Skip to main content

Mahabharatham లో ekalavya katha (ekalavya story)

  మీకు ఎప్పుడూ చెప్పినా మహాభారతం లోని కథలే చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మహాభారతంలో లేనిది లోకంలో లేదు లోకంలో లేనిది ఏది మహాభారతంలో ఉండదు అని ఒక సామెత. ఒకప్పుడు హస్తినాపురానికి దగ్గరలో ఉన్న అడవిలో హిరణ్యధనుస్సు అనే గిరిజన రాజు నివసించేవాడు. అతనికి ఏకలవ్యుడు అనే కుమారుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే ఏకలవ్యుడికి విలువిద్య అంటే ఎంతో ఇష్టం. అతను ప్రపంచంలోనే గొప్ప ధనుర్ధారి కావాలని కలలు కనేవాడు.
ఆ కాలంలో విలువిద్యలో అత్యంత ప్రఖ్యాత గురువు ద్రోణాచార్యుడు. ఆయన వద్దే కౌరవులు, పాండవులు విద్యలు నేర్చుకుంటుండేవారు. ఒకరోజు ఏకలవ్యుడు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి నమస్కరించి,
“గురువర్యా! నాకు కూడా విలువిద్య నేర్పించండి” అని వినయంగా అడిగాడు.
ద్రోణాచార్యుడు అతని వేషధారణ చూసి,
“నేను రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పుతాను” అని చెప్పి తిరస్కరించాడు.
ఆ మాటలు విన్న ఏకలవ్యుడు చాలా బాధపడ్డాడు. కానీ తన కలను వదలలేదు. అడవికి తిరిగి వెళ్లి మట్టితో ద్రోణాచార్యుడి విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ విగ్రహాన్ని గురువుగా భావించి ప్రతిరోజూ  వారికి నేర్పించేటపుడు చూసి సాధన  చేయసాగాడు.
అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి విలువిద్య అభ్యసించేవాడు. రోజులు గడిచేకొద్దీ అతని ప్రతిభ అద్భుతంగా పెరిగింది. లక్ష్యాన్ని ఎప్పుడూ తప్పకుండా బాణం సంధించగలిగే స్థాయికి చేరుకున్నాడు.
ఒకరోజు అర్జునుడు మరియు ఇతర పాండవులు అడవిలో వేటకు వెళ్లారు. వారి కుక్క ఒకచోట మొరుగుతుండగా, ఒక్కసారిగా దాని నోరు బాణాలతో నిండిపోయింది. కానీ కుక్కకు ఎలాంటి గాయం కాలేదు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
“ఇంత అద్భుతమైన ధనుర్విద్య ఎవరిది?” అని వెతుకుతూ వెళ్లగా అక్కడ ఏకలవ్యుడు సాధన చేస్తూ కనిపించాడు.
అర్జునుడు ఆశ్చర్యపడి ద్రోణాచార్యుడిని అడిగాడు:
“గురువర్యా! మీరు నన్నే ప్రపంచంలో గొప్ప ధనుర్ధారి చేస్తానని చెప్పారు. అయితే ఇతడు ఎవరు?”
అప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి వద్దకు వెళ్లి,
“నీవు ఎవరి శిష్యుడు?” అని అడిగాడు.
ఏకలవ్యుడు వినయంగా,
“గురువర్యా! మీరు నా గురువు. మీ విగ్రహాన్ని పెట్టుకొని నేర్చుకున్నాను” అని చెప్పాడు.
ద్రోణాచార్యుడు కొద్దిసేపు ఆలోచించి, ఇతను అర్జునుడికంటే గొప్ప ధనుర్ధారి అవుతాడు ,అలా అవడం నాకు ఇష్టం లేదు అనుకున్నాడు.సరే ఇన్ని రోజులు నా ప్రతిమను ఉపయోగించి విద్య నేర్చావు కనుక నాకు గురుదక్షిణగా నీ కుడి చేతి బొటనవేలు నాకు ఇవ్వాలి” అన్నాడు.
గురువు మాటను దేవుని మాటగా భావించిన ఏకలవ్యుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన బొటనవేలు కోసి గురువుకి సమర్పించాడు.
అప్పటి నుంచి అతను మునుపటిలా విలువిద్య చేయలేకపోయినా, గురుభక్తి మరియు పట్టుదలకు ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయాడు.
నిజమైన పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా దాటవచ్చు.
గురువుపై భక్తి గొప్పది.
కష్టపడి సాధన చేస్తే అసాధ్యమేమీ లేదు

Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .