భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. అదేంటంటే, ఆధ్యాత్మిక సాధనలో చేసే ఏ ప్రయత్నమూ ఎప్పటికీ వృథా కాదు. మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ విధంగా ప్రయత్నిస్తారు. కొందరికి సత్యాన్ని గ్రహించడానికి ఎక్కువ సమయం పడుతుంది, మరికొందరు త్వరగా తెలుసుకుంటారు. ఇది వారి శ్రద్ధ, పట్టుదల, సాధనపై ఆధారపడి ఉంటుంది. అందుకే గీతలో "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అని చెప్పబడింది. సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నవాడు తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటాడని గీత బోధిస్తుంది.
భృగు మహర్షి బ్రహ్మదేవుని మానస పుత్రుడు. ఒకరోజు ఆయన తన తండ్రిని అడిగాడు:
"దేవుడు ఎవరు? ఆయనను ఎలా తెలుసుకోవాలి?"
అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు:
"తపస్సు ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. బ్రహ్మం మాటలకు అందదు, మనసుకు పూర్తిగా అర్థం కాదు. అనుభవం ద్వారానే దానిని తెలుసుకోవాలి."
తండ్రి మాటలలోని లోతైన అర్థాన్ని గ్రహించిన భృగు మహర్షి అరణ్యానికి వెళ్లి కఠోర తపస్సు ప్రారంభించాడు. దీర్ఘకాల ధ్యానం, ఆత్మపరిశీలన తర్వాత ఒక విషయాన్ని గుర్తించాడు. ప్రతి జీవి ఆహారం నుంచే పుడుతుంది, ఆహారం వల్లనే జీవిస్తుంది, చివరకు ఆహారంలోనే లీనమవుతుంది. అందుకే ఆనందంతో తండ్రి వద్దకు వెళ్లి,
"అన్నమే బ్రహ్మం అని తెలుసుకున్నాను" అని చెప్పాడు.
బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, అతన్ని మెచ్చుకోలేదు, తిరస్కరించలేదు. కేవలం ఒక మాట మాత్రమే చెప్పాడు:
"ఇంకా లోతుగా తపస్సు చేయి."
మళ్లీ అరణ్యానికి వెళ్లిన భృగు ఇలా ఆలోచించాడు:
"అన్నం మాత్రమే బ్రహ్మం కాకపోతే, మరి ప్రాణమే బ్రహ్మం కావాలి. ఎందుకంటే ప్రాణం ఉన్నప్పుడే శరీరం పనిచేస్తుంది."
ఈసారి కూడా తండ్రి ఆ సమాధానాన్ని అంగీకరించలేదు.
తరువాత భృగు మనసే బ్రహ్మమని భావించాడు. అది కూడా కాదన్నాడు బ్రహ్మదేవుడు. ఆపై బుద్ధి, వివేకం, విజ్ఞానం—ఇవే బ్రహ్మమని అనుకున్నా, అవి కూడా బ్రహ్మస్వరూపం కాదని తండ్రి వివరించాడు.
అప్పుడు భృగు మహర్షి గ్రహించాడు:
"అన్నం కాదు... ప్రాణం కాదు... మనసు కాదు... బుద్ధి కాదు... విజ్ఞానం కూడా కాదు. వీటన్నింటికీ మూలమైన పరమసత్యం ఇంకేదో ఉంది."
అని భావించి మరింత తీవ్రమైన ధ్యానంలో లీనమయ్యాడు.
చివరకు నిరంతర తపస్సు, అచంచలమైన శ్రద్ధ, ఆత్మానుభూతి ద్వారా ఆయన బ్రహ్మసత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు.
ఆ సమయంలో ఆయనకు ఒక మహత్తరమైన సత్యం తెలిసింది.
"ఆనందమే బ్రహ్మం."
ఈ ప్రపంచంలోని ప్రతి జీవి కోరుకునేది ఆనందాన్నే. ఎవరూ దుఃఖాన్ని కోరుకోరు. ప్రతి ఆలోచన, ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యం వెనుక ఉన్న అంతిమ లక్ష్యం ఆనందమే. కాబట్టి సమస్త సృష్టికి మూలమైన బ్రహ్మ స్వరూపం కూడా ఆనందమే అని భృగు మహర్షి అనుభవపూర్వకంగా గ్రహించాడు.
