గోదా కల్యాణం

గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ వచ్చెనమ్మా
శ్రీ విల్లిపుత్తూర్ నుండి గోదాదేవి వచ్చెనమ్మా మన కృష్ణుణ్ణి పెళ్లాడ  వచ్చెనమ్మా. 
ఈ పాట నిజంగా వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఈ పాట అందరికి తెలుసు .మన గోదాదేవి కల్యాణం పాట కాబట్టి .
ఈ రోజు మన కథ గోదా కల్యాణం కథ.ఆమె ఎవరు ?ఆమె కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది ? అని ఆమెని గురించి తెలుసుకుందాం.
శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు.అతని చిత్తం ఎల్లప్పుడూ విష్ణువు మీదనే ఉండడం వల్ల అతనికి విష్ణుచిత్తుడు అనే పేరు వచ్చింది ఇతను ఆళ్వార్ లలో ఒకరు మరియు పెద్ద ఆళ్వార్ . విష్ణుచిత్తుడు ఒక తోట పెంచేవాడు ఆ తోటలో మొక్కలకు పాదులు తీసే సమయంలో తులసి మొక్కల దగ్గర ఒక చిన్న పాప దొరికింది. ఆమెకు కోదై అనే పేరు పెట్టాడు  కోదై అంటే పూలమాల అని అర్థం అది  క్రమంగా గోద గా మారింది.
  ఆమెను విష్ణుచిత్తుడు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.గోదకు ప్రతిరోజు చిన్ని కృష్ణుడి లీలలు చెప్పేవాడు ఆమె ఎంతో శ్రద్ధతో వినేది .ఆమె కృష్ణుడి కథ లేకుండా నిద్రపోయేది కాదు .అలా అలా పెరిగి పెద్దది అయింది .చిన్నతనం నుండి కృష్ణుని గురించి వినడం వల్ల ఆమె ఎలా అయినా కృష్ణుని పొందాలని భావించింది.దానికోసం ఆమె గోపికలు చేసిన కాత్యాయని వ్రతం చేయాలని అనుకుంది.కాత్యాయని వ్రతం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి ఆమె తనతో పాటు తన స్నేహితురాళ్లను కూడా ఈ వ్రతానికి ప్రోత్సహించింది.తన స్నేహితురాళ్లను నిద్ర లేపడానికి ప్రతిరోజు పాటలు పాడేది కృష్ణుడి పైన తన భక్తినంత పాట రూపంలో తెలియ జేసింది ఇవి అన్ని 30 పాశురాలుగా ప్రసిద్ధి చెందాయి.వాటిని తిరుప్పావై అంటారు.
ఆమె భూదేవి అంశ కాబట్టి ఒక తల్లి పిల్లలకు ఎలా చెప్పాలో అన్ని విషయాలు తను ముప్పై పాశురాలలో వివరించింది.అలా చేసిన వ్రతానికి కృషుడు లొంగిపోయాడు .భగవంతుడు ఎప్పుడూ భక్తుడికి , భక్తికి దాసోహం అవుతాడు ఎందుకంటే ఆ భక్తి అచంచలమైనది అనిర్వచనీయమైనది.
ఆమె కట్టిన పూల మాలలు ముందుగా తాను ధరించి అద్దంలో చూసుకుని మురిసేది అవే కృష్ణుడికి అర్పించేది.ఒకరోజు విష్ణుచిత్తుడు ఆ మాలలు తీసుకొని వెళుతుంటే గోదా అమ్మవారి వెంట్రుక కనిపించింది .అలా ఎందుకు జరిగింది అపచారం అని భావించి ఆ మాలలు పక్కన పెట్టారు తర్వాత విష్ణుచిత్తుడికి కలలో స్వామి కనిపించి నాకు ఆ మాలలు వేయాలని చెప్పాడు.ఆ కల గురించి ఆ ఆలయ పూజారులకు చెప్పాడు వారు నమ్మలేదు.స్వామి ప్రత్యక్షమై గోదా అమ్మవారిని నేను పెళ్లి చేసుకుంటాను ఆమెను తీసుకొని శ్రీరంగం రమ్మని విష్ణుచిత్తుడుకి  చెప్పారు అంట. శ్రీరంగంలో పూజారులు ముందుగానే విషయం తెలుసుకుని వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు, అందరూ కూడా  వచ్చారు.గోదాదేవి అందరూ చూస్తుండగానే రంగనాథుడిలో ఐక్యం అయింది.ఆ చిత్రానికి అందరూ ఆశ్చర్యం పొందారు. ఇది భోగినాడు జరిగింది కాబట్టి ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి రోజు గోదా కల్యాణం జరిపిస్తారు.ఆమె పాశురాలని తిరుప్పావై గా చదువుతారు.















Comments

Post a Comment

Popular posts from this blog

రామచిలుక కథ

అంతా మన మంచికే...

ఐకమత్యమే మహాబలం.