ఆహార సూత్రాలు.

తాతయ్య ఒక కథ చెప్పావా ? అని అడిగింది చిట్టి. రోజూ కథ ఎందుకు చెప్పాలి, ఈ రోజు నీకు ఒక మంచి విషయం చెప్తాను చిట్టీ అని చెప్పాడు.సరే తాతయ్య ఏదో ఒకటి చెప్పు నేర్చుకుంట అన్నది. అవును ఏ మంచి విషయం చెప్తావు తాత అన్నది .
అదే తినడం గురించి, అంటే తాతయ్య?మనం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం అన్న విషయం.సరే తాత ఇదేదో విచిత్రంగా ఉంది రోజు తినే అన్నం తినడానికి కూడా పద్ధతులు ఉన్నాయా? .
హితంగా తినాలి,మితంగా తినాలి,ఋతు అనుగుణంగా తినాలి అంటారు పెద్దలు.ఏం తినాలో,ఎంత తినాలో,ఎప్పుడూ తినాలో చూసుకొని తినాలి.ఆహారం ఎలా తినాలో తెలిస్తే ఆరోగ్యంగా మారుతుంది అమృతంగా బతికిస్తుంది.
 వైశ్వనర విద్యగా పిలిచే ఈ విధానాన్ని  మన పూర్వీకులు ఓ యజ్ఞంలాగ ఆచరించారు.ఇప్పుడు మాత్రం నూటికి 90 మంది ఆహార సూత్రాల విషయంలో అలసత్వం వహిస్తున్నారు.
      అవునా తాతా భోజనం చేయడం ఓ యజ్ఞమా ? అవును చిట్టి భోజనం చేయడం ఒక యజ్ఞం.
మన ఋషులు మోక్ష సాధన గురించే కాక ఇహ లోకంలో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు.మనం తినే ఆహారం త్రాగే నీరు స్వచ్చంగా ఉండాలి.మనకు వచ్చే ఎక్కువ రోగాలలో అత్యధిక శాతం జీర్ణ వ్యవస్థకు చెందినవే అయి ఉంటాయి. పూర్వం మనం ఆహారం కింద కూర్చొని అరిటాకులో తినేవాళ్ళమూ,ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా బంతిలో అందరూ వరుసగా కూర్చొని అరిటాకులో కలిసి భోజనం చేసేవారు.  కానీ ఇప్పుడు అందరూ నిలబడి బఫెలో  తింటున్నారు.కనీసం కూర్చొని తినే అలవాటు కూడా పోయింది . ఎందుకు తాత అలా? నిలబడి తింటే ఏమవుతుంది. ఆహారం సరిగ్గా  జీర్ణం అవదు .   అరటి ఆకులో తినడం అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.అరటాకులో పాలిఫెనల్స్,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.వేడి వేడి  ఆహారాన్ని ఆకులో వడ్డించినపుడు ఆకులోనీ పోషకాలు ఆహారంతో కలిసి మన శరీరానికి అందుతాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, హానికారక బాక్టీరియాను ఇవి నశింపచేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,ఇప్పుడు వస్తున్న ప్లాస్టిక్ , థెర్మకోల్ ప్లేట్ లతో పోలిస్తే అరటి ఆకులు సురక్షితం అయినవి,విషపూరితం కావు.పర్యావరణం హితంగా ఉంటాయి. సరే తాత నేను కూడా ఇప్పటి నుండి అరిటాకులో తింటాను.
ఆహారంలో నమిలేవి,కొరికేవి చీకేవి,తాగేవి ఇలా రకరకాలుగా ఉంటాయి. తినేవి ఎప్పుడైనా ఆరోగ్యం పెంచేవిగా ఉండాలి. మనం తినే ఆహారంలో ఆకుకూరలు,  కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు,తృణధాన్యాలు,గింజలు మరియు విత్తనాలు,విటమిన్లు మరియు ఖనిజాలు మనం ఆహారంగా  తీసుకోవాలి.రోజుకు కనీసం 400 గ్రా పండ్లు మరియు కూరగాయలు తినాలి. చక్కెర తక్కువ తీసుకోవాలి,ఉప్పు తగ్గించాలి, క్రమం తప్పకుండా నీరు త్రాగాలి. ఆహారంపై శ్రద్ధ పెట్టీ మరీ తినాలి,ప్రశాంతమైన వాతావరణంలో మౌనంగా తినాలి టీవీ చూసుకుంటూ మొబైల్ చూస్తూ తింటూవుంటే మనం ఏం తింటున్నామో కూడా తెలియదు. ఆహారాన్ని బాగా ఆస్వాదిస్తూ తినాలి. Kuku with jathiratnalu show లో  ఆశిష్ విద్యార్థి  తినే విధాన్ని చూస్తే  తినాలి అనిపిస్తుంది. చాలా తక్కువ మంది ఆహారాన్ని ఆస్వాదిస్తూ  తింటారు.   ఆహారాన్ని బాగా నమిలి తినాలి దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఆహారంలో  షడ్రసోపేత రుచులు ఉండాలి.
 మనకు బాగా ఆకలి వేసినపుడే తినాలి, ఎపుడు పడితే అపుడు తినొద్దు  సమయానికి తినాలి  ఆహారానికి గౌరవం  ఇవ్వాలి. ఎందుకంటే  ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 lit  నీరు అవసరం అవుతుంది .ఎంత అవసరమో అంతే పెట్టుకొని తగినంత పరిమాణం తినాలి . రెండు వంతుల అన్నం ,ఒక వంతు నీరు ఉంటేట్లు చూసుకోవాలి .ఒక భాగం ఖాళీ ఉంటే త్వరగా జీర్ణం అవుతుంది, ఎప్పుడైనా అలాగే తినాలి.   డైటింగ్ వంటి చేష్టలు  చేయకూడదు మంచిగా తినుకుంటూ  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి  . ఇప్పుడు అర్థం అయిందా చిట్టి ఆహారం ఎలా తినాలో ,ఏం తినాలో  ,ఎందుకు తినాలో .అవును తాతయ్య ఇప్పటి నుండి నేను కూడా ఆహారాన్ని ఆస్వాదిస్తూ, గౌరవిస్తూ,తింటా.
   






Comments

Post a Comment

Popular posts from this blog

రామచిలుక కథ

అంతా మన మంచికే...

ఐకమత్యమే మహాబలం.