథ.
అనగనగా కాశీ దేశానికి ఒక రాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు అందమైన కుమార్తెలు  అంబ, అంబిక, అంబాలికలు ఉండేవారు.వారిని రాజు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.కొంతకాలం తర్వాత వారికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి అన్ని దిక్కుల నుండి రాజులు వచ్చారు. విషయం తెలుసుకున్న భీష్ముడు తన సోదరుడు విచిత్రవీర్యుడి వివాహం జరిపించాలని ఆ స్వయంవరానికి వచ్చాడు.
ఇక్కడికి వచ్చిన వారందరిలో ఎవరు బలవంతులైతే వారికి నా కూతుర్లును ఇచ్చి వివాహం చేస్తాను అని కాశి రాజు ప్రకటించాడు.అక్కడికి వచ్చిన వారందరిని ఒంటిచేత్తో భీష్ముడు ఓడించాడు అందులో సాళ్వుడు అనే యువరాజు కూడా ఉన్నాడు.
భీష్ముడు అంబ,అంబికా,అంబాలికలను తీసుకొని వాయువేగంతో హస్తినాపురానికి చేరాడు.వెళ్ళే మార్గంలో అంబ తను సాల్వుడినీ ప్రేమిస్తున్న విషయం చెప్పింది ,  భీష్ముడు అంబను గౌరవంగా  పంపించాడు.
అంబ శాల్వుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. కానీ శాల్వుడు ఇలా అన్నాడు:
“నిన్ను భీష్ముడు గెలిచి తీసుకెళ్లాడు. ఇప్పుడు నేను నిన్ను అంగీకరించలేను.”
అంబ తీవ్రంగా బాధపడింది. ఆమె నా వివాహ జీవితం నాశనం అయిపోయింది. అని
తర్వాత ఆమె తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చి:
“నువ్వే నన్ను పెళ్లి చేసుకో”
అని అడిగింది.
కానీ భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ  గురించి ఆమెకు తెలియ చెప్పాడు ,
అంబకు  న్యాయం అనిపించలేదు . ఆమె కోపంతో మండిపోయింది.
అంబ మహా ఋషి పరశురాముడి దగ్గరకు వెళ్లి తన బాధ చెప్పింది.
పరశురాముడు భీష్ముడిని పిలిచి: నేను నీ గురువుగా చెప్తున్నా 
“అంబను వివాహం చేసుకో”
అని చెప్పాడు.
కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను విడిచిపెట్టలేదు.
దాంతో పరశురాముడికి కోపం వచ్చింది  భీష్ముడు  , పరశురాముడి మధ్య  భయంకరమైన యుద్ధం జరిగింది. ఎన్నో రోజులు యుద్ధం జరిగినా ఎవ్వరూ గెలవలేదు.
చివరికి దేవతలు వచ్చి యుద్ధాన్ని ఆపించారు.
అంబ మాత్రం తన ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.
అంబ అడవికి వెళ్లి శివుడి కోసం కఠిన తపస్సు చేసింది.
శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు:
“ఈ జన్మలో కాదు… వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణం అవుతావు.”
అంబ సంతోషించింది. వెంటనే అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది.
కొంతకాలానికి పాంచాల రాజు ద్రుపదునికి ఒక శిశువు జన్మించింది. అదే శిఖండి.
శివుడి వరం వల్ల ఆమె పూర్వజన్మలో అంబ.
ద్రుపదుడు ఈ శిశువు ప్రత్యేకమని తెలుసుకొని రహస్యంగా పెంచాడు.
 శిఖండి మొదట స్త్రీగా జన్మించింది. తర్వాత యక్షుడి సహాయంతో పురుషుడిగా మారింది.
అందువల్ల శిఖండి జీవితం చాలా విచిత్రంగా మారింది. తండ్రితో పాటు అనేక యుద్ధాల్లో పాల్గొనేది.ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.
 మహాభారత యుద్ధం ప్రారంభమైంది.
అర్జునుడు మరియు పాండవులు భీష్ముడిని ఓడించలేకపోయారు. ఎందుకంటే భీష్ముడు అపారమైన యోధుడు.
అప్పుడు కృష్ణుడు ఒక రహస్యం చెప్పాడు:
“భీష్ముడు స్త్రీపై ఆయుధం ఎత్తడు. శిఖండి పూర్వజన్మలో అంబ. కాబట్టి శిఖండిని ముందుంచి యుద్ధం చేయండి.”
మరుసటి రోజు అర్జునుడు శిఖండిని రథం ముందు నిలబెట్టాడు.
భీష్ముడు శిఖండిని చూసి ఆయుధాలు వదిలేశాడు.
ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అర్జునుడు అనేక బాణాలు వదిలాడు.
భీష్ముడు బాణాల మంచంపై పడిపోయాడు. శిఖండి ఎన్నో అవమానాలు పడింది చివరకు 
ఇలా  తన ప్రతీకారం తీర్చుకుంది.
అవమానం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది.
ప్రతిజ్ఞలు కొన్ని సార్లు జీవితాలను నాశనం చేస్తాయి.
ధర్మం, అధర్మం మధ్య గీత చాలా సున్నితమైనది.
ఒకరి బాధను తక్కువగా చూడకూడదు.

Comments

Popular posts from this blog

రామచిలుక కథ

ఐకమత్యమే మహాబలం.

అంతా మన మంచికే...