ఈసారి ఆయన తన తండ్రి వద్దకు తిరిగి వెళ్లలేదు. ఎందుకంటే వెతికిన సత్యాన్ని ఇప్పటికే పొందాడు. అడవిలోనే ధ్యానస్థితిలో కూర్చొని, పరమానందంలో పూర్తిగా లీనమై జీవించాడు.
నిజమైన జ్ఞానం పుస్తకాల ద్వారా మాత్రమే రాదు. నిరంతర సాధన, శ్రద్ధ, ఆత్మపరిశీలన, మరియు ప్రత్యక్ష అనుభవం ద్వారానే పరమసత్యం తెలుస్తుంది. అందుకే ఉపనిషత్తులు చెబుతున్నాయి—"ఆనందో బ్రహ్మేతి" (ఆనందమే బ్రహ్మం).
అందుకే అన్ని నేర్చుకొని ఙ్ఞాన సముపార్జన చేయాలి ధనం ఈ రోజు ఉంటుంది రేపు వుండదు శాశ్వతమైన వాటిని సంపాదించుకోవాలి .ధన మూలం ఇదం జగత్ అంటారు కానీ ధనమే జగత్తు మొత్తం కాదు .
మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరి ప్రభావంతో కోల్పోవద్దు.
ఇంత జ్ఞానాన్ని సంపాదించిన భృగు మహర్షి తన కోపాన్ని నిగ్రహం చేసుకోలేక సాక్షాత్తు శ్రీహరిని కాలు ఎత్తి తన్నాడు ఆ కథ మీకోసం.
ఒకనాడు మహర్షులు అందరూ కలసి లోకకళ్యాణం కొరకు యజ్ఞం చేయాలని భావించారు ఆ యజ్ఞానికి ముఖ్య అతిథిగా త్రిమూర్తులలో ఒకరిని పిలవాలని అనుకున్నారు . ఎవరు గొప్ప అయితే వారిని పిలవాలని అనుకున్నారు.ఈ ఎవరు గొప్ప అని నిర్ణయం చేయవలసిందిగా బృగు మహర్షిని పంపారు.మొదట బృగు మహర్షి సత్య లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతి మాత వీణ వాయిస్తుండగా అతను లీనమై పోయాడు. ఆశ్చర్యం అసలు బ్రహ్మ బృగు మహర్షి రాకను గమనించలేదు దానికి ఆ మహర్షి కోపంతో నీకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించాడు. బ్రహ్మ దేవుడు బాధ పడ్డాడు అందుకే బ్రహ్మ దేవుడికి గుడులు చాలా తక్కువ ఉంటాయి.
కైలాసానికి బయలుదేరాడు ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం .కైలాసంలో శివపార్వతులు ఇద్దరూ నాట్యం చేస్తున్నారు వారితో పాటు గణపతి ,కుమారస్వామి ,నంది బృంగి ,రుద్ర గణాలు కూడా ఆ నాట్య ప్రదర్శనను ఆసక్తిగా చూస్తున్నారు.బృగు సహజంగానే కోపిష్టి దానికి తోడు అతనికి అరికాలులో ఒక కన్ను ఉంది అది అతనికి అదనపు శక్తి ఉంది కదా! అందుకే అహంకారంతో ఆగ్రహాన్ని ప్రదర్శించి నువ్వు లింగాకృతిలో తప్ప మానవ రూపంలో పూజలు అందుకోలేవు అని శపించాడు.
ఈ సారి విష్ణు వంతు వాళ్ళిద్దరూ అంటే ఊరుకున్నారు కానీ విష్ణువు అలా కాదు.
బృగు మహర్షి వచ్చాడు, విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ చదరంగం ఆడుతున్నారు.క్రీడలో మునిగి ముచ్చట్లు పెట్టుకుంటున్న వారిని చూసి అప్పటికే కోపంతో వున్న భృగువు విష్ణువును కాలు ఎత్తి వక్షస్థలంపైన తన్నాడు . వెంటనే కోపం తెచ్చుకోకుండా శ్రీహరి శాంతంగా క్షమాపణలు చెప్పి అతిధి మర్యాదలు చేస్తూ బృగు అరికాలులో వున్న కన్నును చిదిమి వేశాడు.అప్పుడు అతని అహంకారం పోయి శ్రీహరి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరాడు మరల తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు.
ఎంత ఙ్ఞానం సంపాదించినా అహన్ని జయించకపోతే మన ఙ్ఞానం వృధా .
Comments
Post a Comment